Thursday, May 22, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

పాకిస్తాన్ కోసం పని చేసా: ఒప్పుకున్న జ్యోతీ మల్హోత్రా

వాడుకలో లేని ఎయిర్‌బేస్‌ పునరుద్ధరణకు చైనా ప్రయత్నాలు, ఎందుకు? – 2

వాడుకలో లేని ఎయిర్‌బేస్‌ పునరుద్ధరణకు చైనా ప్రయత్నాలు, ఎందుకు? – 1

ఎన్‌కౌంటర్ ‌: 28 మంది మావోయిస్టులు హతం

ఉపాధ్యాయుల బదిలీలకు ఉత్తర్వులు జారీ

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

పాకిస్తాన్ కోసం పని చేసా: ఒప్పుకున్న జ్యోతీ మల్హోత్రా

వాడుకలో లేని ఎయిర్‌బేస్‌ పునరుద్ధరణకు చైనా ప్రయత్నాలు, ఎందుకు? – 2

వాడుకలో లేని ఎయిర్‌బేస్‌ పునరుద్ధరణకు చైనా ప్రయత్నాలు, ఎందుకు? – 1

ఎన్‌కౌంటర్ ‌: 28 మంది మావోయిస్టులు హతం

ఉపాధ్యాయుల బదిలీలకు ఉత్తర్వులు జారీ

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home ఆర్థికం

రూ.21వేల కోట్లు దాటిన భారత రక్షణ రంగ ఎగుమతులు

param by param
May 12, 2024, 09:08 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

India’s defence exports cross Rs 21000 crore mark

స్వతంత్ర భారత చరిత్రలో మొట్టమొదటిసారి రక్షణ రంగంలో
మన ఎగుమతుల విలువ రూ.21వేల కోట్లు దాటింది. ఆ విషయాన్ని కేంద్ర రక్షణ శాఖ మంత్రి
రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు.

‘‘భారతదేశపు రక్షణ రంగ ఎగుమతులు ఇంతకుముందెన్నడూ
లేనంత ఎత్తులకు ఎగబాకాయి. రూ.21000 కోట్ల స్థాయిని దాటాయి. స్వతంత్ర భారతదేశ
చరిత్రలో మొట్టమొదటిసారిగా మన దేశపు రక్షణ రంగ ఎగుమతుల విలువ 2023-24 ఆర్థిక
సంవత్సరంలో రూ.21,083 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే ఇది 32.5శాతం
అద్భుతమైన అభివృద్ధి’’ అంటూ రాజ్‌నాథ్‌ సింగ్ తన ‘ఎక్స్’ సోషల్ మీడియా అకౌంట్‌లో
ప్రకటించారు.

భారతదేశ రక్షణ రంగ ఉత్పత్తులను 84 కంటె ఎక్కువ
దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయి. ఈ అద్భుత అభివృద్ధికి ప్రధాన కారణం మన దేశపు
ఉమ్మడి ప్రయత్నాలూ, మన రక్షణ శాఖ వ్యూహాత్మక చర్యలే. ప్రత్యేకించి, ప్రధానమంత్రి
నరేంద్రమోదీ నాయకత్వంలోని కేంద్రప్రభుత్వం రక్షణ ఉత్పాదక రంగంలో మన దేశపు
సామర్థ్యాన్ని, దేశీయంగా రక్షణ రంగంలో ఉత్పాదకతను ప్రోత్సహిస్తోంది.

భారత ప్రభుత్వ రక్షణ శాఖ తీసుకున్న చర్యల వల్ల రక్షణ
అవసరాల ఉత్పాదక రంగం సాంకేతికంగా గణనీయమైన పురోగతి సాధించింది. అంతేకాదు, దేశీయ
రక్షణ రంగ ఎగుమతులను పెంచడానికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలోని సంస్థలకు తగిన సానుకూల
వాతావరణాన్ని కూడా సృష్టించింది.  

రక్షణ ఉత్పత్తుల ఎగుమతుల్లో భారత్ సాధించిన ఈ ఘన
విజయంలో సుమారు 50 వరకూ భారతీయ కంపెనీల సమష్టి కృషి ఉంది. ఆయా కంపెనీల నిరంతర శ్రమ,
సృజనాత్మకత, సమర్థత, నాణ్యతా ప్రమాణాల కారణంగానే, ఆ రంగంలో మన దేశపు పేరుప్రతిష్ఠలు
ఇనుమడించాయి.

భారత్ ప్రస్తుతం రక్షణ రంగ ఉత్పత్తులు
ప్రపంచంలోని నలువైపులా విస్తరించాయి. ఇటలీ, మాల్దీవులు, శ్రీలంక, రష్యా, యుఎఇ,
పోలండ్, ఫిలిప్పైన్స్, సౌదీ అరేబియా, ఈజిప్ట్, ఇజ్రాయెల్, స్పెయిన్, చిలీ తదితర
దేశాలు మన రక్షణ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నాయి.

ఇలా మన రక్షణ రంగ ఉత్పత్తులు వివిధ దేశాలకు
విస్తరించడం వల్ల, వాటి ప్రమాణాలు బాగుండడం వల్ల వాటికి డిమాండ్ నానాటికీ
పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల రక్షణ అవసరాలను తీర్చగలిగేలా
ఉత్పత్తులు తయారుచేయడం, వాటిని సమర్థంగా సకాలంలో ఎగుమతి చేయడంలో భారతీయ సంస్థలు మంచిపేరు
గడించాయి.

భారతీయ కంపెనీల ఉత్పత్తుల్లో ప్రధానంగా వ్యక్తిగత
రక్షణ ఉపకరణాలు, ఆఫ్‌షోర్ పెట్రోల్ వాహనాలు, ఎఎల్‌హెచ్ హెలికాప్టర్లు, ఎస్‌యు
ఏవియానిక్స్, తీరప్రాంత నిఘా వ్యవస్థలు, తేలికపాటి ఇంజనీరింగ్ మెకానికల్ పార్ట్స్,
కవచ్ వ్యవస్థ ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయి.  

ఈ అత్యాధునిక రక్షణ సాంకేతికతలు, పరికరాలకు
అంతర్జాతీయ కొనుగోలుదార్ల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. తద్వారా డిఫెన్స్ హార్డ్‌వేర్‌
ఎగుమతుల్లో భారత్ గొప్ప ఎగుమతిదారుగా నిలుస్తోంది.

Tags: Defence ExportsIndiaNarendra ModiNew RecordRajnath Singh
ShareTweetSendShare

Related News

యూకో బ్యాంకు మాజీ సీఎండీ గోయల్ అరెస్ట్
general

యూకో బ్యాంకు మాజీ సీఎండీ గోయల్ అరెస్ట్

భారత్‌తో వాణిజ్య సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకుంటాం : బంగ్లా ప్రధాని
general

భారత్‌తో వాణిజ్య సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకుంటాం : బంగ్లా ప్రధాని

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు
general

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను
general

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

సెన్సెక్స్ దూకుడు : ఒకే రోజు రూ.16 లక్షల కోట్లు పెరిగిన సంపద
Latest News

సెన్సెక్స్ దూకుడు : ఒకే రోజు రూ.16 లక్షల కోట్లు పెరిగిన సంపద

Latest News

పాకిస్తాన్ కోసం పని చేసా: ఒప్పుకున్న జ్యోతీ మల్హోత్రా

పాకిస్తాన్ కోసం పని చేసా: ఒప్పుకున్న జ్యోతీ మల్హోత్రా

వాడుకలో లేని ఎయిర్‌బేస్‌ పునరుద్ధరణకు చైనా ప్రయత్నాలు, ఎందుకు? – 1

వాడుకలో లేని ఎయిర్‌బేస్‌ పునరుద్ధరణకు చైనా ప్రయత్నాలు, ఎందుకు? – 2

వాడుకలో లేని ఎయిర్‌బేస్‌ పునరుద్ధరణకు చైనా ప్రయత్నాలు, ఎందుకు? – 1

వాడుకలో లేని ఎయిర్‌బేస్‌ పునరుద్ధరణకు చైనా ప్రయత్నాలు, ఎందుకు? – 1

ఎన్‌కౌంటర్ ‌: 28 మంది మావోయిస్టులు హతం

ఎన్‌కౌంటర్ ‌: 28 మంది మావోయిస్టులు హతం

ఉపాధ్యాయుల బదిలీలకు ఉత్తర్వులు జారీ

ఉపాధ్యాయుల బదిలీలకు ఉత్తర్వులు జారీ

పాక్ సైన్యం బలహీనతలను బైటపెట్టిన బలోచ్ స్వతంత్ర సమరయోధులు

పాక్ సైన్యం బలహీనతలను బైటపెట్టిన బలోచ్ స్వతంత్ర సమరయోధులు

ఏపీ క్యాబినెట్‌లో రూ.35 వేల కోట్ల పెట్టుబడులకు అనుమతి…పరిశ్రమలకు భూ కేటాయింపు

ఏపీ క్యాబినెట్‌లో రూ.35 వేల కోట్ల పెట్టుబడులకు అనుమతి…పరిశ్రమలకు భూ కేటాయింపు

ఆపరేషన్ ‘సిందూర్’ వేళ సైన్యాన్ని వేగంగా మోహరించడానికి సాయపడిన విన్యాసాలు

ఆపరేషన్ ‘సిందూర్’ వేళ సైన్యాన్ని వేగంగా మోహరించడానికి సాయపడిన విన్యాసాలు

విరిగిపడిన కొండచరియలు : చిక్కుకుపోయిన వందలాది యాత్రికులు

విరిగిపడిన కొండచరియలు : చిక్కుకుపోయిన వందలాది యాత్రికులు

క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం

క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.