Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home రాజకీయం

Women’s Reservation Bill : మహిళా కోటా బిల్లుకు లోక్‌సభ ఆమోదం

param by param
May 11, 2024, 05:36 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించే మహిళా బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. 8 గంటల సుదీర్ఘ చర్చ తరవాత బిల్లుకు దాదాపు ఏకగ్రీవ సమ్మతి లభించింది. ఈ బిల్లుపై జరిగిన ఓటింగ్‌లో 456 మంది పాల్గొనగా కేవలం ఇద్దరు మాత్రమే వ్యతిరేకించారు. 454 మంది బిల్లుకు అనుకూలంగా ఓటేశారు. మహిళా బిల్లుకు ఆమోదం లభించడంతో దేశంలోని అన్ని చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు కానుంది.

కేంద్ర మంత్రి అర్జున్ మేఘ్‌వాల్ మహిళా బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై
సుదీర్ఘ చర్చ జరిగింది. వివిధ పార్టీలకు చెందిన 60 మంది సభ్యులు తమ అభిప్రాయాలు తెలిపారు. బిల్లును వెంటనే అమల్లోకి తేవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూనే, బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇచ్చాయి. 2024 సార్వత్రిక ఎన్నికలు కాగానే జన గణన, డీలిమిటేషన్ చేపట్టనున్నట్టు హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. సాధ్యమైనంత త్వరగా బిల్లును అమల్లోకి తీసుకొస్తామని షా హామీ ఇచ్చారు. ఈ బిల్లుపై లోక్‌సభలో 27 మంది మహిళా ఎంపీలు మాట్లాడారు. అందరూ బిల్లుకు మద్దతు పలికారు. ప్రస్తుతం సభలో 82 మంది మహిళా సభ్యులుండగా, రిజర్వేషన్ అమలు తరవాత వారి సంఖ్య 181కి పెరగనుంది. ఈ బిల్లును ఎంఐఎంకు చెందిన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఔరంగాబాద్ ఎంపీ సయ్యద్ ఇంతియాజ్ జలీల్ వ్యతిరేకించారు.

మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదానికి మద్దతు తెలిపిన అందరికీ ప్రధాని కృతజ్జతలు తెలిపారు. నారీ శక్తి వందన్ అధినియమ్ చరిత్రాత్మకమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ బిల్లు మహిళలకు మరింత సాధికారత ఇస్తుందన్నారు. దేశ రాజకీయ ప్రక్రియలో మహిళల భాగస్వామ్యం పెరుగుతుందని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.

మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రధాన ప్రతిపక్ష నేతలు సోనియా, రాహుల్ గాంధీ మాట్లాడారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు పలికారు. అయితే మహిళా రిజర్వేషన్లలో ఓబీసీలకు కోటా లేకపోవడంపై రాహుల్ గాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్లమెంటు పాత భవనం నుంచి కొత్త భవనంలోకి మారినప్పుడు రాష్ట్రపతిని ఆహ్వానించాల్సిందని ఆయన సలహా ఇచ్చారు. కుల గణన వెంటనే చేపట్టాలని రాహుల్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వంలోని 90 శాఖల కార్యదర్శుల్లో కేవలం ముగ్గురే ఓబీసీలు ఉన్నారని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా బిల్లుపై అన్ని పార్టీల నేతలకు మాట్లాడే అవకాశం కల్పించారు.

ShareTweetSendShare

Related News

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు
general

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన
general

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన

ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ
general

ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ

వైసీపీ నేత వల్లభనేని వంశీకి అస్వస్థత
general

వైసీపీ నేత వల్లభనేని వంశీకి అస్వస్థత

మానవాళికి ఉగ్రవాదం అతిపెద్ద ముప్పు : ప్రధాని నరేంద్ర మోదీ
general

మానవాళికి ఉగ్రవాదం అతిపెద్ద ముప్పు : ప్రధాని నరేంద్ర మోదీ

Latest News

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.