Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home రాజకీయం

Pawan Kalyan : చంద్రబాబు భద్రతపై ప్రధాని, హోం మంత్రికి వివరిస్తా

param by param
May 11, 2024, 05:22 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజమండ్రి కేంద్ర కారాగారంలో టీడీపీ అధినేత చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు. స్కిల్ డెవలప్‌మెంట్ పథకంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ చంద్రబాబు రాజమండ్రి జైల్లో రిమాండులో ఉన్న సంగతి తెలిసిందే. రిమాండులో ఉన్న చంద్రబాబును జనసేనాని ఇవాళ మధ్యాహ్నం పవన్ కళ్యాణ్ పరామర్శించారు. అనంతరం జైలు బయట మీడియాతో కాసేపు మాట్లాడారు.

నాలుగున్నరేళ్లుగా ఏపీలో అరాచకపాలన సాగుతోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసి రిమాండుకు పంపించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను అవినీతి బురదలో మునిగిపోయి, ఆ బురదను సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అందరికీ అంటించాలని చూస్తున్నాడని పవన్ విమర్శించారు.

2019లో జనసేన ఒంటరిగా పోటీ చేయాలని తాను తీసుకున్న నిర్ణయంతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారని ఆయన గుర్తుచేశారు. వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ కలసి పోటీ చేయనున్నట్టు జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. త్వరలో దీనిపై కార్యాచరణ ప్రకటించనున్నట్టు తెలిపారు. 2020 విజన్ గురించి పాతికేళ్ల కిందటే చంద్రబాబు చెబితే చాలా మంది విమర్శించారని, నేడు సైబరాబాద్ సిటీలో లక్షలాది మందికి ఉద్యోగాలొచ్చాయన్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసం జనసేన, టీడీపీ కలసి పోటీ చేస్తాయని పవన్ పునరుద్ఘాటించారు.

చంద్రబాబు అక్రమ అరెస్టు గురించి ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళతానని పవన్ చెప్పారు. స్కిల్ డెవలప్‌మెంట్ పథకం ముందుగా గుజరాత్‌లో మొదలైందని, దీని ద్వారా వేలాది మందికి శిక్షణ ఇచ్చారని, చాలా మందికి ఉద్యోగాలు కూడా వచ్చాయన్నారు. ఆర్థిక నేరాలను ఈడీ విచారణ చేయాల్సి ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకుని అక్రమ కేసులు పెడుతోందని పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు.

వాలంటీర్లను అడ్డుపెట్టుకుని డేటా చౌర్యానికి పాల్పడుతున్నారని జనసేనాని తప్పుపట్టారు. మద్యం అమ్మకాల్లో డిజిటల్ పేమెంట్లు లేకుండా చేసి అడ్డగోలుగా దోచుకుంటున్నారని సీఎం జగన్ రెడ్డిపై ధ్వజమెత్తారు. ఇసుకలో వేల కోట్లు కాజేస్తున్నారన్నారు. ఏపీలో శాంతి భద్రతలు లేవని, తనను సరిహద్దుల్లోనే ఆపేస్తున్నారని, కారులోంచి కూడా బయటకు రాకూడదని హుకుం జారీ చేస్తున్నారని పవన్ విమర్శించారు. 30 ఏళ్లు అధికారంలో ఉంటామన్న వ్యక్తిలో ఉలుకుపాటు మొదలైందని, చంద్రబాబు భద్రత విషయాన్ని ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా దృష్టి తీలుకెళతానన్నారు. యుద్దం కావాలని కోరుకుంటే అందుకు సిద్దంగా ఉన్నట్టు పవన్ ప్రకటించారు.

ShareTweetSendShare

Related News

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు
general

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన
general

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన

ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ
general

ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ

వైసీపీ నేత వల్లభనేని వంశీకి అస్వస్థత
general

వైసీపీ నేత వల్లభనేని వంశీకి అస్వస్థత

మానవాళికి ఉగ్రవాదం అతిపెద్ద ముప్పు : ప్రధాని నరేంద్ర మోదీ
general

మానవాళికి ఉగ్రవాదం అతిపెద్ద ముప్పు : ప్రధాని నరేంద్ర మోదీ

Latest News

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.