Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home క్రీడలు

స్వతంత్ర వేడుకలకు కాంగ్రెస్ దూరం

param by param
May 11, 2024, 04:25 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

భారతదేశం మొత్తం ఇవాళ జాతీయజెండాల రెపరెపలతోనిండిపోయింది.
విదేశీ పాలన కబంధ హస్తాల నుంచి దేశం విముక్తమైన సందర్భాన్ని పురస్కరించుకుని,
ప్రతీ యేటా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో పాల్గొనని భారతీయుడే ఉండడు. రాజకీయాలకు
అతీతంగా అందరూ సమష్టిగా జరుపుకునే జాతీయ పండుగ మువ్వన్నెల పండుగ.

ఇలాంటి
రోజు కూడా కాంగ్రెస్ తన కురచబుద్ధినే ప్రదర్శించింది. దేశమన్నా, దేశ ప్రజలన్నా
తనకు ఎంతమాత్రం పట్టదని మరోసారి నిరూపించుకుంది. ఎర్రకోట మీద మువ్వన్నెల జెండా రెపరెపలాడే
వేడుకను చూడడానికి దేశం మొత్తం ఎదురుచూస్తుంది. అలాంటి ఉత్సవానికి కాంగ్రెస్
పార్టీ దూరం జరిగింది. తమకు నచ్చని నాయకుడు వరుసగా పదోసారీ జాతీయ జెండా ఎగరేస్తుంటే
చూడలేక, సహించలేక… స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకే డుమ్మా కొట్టింది.

కాంగ్రెస్
పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈనాటి ఎర్రకోట వద్ద వేడుకలకు హాజరు కాలేదు.
ఆయన కోసం కేటాయించిన కుర్చీ ఖాళీగా ఉండిపోయింది. తనకు ఆరోగ్యం బాగోలేనందున ఈ
కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నట్టు మల్లికార్జున ఖర్గే వెల్లడించారు.

చిత్రమేంటంటే,
మల్లికార్జున ఖర్గే దేశ రాజధానిలోనే ఉన్నారు. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ
కార్యాలయంలో జెండా ఎగురవేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీ అధ్యక్షుడిగా
మొదటిసారి ఆయన స్వాతంత్ర్య వేడుకలు జరుపుకున్నారు. ఆ సందర్భంగా చేసిన ప్రసంగంలో
ప్రస్తుత ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించారు. ఇది కూడా కాంగ్రెస్ చరిత్రలో
మొదటిసారే. స్వాతంత్ర్య వేడుకల్లో రాజకీయ విమర్శలు చేయకూడదన్న ఒక అలిఖిత
సంప్రదాయాన్ని ఆ పార్టీ చాలాకాలంగా పాటిస్తోంది. దాన్ని కూడా ఖర్గే వదిలిపెట్టారు.

ఇంతకీ,
దేశ ప్రభుత్వం నిర్వహించిన వేడుకలకు ఖర్గే ఎందుకు హాజరు కాలేదు? తన కంటికి సమస్యగా
ఉన్నందున వెళ్ళలేకపోయానని ఆయన చెప్పారు. తన ఇంటి దగ్గర, పార్టీ కార్యాలయం దగ్గర
జెండాలు ఎగురవేయడానికి మాత్రం ఖర్గేకి కంటి సమస్య అడ్డంకి కాలేదు.

అంతటితో
అయిపోలేదు. ఖర్గే ఎర్రకోట వేడుకలకు హాజరు కాకపోవడానికి అద్భుతమైన కారణం చెప్పారు.
‘‘అక్కడ ప్రధానమంత్రికి విపరీతమైన భద్రత ఉంటుంది. ప్రధాని, హోంమంత్రి, రక్షణ మంత్రి,
లోక్‌సభ స్పీకర్ తదితరులు వెళ్ళేవరకూ మమ్మల్ని వెళ్ళనీయరు. అందువల్ల ఆ
కార్యక్రమానికి వెళ్ళడం అసాధ్యం’’ అని తేల్చేసారు.

దేశ
ప్రజలందరూ జరుపుకునే వేడుకలో పాల్గొనడానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి అడ్డం
వచ్చిన కారణం, అక్కణ్ణుంచి త్వరగా బైటపడలేకపోవడం అనే సమస్యట. వినడానికి ఎంత
హాస్యాస్పదంగా ఉంది. వేడుకలు పూర్తయాక మహా అయితే ఒక్క అరగంటలో ఆ ప్రాంగణమంతా ఖాళీ
అయిపోతుంది. ఆ సమయం కూడా ఆగలేడట ప్రతిపక్ష నాయకుడు.

ఒకటి
మాత్రం నిజం. ఆయన కంటికి సమస్య ఉందన్న మాట నిజం. తమ పార్టీని చీల్చి చెండాడి,
ఉతికి ఆరేస్తున్న పార్టీ అధికారంలో ఉండి.. వరుసగా పదో యేడాది కూడా ఎర్రకోట మీద
నుంచి జెండా ఎగరేస్తుంటే… కళ్ళు మండడం సహజమే కదా. ఆ మంటతో వేడుకల్లో ఎలా
పాల్గొంటారు. అందుకే, తన ఇంట్లో, తన పార్టీ కార్యాలయంలో జెండా ఎగరేయడానికి అడ్డం రాని
కంటి సమస్య… ప్రభుత్వ వేడుకల్లో పాల్గొనడానికి వచ్చింది.

ఈ
సందర్భంగా తాజాగా జరిగిన ఒక సంఘటన గుర్తొస్తోంది. ఈ మధ్యే ముగిసిన పార్లమెంటు
వర్షాకాల సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. ‘ఇండియా’
కూటమి ప్రతిపాదించిన ఆ తీర్మానాన్ని బలపరిచేందుకు కాంగ్రెస్ పార్టీ తమ మాజీ
ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను రాజ్యసభకు తీసుకొచ్చింది. అనారోగ్యంతో,
శారీరక బలహీనతతో, నోట మాట రాని స్థితిలో, వీల్‌చెయిర్‌లో తప్ప లేచి నిలబడలేని
స్థితిలో ఉన్న మన్మోహన్ సింగ్‌ను ఈ ఖర్గే నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులోకి
తీసుకొచ్చింది. గెలిచే అవకాశం ఏమాత్రం లేదన్న స్పష్టత ఉన్న అవిశ్వాస తీర్మానానికి
ఆ పెద్దాయనను లాక్కుని మరీ తీసుకొచ్చింది. అదేంటని అడిగితే, ప్రజాస్వామ్య విలువల
పట్ల నిబద్ధతతో ఆ పెద్దాయనే స్వయంగా వచ్చారని కాంగీయులు బుకాయించారు.

ఖర్గే
పరిస్థితి అంత దారుణంగా ఏమీ లేదు కదా. మన్మోహన్ సింగ్‌ అంత బలహీనంగా ఐతే ఖర్గే
లేరు కదా. అలాంటప్పుడు రాజకీయాలకు అతీతంగా జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు కేవలం
రాజకీయ కారణాలతోనే హాజరు కాకపోవడం గర్హనీయం.
 

ShareTweetSendShare

Related News

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు
general

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన
general

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన

ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ
general

ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ

వైసీపీ నేత వల్లభనేని వంశీకి అస్వస్థత
general

వైసీపీ నేత వల్లభనేని వంశీకి అస్వస్థత

మానవాళికి ఉగ్రవాదం అతిపెద్ద ముప్పు : ప్రధాని నరేంద్ర మోదీ
general

మానవాళికి ఉగ్రవాదం అతిపెద్ద ముప్పు : ప్రధాని నరేంద్ర మోదీ

Latest News

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.