Thursday, November 30, 2023

Odisha-365
google-add

Earth quake in delhi : ఢిల్లీలో భూకంపం.. జనం పరుగులు


Editor | 17:49 PM, Sun Oct 15, 2023

దేశ రాజధాని ఢిల్లీలో ఈ సాయంత్రం స్వల్పంగా భూమి కంపించింది. సాయంత్రం 4.08 గంటల ప్రాంతంలో భూమి కదిలిందని జాతీయ భూకంప అధ్యయన కేంద్రం (National Centre for Seismology-NCS) ప్రకటించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.1గా నమోదయిందని ఎన్ సీ ఎస్ తెలిపింది. ఢిల్లీ ఎన్ సీఆర్ రీజియన్ పరిధిలో 28.41 అక్షాంశాలు,77.41 రేఖాంశాల ప్రాంతంలో 10 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని, ఫరీదాబాద్, హర్యానా కు 9కిలోమీటర్ల దూరంలో కంపనాలు కేంద్రీకృతమయ్యాయని ఎన్ సీఎస్ వివరించింది.

రెండురోజుల్లో రెండోసారి..

దేశ రాజధాని ప్రాంతంలో గత రాత్రి నుంచి ఇలా భూమి కంపించడం ఇది రెండోసారి. అక్టోబరు 3న రాత్రి వేళలోనూ భూకంపం చోటుచేసుకుంది. దీంతో ప్రజలు ఇళ్లు, కార్యాలయాల నుంచి పరుగులు తీశారు. కాగా వరుసగా మరుసటి రోజే ఇలా జరగడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

google-add
google-add
google-add

ముఖ్యాంశాలు

Badi Baat

google-add

అంతర్జాతీయం

మూడో విడత బందీల విడుదల

K Venkateswara Rao | 10:33 AM, Mon Nov 27, 2023

Asian Games Bharat @100: శత పతక భారతం

P Phaneendra | 10:13 AM, Sat Oct 07, 2023

దివాలా తీసిన నగరం

P Phaneendra | 16:00 PM, Wed Sep 06, 2023
google-add

వీడియోలు

తేజస్‌లో మోదీ

P Phaneendra | 15:40 PM, Sat Nov 25, 2023