Sunday, June 22, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

స్వాతంత్ర సమరయోథుడు రైతు నాయకుడు ఆచార్య ఎన్.జి.రంగా జీవిత విశేషాలు

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

స్వాతంత్ర సమరయోథుడు రైతు నాయకుడు ఆచార్య ఎన్.జి.రంగా జీవిత విశేషాలు

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

Phaneendra by Phaneendra
Jun 19, 2025, 04:23 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

శ్రీకాకుళం జిల్లాలో ఇస్కాన్ వారు నిర్మించి నిర్వహిస్తున్న ‘కూర్మ’ అనే ప్రాచీన తరహా గ్రామంలోని ధ్యాన మందిరం గత వారం అగ్నికి ఆహుతి అయిన ఘటన సంచలనం సృష్టించింది. పోలీసు వారు అది ప్రమాదమే అని స్థూలంగా తేల్చినా, కాదని గ్రామవాసులు స్పష్టంగా చెబుతున్నారు. ఆగంతకుల దాడి వల్లనే మందిరం తగులబడిపోయిందని వెల్లడిస్తున్నారు. సరిగ్గా దర్యాప్తు జరిపి నేరస్తులను పట్టుకోవాలని కోరుతున్నారు.

దాదాపు అదే సమయంలో రాష్ట్రానికి మరో చివర, తిరుపతి జిల్లా తిరుచానూరులో రెండు దేవాలయాలను కూల్చివేసిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఒకటి తిరుచానూరులోనే స్వర్ణముఖి నది ఒడ్డున ఉన్న వారాహీ అమ్మవారి ఆలయం కాగా, మరొకటి తిరుచానూరు పంచాయతీ పరిధిలోని దామనేరు గ్రామంలోని నాగాలమ్మ ఆలయం. ఆ రెండు ఆలయాల కూల్చివేత వెనుక రాజకీయ కోణం కనిపిస్తోంది.

 

ఇస్కాన్ వారి ప్రత్యేక సనాతన గ్రామం ‘కూర్మ’:

శ్రీకాకుళం జిల్లా హీరమండలంలో శ్రీముఖలింగం గ్రామ సమీపంలో ఇస్కాన్ సంస్థ వారు ‘కూర్మ’ పేరుతో గ్రామం నిర్మించారు. ఆధునిక సౌకర్యాలకు దూరంగా ప్రాకృతికమైన జీవనం గడిపేందుకు వీలుగా ఉండడం ఆ గ్రామం ప్రత్యేకత. విద్యుత్తు, గ్యాస్, టెలికమ్యూనికేషన్లు, రసాయనిక ఎరువులూ వంటివి ఏమీ లేకుండా ఆ కూర్మ గ్రామాన్ని  నిర్వహిస్తున్నారు. ప్రకృతి సహజంగా వ్యవసాయం చేసుకుంటూ ధార్మిక చింతనతో జీవితం గడుపుతూ ఉంటారు ఆ గ్రామస్తులు. అలా అని వారేమీ పల్లెటూరి జనాలు కాదు… దేశ విదేశాల్లోని మహానగరాల్లో బతికేసి, అందులో రూపం తప్ప సారం లేదని గ్రహించి భక్తి మార్గమే ముక్తి మార్గమని భావించిన మహామహులు అక్కడ నిరాడంబరమైన, సనాతన సంప్రదాయబద్ధమైన జీవితాన్ని గడుపుతున్నారు.

ఇస్కాన్ వ్యవస్థాపకులు భక్తివేదాంత స్వామి ప్రభుపాద వారి ఆదర్శాలకు అనుగుణంగా భక్తివికాస స్వామి కూర్మ గ్రామాన్ని 2018లో ఏర్పాటు చేసుకున్నారు. అక్కడి ఇళ్ళను సిమెంట్, ఇనుము లేకుండాకేవలం సున్నం, బెల్లం, ఇసుకలతో నిర్మించుకున్నారు. ఆ గ్రామం ‘సరళ జీవనం – ఉన్నత చింతన’ అనే నినాదంతో నడుస్తోంది. తెల్లవారుజామున బ్రహ్మముహూర్తం సమయంలో లేవడం, రాత్రి సుమారు 8 గంటలకల్లా నిద్రించడం కూర్మ గ్రామ నివాసుల పద్ధతి. సుమారు 60 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కూర్మ గ్రామంలో గోశాల, వేద పాఠశాల, గురుకులం వంటివి నిర్వహిస్తున్నారు. అక్కడి పాఠశాలలో భగవద్గీత, రామాయణ భారత భాగవతాలు వంటి ఆధ్యాత్మిక అంశాలు మాత్రమే కాకుండా గణితం, సైన్స్, భాషలు, చరిత్ర వంటివి నేర్పిస్తారు. శారీరక వ్యాయామం జరిగేలా కబడ్డీ, ఈత వంటి ఆటలు కూడా ఆడిస్తారు. గ్రామస్తులు అందరూ కలిసి ఉమ్మడి సేద్యం చేసుకుంటారు. ప్రకృతి సహజమైన పద్ధతుల్లో పంటలు, కాయగూరలు పండించుకుంటారు.

 

ధ్యానమందిరం అగ్నికి ఆహుతి, కుట్ర కోణం?:

జూన్ 10, 2025 మంగళవారం రాత్రి కూర్మ గ్రామంలో మంటలు చెలరేగాయి. ఆధ్యాత్మిక ప్రసంగాలు చేసేందుకు ప్రత్యేకించిన రాధాకృష్ణ ధ్యానమందిరం అగ్నికి ఆహుతి అయింది. దాంతో గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. నిమిషాల వ్యవధిలోనే మందిరం పూర్తిగా తగులబడిపోయింది. విలువైన పుస్తకాలు ఉన్న గ్రంథాలయం కాలి బూడిద అయిపోయింది. ఆ ప్రమాదంలో దాదాపు రూ.50 లక్షల వరకూ నష్టం వాటిల్లింది.

ఈ దుర్ఘటన వెనుక కుట్ర ఉందని అనుమానిస్తున్నారు. కొన్ని రోజులుగా కూర్మ గ్రామం మీద కుట్ర పన్నారని గ్రామవాసి రాధాకృష్ణ చరణ్‌దాస్ చెబుతున్నారు. ఇది కేవలం తమ గ్రామం మీద జరుగుతున్న దాడి కాదు, హిందువుల మనోభావాలను దెబ్బ తీసేందుకు జరుగుతున్న కుట్ర అన్నారు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

‘‘మంగళవారం రోజు రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. మామూలుగా మేము రాత్రి 8.30 సమయానికల్లా మందిరాన్ని మూసివేసి బైటకు వచ్చేస్తాము. మంగళవారం రాత్రి 9.45 నిమిషాల తర్వాత ఒక వ్యక్తి బైటకు వచ్చినప్పుడు పెద్ద శబ్దం రావడం, మంటలు చెలరేగడం గమనించారు. ఐదు ఆరు నిమిషాల్లోనే 120 అడుగుల పొడవైన మందిరం, అంటే సుమారు 1200 మంది కూర్చోగలిగిన మందిరం మొత్తం భస్మం అయిపోయింది. చాలా పెద్దస్థాయిలో మంటలు చెలరేగాయి. అది గడ్డి కప్పిన మందిరం అన్న మాట నిజమే. కానీ అంత తక్కువ వ్యవధిలో మందిరం మొత్తం కాలడం సులభం కాదు. అంతకు ముందే మందిరంలో ఉన్న దీపాలు అన్నింటినీ ఆర్పివేసాము. ఒకవేళ దీపం ఉన్నా అంతలా తగులబడిపోదు. ఎందుకంటే ఆ లోపల ఉన్నవి తాటి దూలాలు. అవి మామూలు దీపాల మంటలకు కాలిపోవు. మనం దీపం పట్టుకుని ప్రయోగం చేస్తే గంట సేపు అయినా అవి కాలవు. కింద అంతా చెక్క ఉంది. దానిపైన గడ్డి ఉంది. పైగా ఆ మందిరం అత్యధిక ఎత్తు 18 ఎడుగులుగా ఉంది. కాబట్టి చాలా స్పష్టంగా తెలుస్తోంది.. ఎవరో వ్యతిరేకమైన వ్యక్తులు, అసూయాపరులు, గిట్టనివాళ్ళు అయిన దుండగులు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలి. సంఘటన జరిగాక ఫైర్ ఇంజన్‌ను పిలిచాము, పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసాము. వారు దర్యాప్తు చేస్తున్నారు’’ అని చెప్పారు.

 

పవన్ కళ్యాణ్ స్పందన:

నిజానికి ఈ సంఘటన గురించి పెద్దగా బాహ్య ప్రపంచానికి తెలియలేదు. ప్రధాన స్రవంతి మీడియా దీన్ని ఎక్కువగా పట్టించుకోలేదు. విశ్వహిందూ పరిషత్, తదితర హిందూ సంస్థలు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు సంఘీభావం ప్రకటించాయి. జరిగిన దుర్ఘటనపై పోలీసు విచారణ జరిపించాలని డిమాండ్ చేసాయి. అయితే అసలు సంఘటన గురించే పెద్దగా పట్టించుకోని పాత్రికేయ ప్రపంచం హిందూ సంఘాల డిమాండ్ల గురించి ఒక్క వాక్యం కూడా రాయలేదు. అయితే ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించిన తర్వాత మీడియా ఈ సంఘటన గురించి కొద్దిగా పట్టించుకుంది.

సంఘటన జరిగిన నాలుగో రోజు, అంటే జూన్ 14న ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ సంఘటనపై ట్వీట్ చేసారు.

‘‘ఆధునిక హంగులు లేకుండా అధ్యాత్మిక చింతనతో జీవించేలా తీర్చిదిద్దుకున్న కూర్మ గ్రామం అగ్నికి ఆహుతి కావడం దురదృష్టకరం. శ్రీకాకుళం జిల్లా హిరమండలం సమీపంలోని కూర్మ గ్రామంలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంపై పోలీసులు లోతుగా విచారణ చేయాలని సంబంధిత యంత్రాంగానికి సూచనలు చేశాను. ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో ఆ కోణంలోనూ దర్యాప్తు చేపట్టాలి. కూర్మ గ్రామంలో ప్రస్తుత పరిస్థితిపై జిల్లా అధికారులతో మాట్లాడి, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తాము. సనాతన ధార్మిక జీవనం కోసం ఇస్కాన్ ఆధ్వర్యంలో ఈ గ్రామం ఏర్పాటైంది. కూర్మ గ్రామవాసులు యాంత్రిక జీవన విధానాలకు భిన్నంగా మట్టి ఇళ్ళల్లో ఉంటూ ప్రకృతి వ్యవసాయం చేసుకొంటూ జీవిస్తున్నారు. వేద విద్యను అభ్యసించే చిన్నారులు సంస్కృతం, తెలుగు, హిందీ, ఆంగ్లం అనర్గళంగా మాట్లాడుతూ ఉంటారు. వర్తమాన కాలంలో విశిష్టంగా ఉన్న ఈ గ్రామం పునరుద్ధరణపై దృష్టి సారించాలి’’ అని ఆయన ఎక్స్ సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేసారు.

పోలీసుల స్పందన:

పవన్ కళ్యాణ్ స్పందించిన మరునాడు, అంటే జూన్ 15 శనివారం నాడు శ్రీకాకుళం ఎస్‌పి కె.వి మహేశ్వర రెడ్డి ఒక ప్రకటన విడుదల చేసారు. అగ్నిప్రమాదం వెనుక ఎవరి హస్తమూ లేదని, ఎలాంటి దురుద్దేశాలూ లేవనీ ఆయన స్పష్టం చేసారు. 

ధ్యానమందిరం గడ్డితో కప్పిన మట్టి నిర్మాణం కావడం వల్ల ప్రమాదవశాత్తు తగులబడిపోయిందని పోలీసులు భావిస్తున్నారు. ఆ సంఘటన వెనుక ఏ వ్యక్తి లేక సంస్థ ప్రమేయం ఉన్నట్లుగా తమ ప్రాథమిక దర్యాప్తులో తెలియలేదని ఎస్‌పి చెప్పుకొచ్చారు. సాధారణంగా ప్రతీ రోజూ ప్రార్థనలు పూర్తయిన తర్వాత దీపాలు ఆర్పేస్తారు. పొరపాటున ఏదైనా దీపాన్ని ఆర్పేయడం మరచిపోయి ఉండొచ్చని, దానివల్లనే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చుననీ పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటనా స్థలం నుంచి సేకరించిన ఆధారాలను విశ్లేషణ కోసం ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించారు.

 

ప్రజల్లో పలు రకాల అనుమానాలు:

చిత్రమేంటంటే, గత ఆరేళ్ళుగా అనుసరిస్తున్న పద్ధతిలో ఇన్నాళ్ళలో ఏ ఏ ఒక్కనాడూ తప్పు జరగలేదు. అలాంటిది, దీపాలు ఆర్పే విషయంలో ఇప్పుడు పొరపాటు జరిగి ఉండవచ్చని పోలీసులు చెబుతున్నారు. అయితే, ఒక దీపం నుంచి మంటలు రేగినంత మాత్రాన సుమారు 18 అడుగుల ఎత్తున్న మందిరం పైనున్న గడ్డి అంటుకుని మందిరం మొత్తం తగలబడిపోవడానికి అవకాశాలు తక్కువ అన్న సంగతిని వారు విస్మరించినట్లే ఉన్నారు అని స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

పైగా మందిర నిర్మాణంలో ఉపయోగించిన తాటి దూలాలు అంత చిన్న మంట కారణంగా కేవలం కొన్ని నిమిషాల్లో తగలబడిపోవడం అన్నది సాధారణ ప్రజలకు నమ్మశక్యంగా లేదు. పెట్రోలు, కిరోసిన్ వంటి ఇంధనం ఏదైనా ఉంటే తప్ప అంత పెద్ద మంటలు వ్యాపించడం, అంత తక్కువ సమయంలో దగ్ధం అయిపోవడం సాధ్యం కాదు. ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఇస్కాన్ ప్రత్యేక గ్రామం ‘కూర్మ’ నిర్వాహకులు వ్యక్తం చేస్తున్న అనుమానాలను సైతం పోలీసులు పట్టించుకోవడం లేదా? ఎందుకు? ఈ ఘాతుకం వెనుక అన్యమతస్తుల కుట్ర ఏమైనా ఉందా? అదే నిజమై ఉంటే ఈ చర్య ఎవరి దుర్మార్గం అయి ఉండవచ్చు? వారు ఈ సంఘటనపై పోలీసుల దర్యాప్తును ప్రభావితం చేస్తున్నారా? ఏ స్థాయిలో ఒత్తిళ్ళు వస్తున్నాయి? స్వయంగా ఉపముఖ్యమంత్రి ఆదేశాల తర్వాత కూడా నిజం నిగ్గు తేలడం లేదంటే కారణం ఏమిటి? వంటి సందేహాలకు జవాబులు దొరకాల్సి ఉంది.

 

మీడియా స్పందన:

పాస్టర్ ప్రవీణ్ పగడాల మద్యం సేవించి హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకూ సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుని వెడుతూ ప్రమాదవశాత్తు చనిపోతే, క్రైస్తవ సంఘాలు రాజకీయ ప్రయోజనాల కోసం దాన్ని రచ్చరచ్చ చేసాయి. హిందువులే ఆ పాస్టర్‌ను చంపేసారంటూ తప్పుడు కథనాలు ప్రచారంలో పెట్టాయి. ఆ తప్పుడు కథనాలను యావత్ తెలుగు మీడియా ఉద్యమ స్ఫూర్తితో ప్రసారం చేసింది. పాస్టర్ ప్రవీణ్ పగడాలను హిందువులే పట్టుకుని కొట్టి తాగించి బిల్లులు కట్టించి సాక్ష్యాలు కనిపించేలా ఊగుతూ డ్రైవింగ్ చేయించి చంపేసాడంటూ అవాకులూ చెవాకులూ పేలారు. వాటన్నింటినీ ఒక్క అక్షరం పొల్లు పోకుండా ఛానెళ్ళు ప్రసారం చేసాయి, పత్రికలు ప్రచురించాయి.

ఇప్పుడు కూర్మ గ్రామంలో ధ్యానమందిరం దగ్ధం ఘటన మాత్రం తెలుగు మీడియాకు ప్రసార/ప్రచురణ అర్హత కలిగిన అంశంగా కనిపించలేదు. ఎక్కడా భారీ డిబేట్లు లేవు. విశేష కథనాలు లేవు. అసలు సమాచారమే నాలుగు రోజులు ఆలస్యంగా వెలుగు చూసింది. అది కూడా ముందు సోషల్ మీడియాలో విస్తృత ప్రాచుర్యం కలిగిన తర్వాత, పవన్ కళ్యాణ్ స్థాయి నేత స్పందించిన తర్వాత మాత్రమే మీడియాలో కొద్దిగా కనిపించింది. హిందూ ధర్మానికి చెందిన అంశాలపై మీడియా ప్రాధాన్యత ఇలా ఉంటుంది.

 

మరి తిరుచానూరు సంఘటనల సంగతేంటి?:

కూర్మ గ్రామంలో ధ్యానమందిరం దగ్ధమైన అదే జూన్ 10 మంగళవారం అర్ధరాత్రి తిరుపతి జిల్లా తిరుచానూరులో వారాహీ అమ్మవారి దేవాలయాన్ని ధ్వంసం చేసారు. వారాహీ అమ్మవారి విగ్రహం, శివలింగం, ఇతర దేవతా మూర్తుల విగ్రహాలను ధ్వంసం చేసారు. ఆ విగ్రహాలను పక్కనే ఉన్న స్వర్ణముఖీ నదిలో విసిరేసారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరాధించే వారాహీ అమ్మవారి మూర్తి చేతులు విరగ్గొట్టి మరీ నదిలో పడేయడం సంచలనం సృష్టించింది.

దానికి మూడు రోజుల తర్వాత తిరుచానూరు పంచాయతీ పరిధిలోని దామినేడు గ్రామంలో నాగాలమ్మ ఆలయాన్ని ధ్వంసం చేసారు. గుడి ప్రహరీని జేసీబీతో కూలగొట్టారు. అమ్మవారి శూలాలను, నాగాలమ్మ పుట్టనూ, ఇతర ఆనవాళ్ళనూ పూర్తిగా ధ్వంసం చేసారు. ట్రాక్టర్లతో మట్టిని ఎత్తి వేరేచోట పారబోసారు. ఈ ఘాతుకం జూన్ 13 శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగింది. తెల్లవారుజామున వాహనాల శబ్దాలు విని స్థానికులు అక్కడకు చేరుకునే సరికే అక్కడ ఏమీ మిగలకుండా పోయింది.

ఈ రెండు సందర్భాల్లోనూ ఆయా దేవాలయాలకు చెందిన భూములను పాలక తెలుగుదేశం పార్టీ నాయకులు కబ్జా చేసే ప్రయత్నాల్లో దేవాలయాలను ధ్వంసం చేసారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆలయ నిర్వాహకులు, స్థానిక హిందూ సంఘాలూ ఈ సంఘటనల గురించి చెప్పిన వివరాలను పరిశీలిద్దాం.

వారాహీ ఆలయ విగ్రహాలు స్వర్ణముఖి నదిలో పారవేత:

తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి భార్య అలమేలు మంగాదేవి లేక పద్మావతీ దేవి వెలసిన క్షేత్రమైన తిరుచానూరు రాష్ట్రంలో ప్రసిద్ధమైన ఆలయ నగరం. స్వర్ణముఖీ నది ఒడ్డున ఉన్న తిరుచానూరులో ఆ నదీ తీరంలో వారాహీ అమ్మవారి ఆలయం ఒకటి ఉంది. కొన్ని సంవత్సరాలుగా ఆ వారాహీ మాత దేవాలయంలో నిత్యపూజలు జరుగుతున్నాయి. స్థానిక భక్తులు భక్తిశ్రద్ధలతో వారాహీ దేవిని కొలుచుకుంటూ ఉంటారు. అయితే ఆ ఆలయం ఉన్న భూమి తమదే అంటూ రామిరెడ్డి, మణిరెడ్డి అనేవారు కేసు వేసారు. దానికి ప్రతిగా ఆలయ నిర్వాహకులు సైతం కోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానంలో విచారణ జరుగుతూ ఉంది.

జూన్ 9న ఆలయ నిర్వాహకుల మీద రామిరెడ్డి, మణిరెడ్డి సహా సుమారు 30మంది గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. అడ్డుకోబోయిన భక్తురాళ్ళ మీద దౌర్జన్యం చేసారు. గుడిని పాక్షికంగా ధ్వంసం చేసారు. బాధితులు తిరుచానూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసారు. అయితే పోలీసులు పేరుకు కేసు పెట్టి చేతులు దులుపుకున్నారు.

 

వారాహీ మాత విగ్రహ మూర్తుల ధ్వంసం:

పోలీసుల మొక్కుబడి చర్యల కారణంగా దుండగులు మరోసారి రెచ్చిపోయారు. జూన్ 10 మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఏకంగా జేసీబీలు తీసుకువెళ్ళి ఆలయాన్ని కూల్చివేసారు. గర్భగుడిలోని మూలవిరాట్టు శ్రీ వారాహీ అమ్మవారి విగ్రహాన్ని, శివలింగాన్ని, ఇతర దేవతా మూర్తులనూ పెరికేసారు. విగ్రహాల చేతులు, తలలు విరగ్గొట్టేసారు. తర్వాత ఆ విగ్రహాలను తీసుకుని వెళ్ళి స్వర్ణముఖి నదిలో పడవేసారు. మొత్తం మీద ఆ ప్రాంతంలో వారాహీ దేవి ఆలయం ఉండేదన్న ఛాయలు లేకుండా పూర్తిగా తుడిచిపెట్టేసారు.

జూన్ 11 బుధవారం ఉదయం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గుడి కోసం వెళ్ళిన భక్తులకు అక్కడ ఏమీ కనబడలేదు. దాంతో విషయం అందరికీ తెలిసిపోయింది. హిందూ సంఘాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. నదిలో పడవేసిన దేవతా మూర్తులను జేసీబీ సహాయంతో వెలికి తీసారు.

దేవతా మూర్తులు ధ్వంసం కావడం, దేవాలయాన్ని నేలమట్టం చేయడంపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసాయి. ఆలయ నిర్వాహకులు, హిందూ సంస్థల ప్రతినిధులూ తిరుచానూరు పోలీస్ స్టేషన్ దగ్గర నిరసన ప్రదర్శన చేపట్టారు. పోలీసులు వారిని బలవంతంగా పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

 

ఆలయ ధ్వంసం వెనుక రాజకీయ హస్తం?!

ఆలయ నిర్వాహకులు, ఈ ఘాతుకానికి పాల్పడింది అధికార తెలుగుదేశం పార్టీ నేతలు అని ఆరోపిస్తున్నారు. గుడిని కూల్చివేసి ఆ స్థలాన్ని అప్పగించేందుకు టీడీపీ నేతలు రూ.10 లక్షలు తీసుకున్నారని వాకి ఆరోపణ. టీడీపీ నేత కిశోర్ రెడ్డి అనే వ్యక్తే ఈ దుర్మార్గానికి ఒడిగట్టాడని, అధికార పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో పోలీసులు సైతం మిన్నకుండిపోయారనీ దేవాలయ నిర్వాహకులు వాపోతున్నారు. కిశోర్ రెడ్డి తెలుగుదేశం ఎమ్మెల్యే పులివర్తి నాని అనుచరుడు అని తెలుస్తోంది. దేవాలయ భూమిని కబ్జా చేయాలనుకున్న వారు దానికోసం అధికార పార్టీ వారికి లంచాలు ఇచ్చారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

 

దామినేడులో నాగాలమ్మ గుడి, పుట్ట నేలమట్టం:

తిరుచానూరు పంచాయతీ పరిధిలోని దామినేడు గ్రామంలో వందల యేళ్ళ నాటి నాగాలమ్మ ఆలయం ఉంది. ఆ గుడిని జూన్ 13 శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ధ్వంసం చేసారు. గుడి ప్రహరీ గోడ, అమ్మవారి శూలాలు, నాగాలమ్మ పుట్ట సహా గుడికి సంబంధించిన ఎలాంటి అవశేషాలూ లేకుండా తుడిచిపెట్టేసారు.

గ్రామస్తులు చెప్పిన వివరాల ప్రకారం దామినేడులోని 10 ఎకరాల ఇనాం భూమిలో నాగాలమ్మ గుడి ఉంది. స్థానిక ప్రజలు తరతరాలుగా ఆ గ్రామదేవత గుడిలో పూజలు చేసుకుంటున్నారు. నాగాలమ్మను పరిసర గ్రామాలకు చెందిన ప్రజలు చాలామంది కులదైవంగా భావించి కొలుచుకుంటూ ఉండేవారు.

 

గుడిని మింగేసిన రాజకీయ నాయకులు:

స్థానిక గ్రామస్తుల కథనం ప్రకారం… తిరుపతి రూరల్ పరిధిలో తెలుగుదేశం పార్టీ మాజీ మండల అధ్యక్షుడు కిలారి కృష్ణమూర్తి నాయుడు పదేళ్ళ క్రితం ఆ దేవాలయ స్థలంలో 7.70 ఎకరాలకు రికార్డులు నకిలీ పత్రాల సాయంతో సృష్టించుకున్నారు. మెల్లగా ఆ భూమిని ఆక్రమించుకున్నారు. దేవాలయం కూడా ఆ ఆక్రమిత భూమిలోనే ఉంది. అయినా ఇప్పటివరకూ గ్రామస్తులు ఆ గుడికి వెళ్ళి వస్తూ అక్కడ పూజాదికాలు చేసుకుంటున్నారు.

కొన్నాళ్ళ క్రితం కృష్ణమూర్తి నాయుడు, ఆయన కొడుకు దివాకర్ తాము ఆక్రమించిన భూమికి ఫెన్సింగ్ వేసి గేటు పెట్టేసారు. గుడికి ఎవరూ రావడానికి వీల్లేదని గ్రామస్తులకు చెప్పారు.

 

గుడి ధ్వంసం, గ్రామస్తుల ఆందోళన:

ఆ క్రమంలో శుక్రవారం జూన్ 13 అర్ధరాత్రి దాటాక కృష్ణమూర్తి నాయుడు, దివాకర్ తమ మనుషులతో ఆలయం దగ్గరకు చేరుకున్నారు. ముందుగా జేసీబీలతో గుడిని, గుడి ప్రహరీని పూర్తిగా పడగొట్టించారు. తర్వాత అమ్మవారి వేపచెట్టు దగ్గర ఉంచిన శూలాలను ధ్వంసం చేసారు. నాగాలమ్మ పుట్టను కూడా మొత్తం తొలగించారు. అసలు అక్కడ పుట్ట అన్నది ఉండేదన్న ఆనవాళ్ళే లేకుండా చేసారు. ట్రాక్టర్లతో మట్టిని ఎత్తిపోసి వేరే చోటకు తరలించేసారు. మొత్తం మీద అక్కడ ఒక గుడి ఉండేదన్న ఆధారాలు ఏమీ లేకుండా తుడిచిపెట్టేసారు.

తెల్లవారుజామున వాహనాల శబ్దం వినిపించడంతో గ్రామస్తులు గుడి దగ్గరకు చేరుకున్నారు. అప్పటికే అక్కడ గుడిని కూల్చివేసిన సంగతిని గమనించారు. తమ కులదైవం, ఇలవేల్పు ఆలయాన్ని ఎలా తొలగిస్తారంటూ ఆగ్రహంతో రగిలిపోయారు. కృష్ణమూర్తి నాయుడు, దివాకర్‌లను నిలదీసారు. వారి అనుచరులు గ్రామస్తుల్లో మహిళలు ఉన్న సంగతిని కూడా పట్టించుకోకుండా వారిని నోటికొచ్చినట్లు దుర్భాషలాడుతూ దౌర్జన్యానికి పాల్పడ్డారు. గ్రామస్తులు, మహిళలపై భౌతిక దాడులకు సైతం పాల్పడ్డారు. ఇరు వర్గాల మధ్యా ఘర్షణ చెలరేగడంతో పోలీసులు చేరుకున్నారు.

పోలీసుల సహాయంతో కృష్ణమూర్తి నాయుడు అక్కడినుంచి వెళ్ళిపోయారు. ఆ సంఘటన మీద రెండు పక్షాల వరూ పోలీసులకు ఫిర్యాదు చేసారు. గ్రామస్తులు మాత్రం పోలీసులు, రెవెన్యూ అధికారులూ అధికార పక్షం నాయకులకు తొత్తులుగా మారారనీ, గుడిని కూల్చేసినా పట్టించుకోవడం లేదనీ కనీస చర్యలు తీసుకోవడం లేదనీ ఆవేదన వ్యక్తం చేసారు.

 

ప్రభుత్వం ఏం చేస్తోంది?:

ఆంధ్ర ప్రదేశ్‌లో ఎన్‌డిఎ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. కూటమిలో బీజేపీకి పెద్దగా బలం లేకపోయినా, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షకుడిగా ఉంటానంటూ ప్రకటనలు చేస్తున్నారు. గతంలో క్రైస్తవుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో దేవాలయాలపై దాడులు భయంకరంగా జరుగుతున్నాయంటూ తెలుగుదేశం, జనసేన పార్టీలు ఆందోళనలూ ఉద్యమాలూ చేసారు. తాము అధికారంలోకి వస్తేనే దేవాలయాలకు న్యాయం జరుగుతుందంటూ చెప్పుకొచ్చిన సంగతీ తెలిసిందే.

కానీ వాస్తవంలో కార్యాచరణ భిన్నంగా ఉంది. ఈ మూడు సంఘటనల్లో ఏ ఒక్కదానిలోనూ ప్రభుత్వం పెద్దగా స్పందించినది ఏమీ లేదు. కూర్మ గ్రామం సంఘటన గురించి పవన్ కళ్యాణ్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఒక ట్వీట్ చేసారు తప్ప మిగతా రెండు సంఘటనల గురించీ నోరు విప్పినట్లే లేదు. నిజానికి ఆ రెండు సంఘటనల్లోనూ అధికార తెలుగుదేశం నాయకులే భూకబ్జాల కోసం గుడులను ధ్వంసం చేయించారని స్థానికులు బలంగా ఆరోపణలు చేస్తున్నారు. టీడీపీ నాయకులు నోరెత్తకపోవడంలో ఆశ్చర్యం లేదు. కానీ జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ మాత్రం స్పందించాలి కదా. సనాతన ధర్మ పరిరక్షకుడి హోదా తనకు తాను ఇచ్చుకున్న పవన్ కళ్యాణ్, ఆయన పొత్తు కుదిర్చిన బీజేపీ మాత్రం కఠిన కార్యాచరణ చేపట్టవలసిందే.

ఇప్పటికే ప్రతిపక్ష వైఎస్ఆర్‌సిపి, అధికార తెలుగుదేశం మీద ఎన్నోసార్లు దేవాలయాల ధ్వంసానికి కారణమయ్యారని తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేసింది. కృష్ణా పుష్కరాల సమయంలో విజయవాడలో గుడులను పడగొట్టించిన సంగతిని, ఇంకా పలు దేవాలయాల్లో ధ్వంస చర్యలు చోటు చేసుకున్న సంగతినీ గుర్తు చేసింది. అయితే రాష్ట్రంలోని ప్రత్యేక రాజకీయ పరిస్థితుల కారణంగా మీడియా ఆ వార్తలను సరిగ్గా కవర్ చేయలేదు. అతి తక్కువ స్థాయిలో స్థానిక మీడియాఆ సంఘటన గురించి చిన్న వార్త ప్రచురించి లేదా ప్రసారం చేసి వదిలేసింది.

 

గద్దెపై ఎవరున్నా మారని తీరు:

అధికారంలో ఏ రాజకీయ పక్షం ఉన్నా హిందూ దేవాలయాలకు, ధార్మిక ప్రదేశాలకూ ఎలాంటి ప్రయోజనమూ లేదు. కంచే చేను మేసినట్లు అధికార పక్షానికి చెందిన నాయకులే దేవాలయాల భూములను లాక్కోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు జరిగిన సంఘటనలు సైతం అదే వైఖరిని నిరూపిస్తున్నాయి.

Tags: ConspiracyDhyan Mandir FireDy. CM Pawan KalyanGoddess VarahiHindu templesISKCON villageKurma VillageLand Grab AttemptsNagalamma Temple DemolishedSwarnamukhi RiverTDP leadersTemples Under AttackTIRUCHANURTOP NEWSVarahi Temple Demolished
ShareTweetSendShare

Related News

స్వాతంత్ర సమరయోథుడు రైతు నాయకుడు ఆచార్య ఎన్.జి.రంగా జీవిత విశేషాలు
general

స్వాతంత్ర సమరయోథుడు రైతు నాయకుడు ఆచార్య ఎన్.జి.రంగా జీవిత విశేషాలు

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్
general

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?
general

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు
general

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు
general

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

Latest News

స్వాతంత్ర సమరయోథుడు రైతు నాయకుడు ఆచార్య ఎన్.జి.రంగా జీవిత విశేషాలు

స్వాతంత్ర సమరయోథుడు రైతు నాయకుడు ఆచార్య ఎన్.జి.రంగా జీవిత విశేషాలు

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.