Friday, June 13, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

K Venkateswara Rao by K Venkateswara Rao
Jun 12, 2025, 04:55 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఏటా బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం జరుపుకుంటూ ఉంటాం. ఆ రోజు బాల కార్మిక వ్యవస్థను రూపుమాపాలంటూ అధికార, ప్రతిపక్షాల నేతలు భారీ ప్రసంగాలను ఇస్తుంటారు. తరవాత రోజుకే మరచిపోతారు. మరలా బాలకార్మికులు పనులను పోతూనే ఉంటారు. దుర్భర వాతావరణంలో పని చేస్తూ తీవ్ర అనారోగ్యం భారిన పడటమే, కాదు బడిలో ఉండాల్సిన పిల్లలు పొలాల్లో, ఖార్జానాల్లో నలిగిపోతుంటారు. అలాంటి వారు ప్రపంచంలో కోకొల్లలు. వారి జీవితాలు మెరుగు పరచడానికి యూనిసెస్ లాంటి సంస్థ ప్రయత్నాలు చేస్తున్నా, అవి పెద్దగా ఫలితాలు ఇవ్వడం లేదు. అసలు బాల కార్మిక వ్యవస్థకు దారి తీస్తున్న పరిస్థితులను మనం ఒక్కసారి పరిశీలిద్దాం…

బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం: సమగ్ర అవలోకనం

ప్రపంచవ్యాప్తంగా బాల కార్మికుల దుస్థితి గురించి అవగాహన పెంచుతూ ప్రతి సంవత్సరం జూన్ 12న ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం జరుపుకుంటారు. ఈ దినోత్సవం పిల్లల హక్కులను పరిరక్షించడం, విద్యను ప్రోత్సహించడం, దోపిడీని తొలగించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తుంది. 2002లో అంతర్జాతీయ కార్మిక సంస్థ, బాలకార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని ప్రవేశపెట్టింది. బాల కార్మిక సమస్యపై దృష్టిని కేంద్రీకరించడానికి ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని ప్రారంభించింది. 2002 నుంచి ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు, పలు సంస్థలు జూన్ 12న బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి.

ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం ప్రాముఖ్యత

బాల కార్మిక వ్యతిరేకత గురించి అవగాహన పెంచడం, దానిని నిరోధించడం ఈ దినోత్సవ లక్ష్యం. బాల కార్మికులు విద్యను పొందడం, దోపిడీ లేని బాల్యంతో సహా వారి ప్రాథమిక హక్కులను కాపాడాల్సిన అవసరాన్ని ఈ దినోత్సవం గుర్తు చేస్తుంది. ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యం నిర్దేశించుకుంది. ఇది 2025 చివరి నాటికి బలవంతపు శ్రమ, బాల కార్మికులను నిర్మూలించడం లక్ష్యంగా పెట్టుకుంది.

బాల కార్మికులు ఎంత మంది ఉన్నారు?

ప్రపంచ వ్యాప్తంగా ఎంత మంది బాల కార్మికులు ఉన్నారనే అంశాలను యూనిసెఫ్ నివేదికలు వెల్లడిస్తున్నాయి. తాజాగా ప్రపంచ వ్యాప్తంగా 160 మిలియన్ల మంది బాల కార్మికులు ఉన్నారని అంచనా. ఐఎల్‌వో అంచనా ప్రకారం 16 కోట్ల మంది బాలకార్మికులను గుర్తించారు. వీరిలో 7.9 కోట్ల మంది ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్నారు. వారి ఆరోగ్యం, భద్రత ప్రమాదంలో ఉంది.
ముఖ్యంగా వ్యవసాయం, సేవలు,పరిశ్రమలు సహా వివిధ రంగాలలో బాల కార్మికులు ఎక్కువగా ఉన్నారు.

బాల కార్మికుల జీవితాలపై ప్రభావం

బాల కార్మికులు విద్యను పొందే అవకాశాన్ని కోల్పోతున్నారు. ఇది వారి ఆరోగ్యం, అభివృద్ధి, భవిష్యత్తు అవకాశాలపై దీర్ఘకాలిక పరిణామాలకు దారితీస్తుంది. పేదరికం, దారిద్ర్యం కారణంగా కోట్లాది మంది బాల కార్మికులు ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్నారు. బడికి వెళ్లి అక్షరాలు దిద్దాల్సిన చిట్టి చేతులు, ప్రమాదకర రసాయనాల పరిశ్రమల్లో నలిగిపోతున్నాయి.

బాల కార్మిక వ్యవస్థను రూపుమాపడం సాధ్యమా?

ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు బాల కార్మికులను నిషేధించడానికి, పిల్లల హక్కులను రక్షించడానికి చట్టాలు, విధానాలను రూపొందించాయి. బాల కార్మికుల గురించి అవగాహన పెంచడానికి, విద్యను కీలక పరిష్కారంగా ప్రోత్సహించడానికి సంస్థలు, వ్యక్తులు కృషి చేస్తున్నారు. బాల కార్మికులకు పునరావాసం కల్పించడం, వారికి విద్యను పొందటానికి, నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి మద్దతు అందించడంపై దృష్టి సారించాయి.
బాల కార్మికులను నిర్మూలించడంలో పేదరికం, అసమానత ముఖ్యమైన సవాళ్లుగా ఉన్నాయి.
కోవిడ్ మహమ్మారి బాల కార్మికులను తీవ్రతరం చేసింది, ఆర్థిక ఇబ్బందులు, పాఠశాల మూసివేతల కారణంగా చాలా మంది పిల్లలు పని చేయవలసి వచ్చింది. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు, వారి హక్కులు కాపాడటానికి సమిష్టిగా కృషి చేయాల్సి ఉంది.

పలు సంస్థలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రపంచ కార్మిక సంస్థ ఐఎల్వో 2002 ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవాన్ని ప్రారంభించింది. 2006లో బాల కార్మికులకు వ్యతిరేకంగా గ్లోబల్ మార్చ్ నిర్వహించి అవగాహన పెంచింది. 2015లో బాల కార్మికుల నిర్మూలనపై ఐక్యరాజ్యసమితి స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించుకుంది. 2020లో ప్రపంచాన్ని విణికించిన మహమ్మారి కోవిడ్, బాల కార్మికులను తీవ్రతరం చేసింది.

మన దేశంలో బాల కార్మికుల దుస్థితి

దేశంలో కోటి 80 లక్షల మంది బాల కార్మికులను గుర్తించారు. అనేక రంగాల్లో వీరు పని చేస్తున్నారు. ముఖ్యంగా వ్యవసాయం, తయారీ పరిశ్రమల్లో వీరు మగ్గిపోతున్నారు. కుటుంబ అవసరాలు తీర్చుకోవడం కోసం తల్లిదండ్రులే పిల్లలను పనిలోకి దింపుతున్నారు. 14 సంవత్సరాలు నిండని బాలలను పనికి పెట్టుకోవడం నేరమని తెలిసినా, తక్కువ ధరకు దొరికే కూలీల కారణంగా యాజమాన్యాలు తప్పుదారి పడుతున్నాయి.

ఎందుకీ దుస్థితి

బాల కార్మికులు తయారు కావడానికి ప్రధాన కారణం పేదరికం. దేశంలో ఇప్పటికే 5.4 కోట్ల మంది కడు పేదరికంలో మగ్గుతున్నారు. వారి అవసరాలు తీర్చుకునేందుకు ఎక్కువ మంది పిల్లలను కనడంతోపాటు, వారిని పనిలోకి దింపుతున్నారు. దేశంలో రోజుకు కనీసం 3 డాలర్ల ఆదాయం లేని కుటుంబాలు 2 కోట్లకుపైగా ఉన్నాయని తాజా గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో అత్యధిక సంఖ్యలో బాల కార్మికులు ఉన్నారు.

కఠిన చట్టాలున్నా అమలు తీరు అంతంతే…

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు దేశంలో కఠిన చట్టాలు ఉన్నాయి. వాటి అమలు తీరు తీసికట్టుగా ఉంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 24 ప్రకారం, 14 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను ప్రమాదకరమైన వృత్తులలో నియమించడాన్ని నిషేధిస్తుంది. బాల కార్మికచట్టం, 1986 ప్రకారం, అన్ని రంగాలలో 14 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను నియమించడాన్ని నిషేధించారు. జాతీయ బాల కార్మిక విధానం1987 ప్రకారం, పిల్లలను పని నుండి విముక్తి కల్పించడం, వారికి విద్య, పోషకాహారం, స్టైపెండ్‌లను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. విద్యా హక్కు చట్టం ప్రకారం, ఆరు నుంచి 14 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు ఉచిత, తప్పనిసరి చేశారు.

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇందుకు అనేక చర్యలు తీసుకుంటున్నారు. వీరి ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తరచూ అధికారులు దాడులు నిర్వహించి, యాజమాన్యాలపై పీడీ యాక్టు ప్రయోగిస్తున్నారు. బాల కార్మికులను గుర్తించి వారికి పని నుంచి విముక్తి కల్పించి, వారికి సరైన విద్యను ఉచితంగా అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. పిల్లల అక్రమ రవాణాపై భారత రైల్వే కూడా దృష్టి సారించింది. పేదరికం ఎక్కువగా ఉండే బిహార్, యూపీ, ఒడిషా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి పిల్లలను దక్షిణాది రాష్ట్రాల్లో పనులకు తరలిస్తున్నారని గుర్తించారు. ప్రతి రైలు బోగీని పరిశీలిస్తున్నారు. అనుమానం వస్తే వెంటనే తనిఖీలు నిర్వహించి, కేసులు నమోదు చేస్తున్నారు.

అతి ప్రమాదకరమైన పనుల్లో బాల కార్మికులు

బాల కార్మికులు అతి ప్రమాదకరమైన పేలుడు పదార్ధాల తయారీలో పనిచేస్తున్నారు. తక్కువ ధరకు కూలీలు బాల కార్మికుల రూపంలో లభించడం, వారితో రోజుకు 15 గంటలు పనిచేయించుకుంటూ, శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారు. బాల కార్మికులు హక్కుల కోసం పోరాటం చేయడం గాని, శ్రమ దోపిడీపై గాని నోరెత్తరు. అందుకే ఇటుకల తయారీ, టపాసుల తయారీ రంగాల్లో బాల కార్మికులు అధికంగా పనిచేస్తున్నారు. వ్యవసాయరంగంలోనూ బాలకార్మికులు ఎక్కువగా ఉన్నారు. ముఖ్యంగా పంటలు తీసే సమయంలో ప్రభుత్వ బడుల్లో హాజరు తగ్గిపోవడాన్ని పలు రాష్ట్రాలు గుర్తించాయి.

నివారణ చర్యలు

బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు పలు రాష్ట్రాలు చర్యలు తీసుకుంటున్నా, పేదరికం ప్రధాన అడ్డంకిగా మారింది. దేశంలో కడు పేదరికం లేని రోజు బాల కార్మికులు కూడా తగ్గిపోతారని విశ్లేషకులు చెబుతున్నారు. పేదరికం లేకపోతే కుటుంబాల నుంచి బాల కార్మికులు వచ్చే అవకాశం లేదని వివరిస్తున్నారు. పేదరికం కారణంగా అధికంగా పిల్లలను కనడం, వారిని ఆస్థిగా భావించడం, సంవత్సరాల తరబడి పనులకు వారిని అమ్మివేయడం వంటి అకృత్యాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఇటుకల తయారీ పరిశ్రమలో వేలాది మంది బాలలు పనిచేస్తున్నారు. వ్యవసాయరంగంలో ముఖ్యంగా మిర్చి కోతల సమయంలో ప్రభుత్వ పాఠశాల్లో 3 లక్షల మంది బాలలు బడి మానేస్తున్నారు.దీనిపై ప్రభుత్వం దృష్టి సారించింది. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలంటే పేదరికం లేని సమాజం లక్ష్యంగా ఏపీలోని కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది.

అంత్యంత పేద దేశాల్లోనే బాల కార్మికులు ఎక్కువ

ఆఫ్రికా దేశాల్లో బాల కార్మికులు అధికంగా ఉన్నారు. పేదరికం ఎక్కువగా ఉన్న రువాండా, కెన్యా, ఉగాండాలాంటి దేశాల్లో లక్షలాది బాల కార్మికులు ఉన్నారు. ప్రపంచ కార్మిక సంస్థ, యూనిసెఫ్ బాల కార్మికులను గుర్తించి వారికి విముక్తి కల్పించే ప్రయత్నాలు చేస్తోంది. పలు దేశాలను అప్రమత్తం చేస్తోంది. పలు రక్షణ చట్టాలు తీసుకు వచ్చేలా కృష్టి చేస్తున్నారు. అయినా పేదరికం బాల కార్మికుల పాలిట శాపంగా మారింది. ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం ఆఫ్రికా, ఆసియా దేశాల్లోనే 12 కోట్ల మంది బాల కార్మికులు పోగుపడ్డారు. పేద దేశాలకు ఆర్థికంగా సాయం అందించడం ద్వారా, పేదరికం తగ్గించే చర్యల ద్వారా బాల కార్మిక వ్యవస్థకు అడ్డుకట్ట వేయవచ్చు.

పిల్లల అక్రమ రవాణా

బాల కార్మిక వ్యవస్థలో కుట్ర కోణాలు కూడా ఉన్నాయి. పిల్లలను కిడ్నాప్ చేసి వారిని బాల కార్మికులుగా అమ్మివేయడం, వారి చేతులు తీసివేసి భిచ్చగాళ్లుగా మారుస్తున్న దారుణమైన ఘటనలు కూడా వెలుగు చూస్తున్నాయి. ఇలాంటి ఘటనలు మహారాష్ట్రలో వెలుగు చూశాయి. ముంబై లాంటి నగరాల్లో వేలాది బాలలు బిచ్చమెత్తుకుంటూ కనిపిస్తుంటారు. కాని వారి వెనుక పెద్ద మాఫియా ఉందనే విషయం అందరికీ తెలిసిందే. ట్రాఫిక్ సిగ్నళ్లను అడ్డాలుగా మార్చుకుని దేశంలోని ఐదు ప్రధాన నగరాల్లో 90 వేల మంది బాలలు బిచ్చమెత్తుతున్నారనే నివేదికలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రధాన నగరాల్లో బిచ్చగాళ్లు లేని ట్రాఫిక్ సిగ్నల్ లేదంటే అతిశయోక్తి కాదు.

ప్రభుత్వ పథకాలు ఆదుకుంటున్నాయి

బాల కార్మిక వ్యవస్థను రూపు మాపడంలో భారత్ మంచి పనితీరు కనబరుస్తోంది. పలు రాష్ట్రాలు బడిలో చేరే పిల్లలకు భారీగా ఉచిత పథకాలు అమలు చేస్తోంది. గుజరాత్ ప్రభుత్వం బడిలో చేరే విద్యార్థులకు నెలకు 1000 నగదు బహుమతిగా అందిస్తోంది. ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పేరుతో ఒక్కో విద్యార్థికి రూ.15000 అందిస్తోంది. బిహార్, యూపీ ప్రభుత్వాలు కూడా బడికి వచ్చే పిల్లలను ప్రోత్సహించేందుకు పలు పథకాలు అమలు చేస్తున్నాయి. ముఖ్యంగా పేదరికం ఎక్కువగా ఉండే ప్రాంతాలు, జిల్లాలపై అధికారులు దృష్టి సారించాలి. బాలల అక్రమ రవాణాలపై నిఘా ఉంచాలి. ప్రమాదకర పరిశ్రమల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం, వారిని గుర్తించి సంస్థలు, పరిశ్రమలు సీజ్ చేయడం ద్వారా యాజమాన్యాల్లో భయం కల్పించాలి. కఠిన చట్టాలను కఠినంగా అమలు చేస్తే బాల కార్మిక వ్యవస్థను రూపుమాపడం సాధ్యమే.

Tags: andhratodaySLIDERTOP NEWSworld day against child labour
ShareTweetSendShare

Related News

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?
general

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్
general

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట
general

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు
general

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ఆచరణ సాధ్యమా?
general

పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ఆచరణ సాధ్యమా?

Latest News

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ఆచరణ సాధ్యమా?

పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ఆచరణ సాధ్యమా?

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్

అమరావతి మహిళలపై సజ్జల అనుచిత వ్యాఖ్యలు : డీజీపీకి డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఫిర్యాదు

అమరావతి మహిళలపై సజ్జల అనుచిత వ్యాఖ్యలు : డీజీపీకి డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఫిర్యాదు

పాలస్తీనాకు గ్రేటా థన్‌బర్గ్ వెడుతున్న నౌకను సీజ్ చేసిన ఇజ్రాయెల్

పాలస్తీనాకు గ్రేటా థన్‌బర్గ్ వెడుతున్న నౌకను సీజ్ చేసిన ఇజ్రాయెల్

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.