అమరావతి మహిళలు సాక్షి పత్రిక కార్యాలయాల వద్ద దర్నాలు చేయడంపై సజ్జల చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. సజ్జల రామకృష్ణారెడ్డి అనుచిత వ్యాఖ్యలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలంటూ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, డీజీపీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసు అధికారులు స్పందించాల్సి ఉంది.
అమరావతి మహిళలు రాక్షసులు, పిశాచులు, వారికి పుట్టిన సంకర తెగ అంటూ వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అమరావతి మహిళలు వేశ్యలంటూ సాక్షి టీవీలో వచ్చిన లైవ్ షోలో ఓ అతిథి చేసిన వ్యాఖ్యలతో వివాదం మొదలైంది. అమరావతి, దాని చుట్టుపక్కల సెక్స్ వర్కర్లు ఎక్కువగా ఉన్నారని, తాను ఓ జాతీయ పత్రికలో చదివానంటూ, సాక్షి టీవీలో మట్లాడిన కృష్ణంరాజు అనే విలేకరిపై కూడా కేసు నమోదైంది. కార్యక్రమాన్ని నిర్వహించిన సాక్షి యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావుపై కూడా కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.