Wednesday, June 4, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

డిజిటల్ ఇండియా సాకారం : జీడీపీ వృద్ధికి ఊతం

మోసకారి ముస్లిం ఫకీర్లను హిందువులుగా చూపించే ‘మీడియా సిక్యులరిజం’

రేషన్ అక్రమాలు : అధికారంతో చెలరేగిన వైసీపీ నేతలు

జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడే స్పాన్సర్

వాట్సప్ ద్వారా మెగా డీఎస్సీ హాల్ టికెట్లు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

డిజిటల్ ఇండియా సాకారం : జీడీపీ వృద్ధికి ఊతం

మోసకారి ముస్లిం ఫకీర్లను హిందువులుగా చూపించే ‘మీడియా సిక్యులరిజం’

రేషన్ అక్రమాలు : అధికారంతో చెలరేగిన వైసీపీ నేతలు

జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడే స్పాన్సర్

వాట్సప్ ద్వారా మెగా డీఎస్సీ హాల్ టికెట్లు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

రేషన్ అక్రమాలు : అధికారంతో చెలరేగిన వైసీపీ నేతలు

K Venkateswara Rao by K Venkateswara Rao
Jun 2, 2025, 03:51 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

రేషన్ అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. ఐదేళ్ల వైసీపీ పాలనలో తవ్వే కొద్దీ అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. లబ్దిదారులకు నేరుగా ఇంటికే రేషన్ అంటూ కాలం చెల్లిన వాహనాల కొనుగోలుకు వైసీపీ ప్రభుత్వం రూ.2 వేల కోట్ల ప్రజాధనం వృధా చేసింది. ఇంటింటికి రేషన్ అందించేందుకు 9650 వాహనాలు కొనుగోలు చేశారు. వాహనాలతో ప్రతి ఇంటికి రేషన్ డెలివరీ చేసే ప్రయత్నంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైంది. రాష్ట్ర వ్యాప్తంగా కోటి 46 లక్షల ఇళ్లకు ప్రతి ఇంటికి రేషన్ సరఫరా చేసేందుకు సిబ్బంది నిరాకరించారు. దీంతో గత ప్రభుత్వం వారికి కొంత వెసులుబాటు కల్పించింది. ప్రతి గల్లీలో మూల మలుపులో వాహనం నిలిపి నాలుగు బజార్లకు చెందిన వారికి రోడ్డుపై క్యూల్లో నిల్చోపెట్టి బియ్యం పంపిణీ చేశారు. వాహనం వచ్చే సమయానికి లబ్దిదారుడు ఒక వేళ ఇంట్లో లేకపోతే ఇక ఆ వాహనాన్ని వెతుక్కుంటూ వెళ్లాల్సి వచ్చింది. ఇలా వేల కోట్లతో వాహనాలు కొనుగోలు చేసినా, ప్రజలకు అయితే ప్రయోజనం దక్కలేదు.

వాహనాల నుంచే నేరుగా స్మగ్లర్ల చేతికి బియ్యం

రేషన్ బియ్యానికి ఆఫ్రికాలో మంచి డిమాండ్ ఉంది. దాన్ని ఆసరాగా చేసుకున్న కొందరు బియ్యం ఎగుమతిదారులు, వైసీపీ నేతలతో చేతులు కలిపి అక్రమాలకు తెరదింపారు. ఇంటింటికి రేషన్ పేరుతో వేలాది వాహనాలు కొనుగోలు చేసిన వైసీపీ నేతలు, లబ్దిదారుల వద్ద నుంచి కిలో బియ్యం పది రూపాయల చొప్పున సేకరించి వాటిని వెంటనే మిల్లర్లకు చేర్చినట్లు విచారణలో తేలింది. ఇలా లక్షల టన్నుల బియ్యం సేకరించి, వాటికి పాలిష్ వేసి నూకలు పేరుతో ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేశారు. ఆఫ్రికాలో కిలో బియ్యం రూ.76 ధరకు అమ్మి వేల కోట్లు పోగేశారు. ఇలా ఐదేళ్లపాటు రేషన్ మాఫియా సామ్రాజ్యానికి ఎదురేలేకుండా పోయింది.

ప్రభుత్వానికి కిలోకు రూ.46 ఖర్చు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆహార భద్రతలో భాగంగా కోట్లాది మంది పేదలకు ప్రతి నెలా బియ్యం సరఫరా చేస్తున్నాయి. ఏపీలో ప్రతి నెలా కోటి 46 లక్షల తెల్ల రేషన్ కార్డుల ద్వారా 4 కోట్ల 50 లక్షల మందికి ఉచితంగా 22.50 కోట్ల కిలోల బియ్యం సరఫరా చేస్తున్నారు. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కిలోకు. రూ.46 వ్యయం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం రైతుల వద్ద నుంచి లావు రకాలను మద్దతు ధరకు కొనుగోలు చేసి, వాటిని మిల్లర్లకు అప్పగించి వారికి కిలోకు. 46 చెల్లిస్తోంది. ఇలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత బియ్యం పథకానికి ఏటా రూ.12 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాయి. ప్రజలు దొడ్డు రకం బియ్యం తినడం లేదనే విషయం తెలిసినా ప్రభుత్వం ఏమీ చేయలేని దుస్థితిలో ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో సరఫరా చేస్తోన్న బియ్యం లబ్దిదారుల ఇళ్లకు చేరకుండానే కాకినాడ పోర్టు ద్వారా ఆఫ్రికా దేశాలకు తరలిపోతున్నాయి.

ఐదేళ్లలో 30 వేల కోట్ల అవినీతి

ఐదేళ్ల వైసీపీ పాలనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత బియ్యం పథకానికి రూ.60 వేల కోట్లు ఖర్చు చేశాయి. ఇందులో లబ్దిదారులకు దక్కిన ప్రయోజనం రూ.10000 కోట్లు మించలేదు. కేవలం కేజీ పది రూపాయలకు లబ్దిదారులు బియ్యం అమ్మడం ప్రారంభించారు. ఇదే అదునుగా బియ్యం మాఫియా చెలరేగిపోయింది. పేదల నుంచి తక్కువ ధరకే బియ్యం కాజేసి, ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేయడం ద్వారా వైసీపీ నేతలు వేల కోట్ల దోపిడీకి పాల్పడ్డారనే విషయం కూటమి ప్రభుత్వం గ్రహించింది.

లావు రకం బియ్యంమే ప్రధాన ఇబ్బంది

ప్రజలు చాలా కాలంగా సన్న రకాల బియ్యానికి అలవాటు పడ్డారు. పేదలు, కూలీలు కూడా దొడ్డు రకాలను తినడం లేదు. ప్రభుత్వం మాత్రం రైతులకు మద్దతు ధర ఇచ్చేందుకు వారి వద్ద నుంచి ఏటా 40 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తోంది. వాటిని బియ్యంగా మార్చి గిడ్డంగుల్లో నిల్వ చేసి, పౌరసరఫరాల సంస్థ ద్వారా పేదలకు ప్రతి నెలా ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఇందుకు ఏపీ ప్రభుత్వానికి ఏటా రూ.1200 కోట్లు ఖర్చవుతోంది. కేంద్ర ప్రభుత్వం ఏపీలో ఉచిత బియ్యానికి రూ.6 వేల కోట్లు ఖర్చు చేస్తోంది. ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేల కోట్లు ఖర్చు చేస్తున్నా, అనుకున్న లక్ష్యం నేరవేరడం లేదు.

బియ్యం బదులు నగదు

దొడ్డు రకం బియ్యం లబ్దిదారులు తినడం లేదనే విషయాన్ని సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లారు. ప్రత్యామ్నాయంగా బియ్యం బదులు నగదు ఇవ్వడం లేదంటే జొన్నలు, కొర్రలు, రాగులు, గోధుమ పిండి ఇవ్వాలని సూచించారు. ఇందుకు ప్రజల వద్ద నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ప్రజలు ఎక్కువ మంది ఏది కోరుకుంటారో పరిశీలించి, రాబోయే కొద్ది రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నారు. చాలా మంది లబ్దిదారులు సన్నబియ్యం కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా సన్నబియ్యం సరఫరా చేస్తోంది. ఏపీ ప్రజలు నగదు, లేదా సన్నబియ్యం కావాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటుందని పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.

కూటమి ప్రభుత్వం వచ్చాక రేషన్ మాఫియాకు అడ్డుకట్ట

ఏపీలో 2024లో కూటమి ప్రభుత్వం రాగానే కాకినాడ పోర్టు నుంచి రేషన్ ఎగుమతి చేసే మాఫియాకు అడ్డుకట్ట వేశారు. మాఫియాను అడ్డుకునేందుకు నేరుగా ఉప ముఖ్మమంత్రి పవన్ కల్యాణ్ రంగంలోకి దిగారు. కాకినాడ పోర్టులో ఓడల్లోకి ఎక్కిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. షిప్‌ను సీజ్ చేయించారు. రేషన్ బియ్యాన్ని గిడ్డంగుల్లో దింపి కేసులు నమోదు చేశారు. రేషన్ బియ్యం పేదలకు చేరకముందే నేరుగా మాఫియా చేతుల్లోకి వెళ్లడాన్ని గమనించిన ప్రభుత్వం ఇంటింటికి రేషన్ తీసుకెళ్లే వాహనాలను రద్దు చేశారు.

డీలర్ల వ్యవస్థకే మొగ్గు

కూటమి ప్రభుత్వం డీలర్ల ద్వారా బియ్యం సరఫరా చేయాలని నిర్ణయించింది. ఇంటింటికి రేషన్ పేరుతో గత ప్రభుత్వం కొనుగోలు చేసిన వేలాది వాహనాలను, ఆపరేటర్లకు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. దాని ద్వారా వారికి కూడా ఉపాధి లభించనుంది. ఏపీలోని 29 వేల మంది డీలర్ల ద్వారా ప్రతి నెలా మొదటి పది హేను రోజుల పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు బియ్యం సరఫరా చేయాలని ఆదేశించారు. పేదలు, కూలీలు వారికి సమయం దొరికినప్పుడు వచ్చి తీసుకునే వెసులుబాటు కల్పించారు. దీంతో బియ్యం వాహనం ఎప్పుడు వస్తుందోనన్న భయం తొలగిపోయింది. ఒకవేళ ఒక నెలలో రేషన్ తీసుకోకపోతే మరో నెలలో తీసుకునే వెసులుబాటు కల్పించారు.

అక్రమాలకు అడ్డుకట్ట

వాహనాల ద్వారా ఇంటింటికి రేషన్ పేరుతో కేవలం 30 శాతం మందికి బియ్యం సరఫరా చేసి, మిగిలిన బియ్యం కాజేశారని మంత్రి నాదెండ్ల మనోహర్ గుర్తుచేశారు. బియ్యం అక్రమాల్లో అనేక అవకతవకలు వెలుగు చూశాయని ఆయన అన్నారు. రేషన్ బియ్యం పేదలకు చేరాలంటే డీలర్ల వ్యవస్థ తీసుకు రావడం తప్ప వేరే మార్గం లేదన్నారు. ప్రజల అభిప్రాయాలు మూడు నెలలపాటు సేకరించి ఈ నిర్ణయానికి వచ్చినట్లు మంత్రి చెప్పారు.

ఉత్తరాదిలో పరిస్థితి ఎలా ఉంది

దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాల సహకారంతో పౌరసరఫరాల ద్వారా గోధుమలు, బియ్యం సరఫరా చేస్తోంది. ఇందుకు ఏటా కేంద్రం రూ.3 లక్షల కోట్లు, రాష్ట్రాలు రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నాయి. ఉత్తరాదిలో గోధుమలు సరఫరా చేస్తున్నారు. ప్రజలు వాటిని పిండిగా మార్చి ఉపయోగించుకుంటున్నారు. బియ్యం సరఫరా చేసే రాష్ట్రాల్లో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో పరిస్థితి భిన్నంగా ఉంది. దొడ్డు రకం బియ్యాన్ని సరఫరా చేయడంతో అందులో పది శాతం మంది కూడా ఆహారంగా తీసుకోవడం లేదు. దీన్ని వ్యాపారంగా మలుచుకున్న నాయకులు గ్రామాల వారీగా ఏజంట్లను నియమించుకుని రేషన్ బియ్యం సేకరించి, మిల్లర్లకు, అక్కడ నుంచి ఎగుమతిదారులకు అమ్మడం ప్రారంభించారు. దీంతో ప్రభుత్వ లక్ష్యం నీరుకారిపోయింది.

ఇప్పటికైనా బియ్యం అక్రమాలకు తెరపడుతుందా

దొడ్డు రకం బియ్యం సరఫరా చేసినంత కాలం రేషన్ అక్రమాలు ఆగవని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రజలు వినియోగించే బియ్యం సరఫరా చేస్తే మాఫియా చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉండదు. అలా కాకుండా దొడ్డు రకాలు లబ్దిదారులకు పంపిణీ చేయడం ద్వారా పెద్దగా ప్రయోజనం దక్కదనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. తెలంగాణ తరహాలో సన్న బియ్యం సరఫరా చేయడం, లేదంటే బియ్యం బదులు నగదు ఇవ్వడం తప్ప వేరే పరిష్కారం లేదని పలువురు మంత్రులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.

ఆహార భద్రత చట్టం

దేశంలో ఆహార భద్రత చట్టం ప్రకారం పేదలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్కువ ధరకు, ఒక్కోసారి ఉచితంగా ఆహార ధాన్యాలు సరఫరా చేస్తున్నాయి. అయితే నాణ్యత విషయంలో పలు విమర్శలు వస్తున్నాయి. రైతుల వద్ద నుంచి మద్దతు ధరకు కొనుగోలు చేసిన గోధుమలు, బియ్యం గిడ్డంగుల్లో సంవత్సరాల తరబడి నిల్వ చేయడం, సరైన పద్దతుల్లో నిల్వ చేయకపోవడంతో అవి పాడైపోతున్నాయి. ఏటా ఇలా 2 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు వృధాగా పోతున్నాయి. పలు దేశాలు ఈ వ్యవస్థ స్థానంలో ఫుడ్ కూపన్లు అందిస్తున్నాయి. దీని ద్వారా పేద కుటుంబాలకు లభించే ఫుడ్ కూపన్లను ఎక్కడైనా ఆహారం కొనుగోలు చేసుకునేందుకు ఉపయోగించుకోవచ్చు. ఇలాంటి విధానం మనదేశంలో కూడా అమలు చేయాల్సిన అవసరముంది.

మూడు నెలల రేషన్ ఒకేసారి

కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మూడు నెలల రేషన్ ఒకేసారి ఇవ్వాలని రాష్ట్రాలను ఆదేశించింది. వచ్చే మూడు నెలలపాటు వర్షాలు, వరదలు వచ్చే అవకాశం ఉండటంతో మూడు నెలల బియ్యం ముందే పంపిణీ చేయాలని నిర్ణయించారు. మూడు నెలలకు ఒకేసారి ఉచితంగా బియ్యం అందిస్తున్నారు. గిడ్డంగుల నుంచి ఇప్పటికే డీలర్ల వద్దకు తరలించి, పంపిణీ ప్రారంభించారు. ఈ విధానం సత్ఫలితాలిస్తే రాబోయే రోజుల్లో కూడా ప్రతి నెలా కాకుండా, మూడు నెలలకు ఒకేసారి బియ్యం ఇవ్వాలని కేంద్రం యోచనగా ఉన్నట్లు తెలుస్తోంది.

Tags: #rationmafiraandhratodaynewSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

డిజిటల్ ఇండియా సాకారం : జీడీపీ వృద్ధికి ఊతం
general

డిజిటల్ ఇండియా సాకారం : జీడీపీ వృద్ధికి ఊతం

మోసకారి ముస్లిం ఫకీర్లను హిందువులుగా చూపించే ‘మీడియా సిక్యులరిజం’
general

మోసకారి ముస్లిం ఫకీర్లను హిందువులుగా చూపించే ‘మీడియా సిక్యులరిజం’

జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడే స్పాన్సర్
general

జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడే స్పాన్సర్

వాట్సప్ ద్వారా మెగా డీఎస్సీ హాల్ టికెట్లు
general

వాట్సప్ ద్వారా మెగా డీఎస్సీ హాల్ టికెట్లు

ఏపీ సోలార్ రూప్‌టాప్ పథకం : పేదలకు ఆదాయ మార్గం
general

ఏపీ సోలార్ రూప్‌టాప్ పథకం : పేదలకు ఆదాయ మార్గం

Latest News

డిజిటల్ ఇండియా సాకారం : జీడీపీ వృద్ధికి ఊతం

డిజిటల్ ఇండియా సాకారం : జీడీపీ వృద్ధికి ఊతం

మోసకారి ముస్లిం ఫకీర్లను హిందువులుగా చూపించే ‘మీడియా సిక్యులరిజం’

మోసకారి ముస్లిం ఫకీర్లను హిందువులుగా చూపించే ‘మీడియా సిక్యులరిజం’

రేషన్ అక్రమాలు : అధికారంతో చెలరేగిన వైసీపీ నేతలు

రేషన్ అక్రమాలు : అధికారంతో చెలరేగిన వైసీపీ నేతలు

జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడే స్పాన్సర్

జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడే స్పాన్సర్

వాట్సప్ ద్వారా మెగా డీఎస్సీ హాల్ టికెట్లు

వాట్సప్ ద్వారా మెగా డీఎస్సీ హాల్ టికెట్లు

ఏపీ సోలార్ రూప్‌టాప్ పథకం : పేదలకు ఆదాయ మార్గం

ఏపీ సోలార్ రూప్‌టాప్ పథకం : పేదలకు ఆదాయ మార్గం

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు

హనీమూన్‌కు వెళ్లిన జంట మిస్సింగ్

హనీమూన్‌కు వెళ్లిన జంట మిస్సింగ్

సాగుకు భరోసా కనీస మద్దతు ధర

సాగుకు భరోసా కనీస మద్దతు ధర

మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్ట్

మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్ట్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.