భారత రక్షణ రంగానికి చెందిన కీలక సమాచారం పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజంట్లకు చేరవేయడానికి గూఢచారిగా వ్యవహరించిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా లీలలు మరిన్ని బయటకు వస్తున్నాయి. కేరళలో జ్యోతి పర్యటనకు ఆ రాష్ట్ర పర్యాటక మంత్రి, సీఎం అల్లుడు మహమ్మద్ రియాస్ సహాయం చేశారంటూ బీజేపీ నేత కె.సురేంద్రన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేరళ సీఎం పినరయి విజయన్ అల్లుడు రియాస్, స్వయంగా జ్యోతి మల్హాత్రా కన్నూర్ పర్యటనకు ఖర్చులు భరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే జ్యోతి ఎక్కడ పర్యటించింది, ఎవరిని కలిసింది అనే దానిపై విచారణ జరుగుతోంది. పాక్ గూఢచారికి కేరళలో రెడ్ కార్పెట్ వెనకాల ఉన్న కుట్రను వెలికితీయాలని సురేంద్రన్ డిమాండ్ చేశారు.
జ్యోతి మల్హోత్రా ట్రావెల్ బ్లాగర్. ఐదేళ్లుగా ట్రావెల్ విత్ జో పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ నడుపుతోంది. 2023లో పాకిస్థాన్లో పర్యటించింది. ఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయంలో పనిచేసే డానిష్ సహాయంతో ఆమె పాకిస్థాన్కు, పలు దఫాలు వెళ్లినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ గుర్తించింది. పహల్గాం పర్యటనకు ఆరు రోజుల ముందే జ్యోతి మల్హాత్రా ఆ ప్రాంతంలో వీడియోలు చేస్తూ పర్యటన చేయడంపై కూడా జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ జరుపుతోంది.