తిరుమల తిరుపతి దేవస్థానం బోర్లు మరో కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా శ్రీవాణి టికెట్ల జారీకి కొత్త కౌంటర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. స్థానిక హెచ్వీసీ సమీపంలోని అన్నమయ్యభవన్ ఎదురుగా సువిశాలంగా నిర్మించిన నూతన భవనంలో శ్రీవాణి దర్శన టికెట్ల జారీ కేంద్రాన్నిఏర్పాటు చేశారు.
ఎండ వానకు భక్తులు ఇబ్బందులు పడకుండా ఉండేలా సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ప్రత్యేక క్యూలైన్లు సిద్దం చేశారు. వికలాంగులు, వృద్ధులు విశ్రాంతి తీసుకునేందుకు మెత్తటి సోఫాలు ఏర్పాటు చేశారు. గతంలో ఇక్కడ అదనపు ఈవో కార్యాలయం నిర్వహించారు. రద్దీ ఎక్కువ కావడం, వీఐపీ సిఫార్సు లేఖలతో వచ్చే భక్తులతో ఏర్పడిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కార్యాలయం మార్చారు.