పాకిస్థాన్కు గూఢచర్యం చేస్తూ దొరికిపోయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను 14 రోజులు పోలీస్ కస్టడీకి ఇస్తూ హిస్సార్ కోర్టు తీర్పు ఇచ్చింది. ఇప్పటికే నాలుగు రోజుల పాటు విచారించిన పోలీసులకు, జ్యోతి మల్హోత్రా మొబైల్, ల్యాప్ట్యాప్లో 12 టెరాబైట్ల డేటా లభించడంతో విచారణకు కస్టడీకి అనుమతించాలంటూ కోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న న్యాయమూర్తి జ్యోతి మల్హోత్రాను 14 రోజులు పోలీసు కస్టడీకి అనుమతించారు.
జ్యోతి మల్హోత్రా పాకిస్థాన్లో పర్యటించిన సమయంలో అక్కడి మిలటరీ అధికారులు ఆరుగురు గన్మెన్లను రక్షణగా ఇచ్చినట్లు వీడియోలు హల్చల్ చేస్తున్నాయి.ఆ వీడియోలోని రక్షణకు వచ్చిన వారి దుస్తులపై నో ఫియర్ అని రాసి ఉండటం స్పష్టంగా కనిపించింది.
2023లో ఢిల్లీలోని పాకిస్థాన్ హై కమిషన్కు పాస్పోర్టు కోసం జ్యోతి మల్హోత్రా వెళ్లిన సమయంలో అక్కడి ఉద్యోగి డానిష్ పరిచయం అయినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఆ తరవాత జ్యోతి మల్హోత్రా పాక్ పర్యటనలో డానిష్ మరింత దగ్గరైనట్లు గుర్తించారు. డానిష్ పాకిస్థాన్ మిలటరీ అధికారులకు జ్యోతి మల్హోత్రాను పరిచయం చేశారు. వారికి ఐఎస్ఐతో సంబంధాలున్నాయని తెలిసినా, కీలక సమాచారం వారికి చేరవేసినట్లు ప్రాధమిక విచారణలో వెల్లడైంది.