వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ను నూజివీడు కోర్టు కొట్టివేసింది. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో ఆయన ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. బెయిల్ కోసం నూజివీడు కోర్టులో వల్లభనేని వంశీ తరపు న్యాయవాదులు వేసిన పిటిషన్ను న్యాయమూర్తి కొట్టివేశారు.
వల్లభనేని వంశీకి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య చికిత్స అందించారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు వస్తున్నాయంటూ వల్లభనేని వంశీ తరపు న్యాయవాదులు విజయవాడ కోర్టులో న్యాయమూర్తికి చెప్పిన విషయం తెలిసిందే. దీనిపై జైలు అధికారులు వల్లభనేని వంశీని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. వంశీకి అవసరమైన మందులు ఇప్పించారు.