Sunday, May 25, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

కృష్ణా జిల్లాలో 15మంది అక్రమ బంగ్లాదేశీలు, రోహింగ్యాల పట్టివేత

అడవిలో తూటాలు, నగరంలో కన్నీళ్ళు : మావోయిస్టుల ఎన్‌కౌంటర్ తర్వాత అర్బన్ నక్సల్స్ స్పందనలు

దేశంలో కరోనా కొత్త వేరియంట్లు

ఈపీఎఫ్ వడ్డీ రేటు ఖరారు చేసిన కేంద్రం

కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

కృష్ణా జిల్లాలో 15మంది అక్రమ బంగ్లాదేశీలు, రోహింగ్యాల పట్టివేత

అడవిలో తూటాలు, నగరంలో కన్నీళ్ళు : మావోయిస్టుల ఎన్‌కౌంటర్ తర్వాత అర్బన్ నక్సల్స్ స్పందనలు

దేశంలో కరోనా కొత్త వేరియంట్లు

ఈపీఎఫ్ వడ్డీ రేటు ఖరారు చేసిన కేంద్రం

కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

కృష్ణా జిల్లాలో 15మంది అక్రమ బంగ్లాదేశీలు, రోహింగ్యాల పట్టివేత

Phaneendra by Phaneendra
May 24, 2025, 07:40 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఆంధ్రప్రదేశ్‌ కృష్ణా జిల్లా పెనమలూరు మండలం కానూరు, తాడిగడప గ్రామాల చేరువలో అక్రమంగా నివసిస్తున్న 15మంది విదేశీయులను అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తులు బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి అక్రమంగా భారత్‌లోకి చొరబడినవారు అని భావిస్తున్నారు. వారు తాడిగడపలో ఒక నిర్మాణ స్థలంలో పని చేస్తున్నారు. వారిని ఏప్రిల్ 23 శుక్రవారం నాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పెనమలూరు పోలీస్ ఇనస్పెక్టర్ వివరణ ప్రకారం ఆ వ్యక్తులు 20 నుంచి 35 ఏళ్ళ వయస్సులో ఉన్నారు. వాళ్ళు పదేళ్ళకు పైగా హైదరాబాద్‌లో నివసించారు. హైదరాబాద్ పోలీసులు అందించిన నిఘా సమాచారం వల్ల ఈ బంగ్లాదేశీలు, రోహింగ్యాలు కృష్ణా జిల్లాకు వచ్చిన సంగతి వెలుగు చూసింది.  

వివిధ భద్రతా సంస్థలు అందించిన నిఘా సమాచారం ఆధారంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు డ్రైవ్ నిర్వహించారు. హైదరాబాద్ బాలాపూర్‌లోని శరణార్థి శిబిరంలో పలువురు అక్రమ బంగ్లాదేశీ, రోహింగ్యా చొరబాటుదారులు ఉన్నారు. వారిలో కొంతమంది ఆంధ్రప్రదేశ్‌కు వచ్చారు. వారినే ఇప్పుడు పోలీసులు పట్టుకున్నారు.

నిఘా సమాచారం మేరకు, హైదరాబాద్ పోలీసులు ఆంధ్రప్రదేశ్ కౌంటర్ ఇంటలిజెన్స్ బృందాలు, స్థానిక పెనమలూరు పోలీసులతో సమన్వయం చేసుకుని రోహింగ్యాలు, బంగ్లాదేశీలు ఎక్కడున్నారో కనుగొన్నారు. వారు తాడిగడపలో ఒక కన్‌స్ట్రక్షన్ సైట్‌లో నాలుగు రోజులుగా పని చేస్తున్నారని తెలిసింది.

హైదరాబాద్‌కు చెందిన ఒక మేస్త్రీ, విజయవాడలో నిర్మాణ పనులు చేస్తూ కూలీ పని కోసం వారిని తీసుకొచ్చాడని దర్యాప్తులో బైటపడింది. ఆ మేస్త్రీ వారిని తీసుకువచ్చే క్రమంలో ఎలాంటి చట్టబద్ధమైన ప్రక్రియలూ అనుసరించలేదనీ, స్థానిక అధికారులకు సమాచారం అందించలేదనీ అధికారులు వివరించారు. ఇమిగ్రేషన్ నిబంధనలను వారు ఉల్లంఘించడం ఆందోళన కలగజేస్తోంది.  

పోలీసులు అక్రమ చొరబాటుదారులను తదుపరి విచారణ కోసం కస్టడీలోకి తీసుకున్నారు. ఈ విదేశీయులను తీసుకురావడంలో కాంట్రాక్టర్ ప్రమేయం గురించి పోలీసులు విచారిస్తున్నారు. ఏ పత్రాలూ లేకుండా ఇలా దేశంలోకి చొరబడుతున్నవారికి ఏయే ప్రదేశాలకు వెళ్ళాలి, ఎక్కడ ఎలాంటి ఉపాధి పొందాలి అన్న ఏర్పాట్లు చేసేందుకు పెద్ద నెట్‌వర్క్ ఏదైనా పని చేస్తోందా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇటీవలే, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక సందర్భంలో మాట్లాడుతూ అక్రమ చొరబాటుదారుల సెటిల్మెంట్లు – మరీ ముఖ్యంగా బంగ్లాదేశీలు, రోహింగ్యాల సెటిల్మెంట్ల – ఉనికి గురించి జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండాలని పోలీసు అధికారులకు సూచించారు. అక్రమ బంగ్లాదేశీలు, రోహింగ్యాల ఉనికి అంతర్గత భద్రతకు పెనుముప్పు అని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర పౌరులు అప్రమత్తంగా ఉండాలనీ, తమతమ ప్రాంతాల్లో స్థానికేతరులు అనుమానాస్పదంగా తిరుగుతుంటే వారి గురించి పోలీసులకు సమాచారం అందించాలనీ పిలుపునిచ్చారు.

Tags: BangladeshIllegal MigrantsInfiltratorsKrishna DistrictMyanmarPenamaluru MandalRohingyasTOP NEWS
ShareTweetSendShare

Related News

అడవిలో తూటాలు, నగరంలో కన్నీళ్ళు : మావోయిస్టుల ఎన్‌కౌంటర్ తర్వాత అర్బన్ నక్సల్స్ స్పందనలు
general

అడవిలో తూటాలు, నగరంలో కన్నీళ్ళు : మావోయిస్టుల ఎన్‌కౌంటర్ తర్వాత అర్బన్ నక్సల్స్ స్పందనలు

దేశంలో కరోనా కొత్త వేరియంట్లు
general

దేశంలో కరోనా కొత్త వేరియంట్లు

ఈపీఎఫ్ వడ్డీ రేటు ఖరారు చేసిన కేంద్రం
general

ఈపీఎఫ్ వడ్డీ రేటు ఖరారు చేసిన కేంద్రం

కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు
general

కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు

పడవలు మునిగి 427 మంది రొహింగ్యాలు మృతి?
general

పడవలు మునిగి 427 మంది రొహింగ్యాలు మృతి?

Latest News

కృష్ణా జిల్లాలో 15మంది అక్రమ బంగ్లాదేశీలు, రోహింగ్యాల పట్టివేత

కృష్ణా జిల్లాలో 15మంది అక్రమ బంగ్లాదేశీలు, రోహింగ్యాల పట్టివేత

అడవిలో తూటాలు, నగరంలో కన్నీళ్ళు : మావోయిస్టుల ఎన్‌కౌంటర్ తర్వాత అర్బన్ నక్సల్స్ స్పందనలు

అడవిలో తూటాలు, నగరంలో కన్నీళ్ళు : మావోయిస్టుల ఎన్‌కౌంటర్ తర్వాత అర్బన్ నక్సల్స్ స్పందనలు

దేశంలో కరోనా కొత్త వేరియంట్లు

దేశంలో కరోనా కొత్త వేరియంట్లు

ఈపీఎఫ్ వడ్డీ రేటు ఖరారు చేసిన కేంద్రం

ఈపీఎఫ్ వడ్డీ రేటు ఖరారు చేసిన కేంద్రం

కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు

కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు

పడవలు మునిగి 427 మంది రొహింగ్యాలు మృతి?

పడవలు మునిగి 427 మంది రొహింగ్యాలు మృతి?

సింధూ జలాలు ఆపితే…అందులో మీ రక్తం పారుతుంది : పాక్ ప్రేలాపనలు

సింధూ జలాలు ఆపితే…అందులో మీ రక్తం పారుతుంది : పాక్ ప్రేలాపనలు

శ్రీవారి భక్తులకు క్యూలైన్ షెడ్లు

శ్రీవారి భక్తులకు క్యూలైన్ షెడ్లు

అన్ని హద్దులూ దాటుతున్నారు : ఈడీపై సుప్రీంకోర్టు సీరియస్

మెగా డీఎస్సీకి సుప్రీంకోర్టు లైన్ క్లియర్

తిరుమలలో అపచారం: కొండ మీద ముస్లిం వ్యక్తి నమాజ్

తిరుమలలో అపచారం: కొండ మీద ముస్లిం వ్యక్తి నమాజ్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.