Saturday, June 7, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఏపీలో ఏడాది కూటమి ప్రభుత్వం పాలన

దేశ రక్షణ భద్రత విషయంలో స్వయం సమృద్ధి సాధించాలి : మోహన్ భాగవత్

దేశ రక్షణకు స్వయం నిర్ణయాలు తీసుకుని అమలు చేయాలి : సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్‌కు చెందిన 6 జెట్‌లు, 2 విమానాలు, చైనీస్‌ డ్రోన్లు ధ్వంసం

రిజర్వు బ్యాంకు పసిడి నిల్వలు ఎందుకు పెంచుకుంటోంది?

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

ఏపీలో ఏడాది కూటమి ప్రభుత్వం పాలన

దేశ రక్షణ భద్రత విషయంలో స్వయం సమృద్ధి సాధించాలి : మోహన్ భాగవత్

దేశ రక్షణకు స్వయం నిర్ణయాలు తీసుకుని అమలు చేయాలి : సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్‌కు చెందిన 6 జెట్‌లు, 2 విమానాలు, చైనీస్‌ డ్రోన్లు ధ్వంసం

రిజర్వు బ్యాంకు పసిడి నిల్వలు ఎందుకు పెంచుకుంటోంది?

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

370 ఆర్టికల్ రద్దు తరవాత పుట్టుకొచ్చిన ఉగ్రమూక టీఆర్‌ఎఫ్

K Venkateswara Rao by K Venkateswara Rao
Apr 23, 2025, 10:15 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

జమ్ముకశ్మీర్ పెహల్గాం ఉగ్రదాడి తరవాత టీఆర్‌ఎఫ్ ఉగ్రసంస్థ కార్యకలాపాలు మరోసారి చర్చకు దారితీసింది. లష్కర్ ఏ తొయ్యబా సంస్థపై నిషేధం విధించడంతోపాటు, అగ్రరాజ్యం అమెరికా పాకిస్థాన్‌కు ఆర్థిక సాయం నిలిపేయడంతో దానికి అనుబంధంగా టీఆర్‌ఎఫ్ ఉగ్ర సంస్థను ఏర్పాటు చేశారు. పాకిస్థాన్ ఐఎస్ఐ సహకారంతో లష్కర్ ఏ తొయ్యబా ఉగ్రవాదులను టీఆర్‌ఎఫ్‌లో చేర్చుకుని దాడులకు పాల్పడుతున్నారు.

జమ్ము కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370 రద్దు తరువాత టీఆర్‌ఎఫ్ ఉగ్రమూక పుట్టుకొచ్చింది. ద రెసిస్టెన్స్ ఫ్రంట్ పేరుతో ఆరేళ్లుగా ఉగ్రదాడులకు తెగబడుతోంది. కేంద్రం టీఆర్‌ఎఫ్‌ను నిషేధించింది. టీఆర్‌ఎఫ్ వ్యవస్థాపకుడు షేక్ సజ్జాద్ గుల్ మొదట ఆన్‌లైన్ వేదికగా చెలరేగిపోయాడు. తరవాత లష్కర్ ఉగ్రమూకల వద్ద శిక్షణ పొందిన సాజిద్ జాట్, సలీం రెహ్మాన్‌లను నియమించుకున్నాడు.ఈ సంస్థలో పదుల సంఖ్యలో ఉగ్రవాదులు ఉన్నట్లు కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. జమ్ము కాశ్మీర్‌లో ప్రముఖ జర్నలిస్ట్ బుఖారీ, ఆయన భద్రతా సిబ్బందిని హత మార్చడానికి 2018లో కుట్రపన్నారు. అప్పటి నుంచి టీఆర్‌ఎఫ్ కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి.

టీఆర్‌ఎఫ్ ఉగ్రవాదులు హిందువులు, సిక్కులు, కశ్మీర్ పండిట్లు, ముస్లింలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారు. 2020 ఏప్రిల్ 1న ఎల్వోసీ వెంట కుప్వారా జిల్లాలోని కేరన్ సెక్టార్‌లో నాలుగు రోజల పాటు భద్రతా దళాలతో టీఆర్‌ఎఫ్ కాల్పులకు తెగబడింది. 2020 అక్టోబరు 30 దక్షిణ కశ్మీర్ కుల్గాంలో ముగ్గురు బీజేపీ కార్యకర్తలను టీఆర్‌ఎఫ్ ఉగ్రవాదులు హతమార్చారు.

2020 నవంబరు 26న శ్రీనగర్ సమీపంలోని లాయేపోరా ప్రాంతంలో రాష్ట్రీయ రైఫిల్స్‌పై దాడికి తెగబడ్డారు. ఇద్దరు సైనికులను కాల్చి చంపారు.2023 ఫిబ్రవరి 26న పుల్వామాలో సంజయ్ శర్మ అనే కశ్మీరీ పండిట్‌ను ఉగ్రమూకలు కాల్చి చంపాయి. 2024 అక్టోబరు 20న గండేర్‌బల్‌లోని సోన్‌మార్గ్‌లో ఒక డాక్టరు, వలస కార్మికుడిని ఉగ్రవాదులు చంపేశారు. తాజాగా పహల్గాంలో టీఆర్‌ఎఫ్ ముక్కరులు చెలరేగిపోయారు. 28 మందిని పొట్టనబెట్టుకున్నారు.

Tags: andhratodaynewsjammu terror attackpahalgam attackpahalgam newspahalgam terror attackpahalgam terrorist attackpahalgam tourist attackSLIDERTerror Attackterror attack in jammuterror attack in kashmirterror attack in pahalgamTOP NEWS
ShareTweetSendShare

Related News

ఏపీలో ఏడాది కూటమి ప్రభుత్వం పాలన
general

ఏపీలో ఏడాది కూటమి ప్రభుత్వం పాలన

దేశ రక్షణ భద్రత విషయంలో స్వయం సమృద్ధి సాధించాలి : మోహన్ భాగవత్
general

దేశ రక్షణ భద్రత విషయంలో స్వయం సమృద్ధి సాధించాలి : మోహన్ భాగవత్

దేశ రక్షణకు స్వయం నిర్ణయాలు తీసుకుని అమలు చేయాలి : సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్
general

దేశ రక్షణకు స్వయం నిర్ణయాలు తీసుకుని అమలు చేయాలి : సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్‌కు చెందిన 6 జెట్‌లు, 2 విమానాలు, చైనీస్‌ డ్రోన్లు ధ్వంసం
general

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్‌కు చెందిన 6 జెట్‌లు, 2 విమానాలు, చైనీస్‌ డ్రోన్లు ధ్వంసం

రిజర్వు బ్యాంకు పసిడి నిల్వలు ఎందుకు పెంచుకుంటోంది?
general

రిజర్వు బ్యాంకు పసిడి నిల్వలు ఎందుకు పెంచుకుంటోంది?

Latest News

ఏపీలో ఏడాది కూటమి ప్రభుత్వం పాలన

ఏపీలో ఏడాది కూటమి ప్రభుత్వం పాలన

దేశ రక్షణ భద్రత విషయంలో స్వయం సమృద్ధి సాధించాలి : మోహన్ భాగవత్

దేశ రక్షణ భద్రత విషయంలో స్వయం సమృద్ధి సాధించాలి : మోహన్ భాగవత్

దేశ రక్షణకు స్వయం నిర్ణయాలు తీసుకుని అమలు చేయాలి : సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్

దేశ రక్షణకు స్వయం నిర్ణయాలు తీసుకుని అమలు చేయాలి : సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్‌కు చెందిన 6 జెట్‌లు, 2 విమానాలు, చైనీస్‌ డ్రోన్లు ధ్వంసం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్‌కు చెందిన 6 జెట్‌లు, 2 విమానాలు, చైనీస్‌ డ్రోన్లు ధ్వంసం

రిజర్వు బ్యాంకు పసిడి నిల్వలు ఎందుకు పెంచుకుంటోంది?

రిజర్వు బ్యాంకు పసిడి నిల్వలు ఎందుకు పెంచుకుంటోంది?

ప్రపంచంలో మరో పాకిస్తాన్‌గా మారుతున్న చైనా

ప్రపంచంలో మరో పాకిస్తాన్‌గా మారుతున్న చైనా

డిజిటల్ ఇండియా సాకారం : జీడీపీ వృద్ధికి ఊతం

డిజిటల్ ఇండియా సాకారం : జీడీపీ వృద్ధికి ఊతం

మోసకారి ముస్లిం ఫకీర్లను హిందువులుగా చూపించే ‘మీడియా సిక్యులరిజం’

మోసకారి ముస్లిం ఫకీర్లను హిందువులుగా చూపించే ‘మీడియా సిక్యులరిజం’

రేషన్ అక్రమాలు : అధికారంతో చెలరేగిన వైసీపీ నేతలు

రేషన్ అక్రమాలు : అధికారంతో చెలరేగిన వైసీపీ నేతలు

జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడే స్పాన్సర్

జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడే స్పాన్సర్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.