బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో సోమవారం అల్పపీడనం ఏర్పడినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. మరో 24 గంటల్లో అల్పపీడనం వాయవ్య దిశగా ప్రయాణించి నైరుతి బంగాళాఖాతం వైపు ప్రయాణించే అవకాశముందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది.
రాబోయే 48 గంటలపాటు బంగాళాఖాతంలో ప్రయాణించి అల్పపీడనం విస్తరించే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఏపీలో పలు జిల్లాల్లో రాబోయే మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని ఐఎండి ప్రకటించింది.
ఉత్తర కోస్తా, యానాంలో ఉష్ణోగ్రతలు రాబోయే నాలుగు రోజుల్లో 2 నుంచి 3 డిగ్రీలు పెరుగుతాయని ఐఎండి హెచ్చరించింది. ఆ తరవాత ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయి. దక్షిణ కోస్తా, రాయలసీమలో ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు పెరిగుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఆ తరవాత కొంత వరకు తగ్గే అవకాశముందని అంచనా.
నోరు పారేసుకున్న కర్ణాటక కాంగ్రెస్ హోంమంత్రి