ఔషధాల ధరలు పెరిగాయి. దేశవ్యాప్తంగా 900 రకాల ఔషధాల ధరలు నేటి నుంచి పెరిగాయి. ఈ విషయాన్ని నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రెసింగ్ అథారిటీ ప్రకటించింది. పెరిగిన జాబితాలో యాంటీ బయాటిక్స్, పెయిన్ కిల్లర్స్, గుండె జబ్బులు, షుగర్ వ్యాధికి సంబంధించిన మందులు ఉన్నాయి.
టోకు ధరల సూచీ ఆధారంగా ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేకుండానే ఔషధాల తయారీదారులు ధరలు సవరించుకోవచ్చు. ఔషధాల ధరలు గరిష్ఠంగా 1.74 శాతం వరకు పెరిగినట్లు ఎన్పీపీఏ ప్రకటించింది.
సవరించిన ధరల జాబితాలో అజిత్రోమైసిన్, అమోక్సిసిలిన్, క్లాపులానిక్ యాసిడ్, యాంటీబయాటిక్ డ్రై సిరప్, డైక్లోఫెనాక్ పెయిన్ కిల్లర్ ధరలు పెరిగాయి. డయాబెటిస్, గుండె జబ్బుల నివారణకు ఉపయోగించే ఔషధాల ధరలు స్వలంగా పెరిగాయి.