కృత్తివెంటి శ్రీనివాసరావు, ఆచార్య శలాక రఘునాథశర్మ కు కళారత్న ప్రదానం
ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం శ్రీవిశ్వావసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా 202 మందికి పురస్కారాలు అందజేసింది. కళారత్నకు 86 మందిని ఎంపిక చేసిన ప్రభుత్వం 116 మందిని ఉగాది పురస్కారాలతో సత్కరించింది. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఉగాది వేడుకల్లో అవార్డుల ప్రదాన కార్యక్రమం జరిగింది.
సాహిత్యంలో కృత్తివెంటి శ్రీనివాసరావు, ఆచార్య శలాక రఘునాథశర్మ, గుత్తికొండ సుబ్బరావుకు , అవధానం విభాగంలో అముదాల మురళి సంగీతంలో ద్వారం లక్ష్మి, మల్లాది బ్రదర్స్ శిల్పాకళలో కాటూరి వెంకటేశ్వరరావు కళారత్న పురస్కారాలు అందజేసింది.
పాత్రికేయ విభాగంలో వేమూరి బలరాం, ఎం. నాగేశ్వరరావు, వల్లీశ్వర్ కు కళారత్న అవార్డులు అందజేసింది. వేంపల్లె షరీఫ్, ఈతకోట సుబ్బారావు, కుప్పిలి పద్మ, డి. మధుసూదనరావు, అశ్విన్ కుమార్ తదితరులకు ఉగాది పురస్కారాలతో సన్మానించింది.