Saturday, May 10, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

పాకిస్తాన్ ఆర్తనాదాల వేళ అంతశ్శత్రువుల శాంతి గీతాలు

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

పాకిస్తాన్ ఆర్తనాదాల వేళ అంతశ్శత్రువుల శాంతి గీతాలు

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

రాష్ట్రం యూనిట్‌గా ఎస్సీ వర్గీకరణ అమలు : ఏపీ క్యాబినెట్ నిర్ణయం

K Venkateswara Rao by K Venkateswara Rao
Mar 18, 2025, 10:28 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

రాష్ట్రం యూనిట్‌గా, 2011 జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముందుగా జిల్లా యూనిట్‌గా అమలు చేయాలని భావించారు. అయితే విభజన తరవాత కొన్ని జిల్లాల్లో ఎస్సీల జనాభా వివరాలు సరిగా లేవు. దీంతో రాష్ట్రం యూనిట్‌గా అమలు చేయాలని నిర్ణయించారు. 2026 జనాభా లెక్కల తరవాత జిల్లా యూనిట్‌గా ఎస్సీల రిజర్వేషన్లు అమలు చేయాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయించింది.

ఎస్సీల వర్గీకరణను ఏ,బీ,సీ కేటగిరీలుగా విభజించారు. ఏ కేటగిరీలో రెల్లి, ఉప కులాలకు 1 శాతం, బీలో మాదిగ, ఉప కులాలకు 6.5 శాతం, సీలో మాల, ఉప కులాలకు 7.5 శాతం రిజర్వేషన్లను ప్రతిపాదిస్తూ రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.

విద్య, ఉద్యోగ నియామకాల్లో కమిషన్ 200 రోస్టర్ పాయింట్లను ప్రతిపాదించింది. కమిషన్ నివేదిక అధ్యయనానికి మంత్రుల సంఘాన్ని వేశారు. మంత్రివర్గ సంఘం ప్రతిపాదనలు రాష్ట్ర క్యాబినెట్ సోమవారం ఆమోదించింది.

రాష్ట్ర క్యాబినెట్‌లో ఎస్సీ వర్గీకరణపై సుదీర్ఘ చర్చ జరిగింది. హో మంత్రి అనిత, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నారు. డీఎస్సీ మెగా నోటిఫికేషన్ విడుదల, ఎస్సీ ఉప ప్రణాళిక నిధుల విడుదలలో జాప్యం వంటి అంశాలపై చర్చ జరిగింది. ప్రస్తుతానికి జిల్లాలు యూనిట్‌గా తీసుకుని వర్గీకరణ అమలు సాధ్యం కాదని, జనాభా లెక్కలు తేలే సరికి 2 సంవత్సరాలు పడుతుందని నిర్ణయానికి వచ్చారు. అప్పటి వరకు జాబ్ నోటిఫికేషన్లు వాయిదా వేయడం సాధ్యం కాదు, కాబట్టి రాష్ట్రం యూనిట్‌గా ఎస్సీ రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించారు. రెల్లి ఉప కులాలైన బేడ, బుడగ జంగాలకు 1 శాతం రిజర్వేషన్లు అమలు చేయనున్నారు. అసెంబ్లీలో 20వ తేదీ దీనిపై విస్తృతంగా చర్చించి, అదే రోజు జాతీయ ఎస్సీ కమిషన్‌ను నివేదించనున్నారు. ఆ తరవాత ఆర్డినెన్స్ జారీ చేస్తారు.

జిల్లా యూనిట్‌గా పరిగణించాలని ఎక్కువ మంది ఎమ్మెల్యేలు పట్టుపట్టారు. ఎమ్మెల్యే అభిప్రాయాలను టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు సేకరించారు. జిల్లా యూనిట్‌గా వర్గీకరణ చేయాలని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. మంత్రివర్గ సమావేశం తరవాత ఎస్సీ ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబును అభినందించారు. వర్గీకరణ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు మీడియాతో చెప్పారు.

కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకుందని ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు. కూటమి అధికారంలోకి రాగానే వర్గీకరణపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, రాజీవ్ మిశ్ర కమిషన్ నియమించారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన కమిషన్, 4 వేల మంది అభిప్రాయాలను తీసుకుంది. మాల, మాదిగ సంఘాలతో సమావేశాలు నిర్వహించి, వారి అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుంది. గతంలో వేసిన రామచంద్ర కమిషన్ నివేదిక ప్రకారం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. ఈ కమిషన్ వల్ల మాదిగ, ఉప కులాలకు 25 వేల ప్రభుత్వ ఉద్యోగాలు దక్కాయి.

మూడు దశాబ్దాల ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి తెర పడేలా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకున్నారని ఎమ్మెల్యే రామాంజనేయులు అభిప్రాయపడ్డారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మాదిగలు, ఉప కులాలు, ఆది ఆంధ్రా మాదిగలకు రిజర్వేషన్లు అమలు చేయడం హర్షనీయమన్నారు. ఎస్సీ వర్గీకరణ ద్వారా మాదిగలకు సరైన న్యాయం జరుగుతుందని మరో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు. పీ4 అమల్లోకి వస్తే మాదిగ, మాల వర్గాలు ఆర్థికంగా నిలదొక్కుకుంటాయన్నారు.

ఎంఆర్పీఎస్ ఉద్యమకారుడు మంద కృష్ణమాదిగ అలుపెరగని పోరాటం, ప్రధాని నరేంద్ర మోదీ చొరవ, సుప్రీంకోర్టు తీర్పుతో ఎస్సీ వర్గీకరణకు మార్గం సుగమమైంది. తెలంగాణ, ఏపీలో ఎస్సీలు మాదిగ, మాలలకు కలిపి రిజర్వేషన్లు అమలు చేయడం వల్ల తమకు నష్టం వాటిల్లుతోందని 1991లో మంద కృష్ణ మాదిగ ప్రారంభించిన ఉద్యమం మూడు దశాబ్దాలుపైగా సాగింది. చివరకు తెలంగాణ ఎన్నికల ముందు ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీ మేరకు, సుప్రీంకోర్టు తీర్పుతో వర్గీకరణకు అడ్డంకులు తొలిగిపోయాయి. మరి కొద్ది రోజుల్లోనే ఏపీలో వర్గీకరణ ఆర్డినెన్స్ ద్వారా అమల్లోకి రానుంది.

Tags: andhratodaylatestnewsAP Cabinetap cabinet expansionap cabinet meetap cabinet meet in vijayawadaAP Cabinet Meetingap new cabinetap newsjagan cabinet meetingkapu reservationSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

పాకిస్తాన్ ఆర్తనాదాల వేళ అంతశ్శత్రువుల శాంతి గీతాలు
Latest News

పాకిస్తాన్ ఆర్తనాదాల వేళ అంతశ్శత్రువుల శాంతి గీతాలు

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

Latest News

పాకిస్తాన్ ఆర్తనాదాల వేళ అంతశ్శత్రువుల శాంతి గీతాలు

పాకిస్తాన్ ఆర్తనాదాల వేళ అంతశ్శత్రువుల శాంతి గీతాలు

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.