Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home Latest News

కృష్ణా జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాల్లో ప్లాస్టిక్‌పై నిషేధం

Phaneendra by Phaneendra
Mar 16, 2025, 10:29 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

శనివారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో కలెక్టర్ కార్యాలయంలోనూ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేపట్టారు. ఆ సందర్భంగా కలెక్టర్ డీకే బాలాజీ జిల్లా స్థాయిలో ప్రభుత్వ కార్యాలయాల్లో ప్లాస్టిక్ వాడకంపై నిషేధం విధించారు. వీలైనంతవరకూ ప్లాస్టిక్‌ను మానేయాలంటూ ఉద్యోగులకు హితవు పలికారు. ఆ సందర్భంగా గుడ్డ సంచులు, స్టీల్ వాటర్ బాటిళ్ళు పంచిపెట్టారు.

కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రత్యేకించి సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా మానేయాలని పిలుపునిచ్చారు. మంచినీళ్ళ కోసం స్టీల్ లేదా మట్టి బాటిల్స్‌ ఉపయోగించాలని సూచించారు. ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్‌ల బదులు గుడ్డతో చేసిన చేతిసంచీలు వాడాలని పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా అధికారులు, సిబ్బందితో ప్లాస్టిక్ వాడబోమంటూ ప్రతిజ్ఞ చేయించారు.

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతీ నెలలో మూడో శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేపడతామని కలెక్టర్ చెప్పారు. ఒక్క మచిలీపట్నంలోనే రోజుకు 80 టన్నుల చెత్త వస్తుంటే అందులో 36శాతం ప్లాస్టిక్ వస్తువులే ఉన్నాయని వెల్లడించారు. ప్రభుత్వోద్యోగులు, అధికారుల్లో మార్పు వస్తే ప్రజల్లో చైతన్యం వస్తుందన్నారు. ప్రభుత్వోద్యోగులు ఇకపై సమావేశాలకు ఎవరి మంచినీళ్ళ సీసా వారే తెచ్చుకోవాలని ఆదేశించారు. తద్వారా ఒకేసారి వాడి పడేసే ప్లాస్టిక్ బాటిళ్ళ వినియోగాన్ని నియంత్రించిన వారమవుతామని కలెక్టర్ వివరించారు.

స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ కార్యాలయంలోని గ్రీవెన్స్ హాల్ నుంచి ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్ దగ్గర మహాత్మాగాంధీ జంక్షన్ వరకూ ర్యాలీ నిర్వహించారు. ‘ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తాం, భావితరాలను కాపాడతాం’ అంటూ నినాదాలు చేసారు. మానవహారంగా ఏర్పడి స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేసారు.

అంతకుముందు కలెక్టర్ బాలాజీ చల్లపల్లి, ఉయ్యూరు మండలాల్లో పర్యటించారు. ఇంటింటికీ వెళ్ళి తడిచెత్త, పొడిచెత్త విడదీయడంపై ప్రజలకు అవగాహన కల్పించారు. దుకాణాల దగ్గరకు వెళ్ళి గుడ్డ సంచులు పంచిపెట్టారు. ప్లాస్టిక్ కవర్లు, అందునా సింగిల్ యూజ్ కవర్ల వాడకం పూర్తిగా మానివేయాలని పిలుపునిచ్చారు. వస్తువులను గుడ్డ సంచులు, పేపర్ పొట్లాలలో విక్రయించాలంటూ ప్రోత్సహించారు.

Tags: Ban on PlasticClay Water BottlesCloth BagsKrishna DistrictMachilipatnamSay No To PlasticSwachh AndhraTOP NEWS
ShareTweetSendShare

Related News

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్
Latest News

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్
general

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం
general

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం
Latest News

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం
general

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

Latest News

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

లాహోర్‌లో పేలుళ్లు : విమానాశ్రయం మూసివేత

లాహోర్‌లో పేలుళ్లు : విమానాశ్రయం మూసివేత

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి

ఆపరేషన్ సిందూర్ : మీడియా తప్పుడు కథనాల వివాదాలు

ఆపరేషన్ సిందూర్ : మీడియా తప్పుడు కథనాల వివాదాలు

ఆపరేషన్ సిందూర్ గురించి వివరించిన ఆ ఇద్దరు మహిళలు ఎవరు?

ఆపరేషన్ సిందూర్ గురించి వివరించిన ఆ ఇద్దరు మహిళలు ఎవరు?

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.