పాలీటెక్నిక్ కోర్సు చదివే వారి కోసం ఏపీ పాలిసెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి కలిగిన విద్యార్థులు ఏప్రిల్ 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఏడాది పదో తరగతి విద్యార్ధులు తమ ఎస్ఎస్సీ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు.
పాలిసెట్ కు సంబంధించి పాత ప్రశ్నాపత్రాలు, మెటీరియల్ ను తెలుగు, ఇంగ్లీషు లో రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ఏపీ పాలిసెట్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు.
పాలిసెట్ పరీక్ష ఏప్రిల్ 30న జరగనుండగా ఆబ్జెక్టివ్ విధానంలో జరిగే ఈ పరీక్షలో మొత్తం 120 ప్రశ్నలు ఉంటాయి. మ్యాథమెటిక్స్ నుంచి 50, ఫిజిక్స్ నుంచి 40, కెమిస్ట్రీ నుంచి 30 చొప్పున సెట్ లో ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు ఇవ్వనున్నారు. నెగిటివ్ మార్కులు లేవు. ఓసీ, బీసీ అభ్యర్ధులు రూ.400లు పరీక్ష ఫీజుగా చెల్లించాల్సి ఉండగా, ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులైతే రూ.100లు చెల్లించాల్సి ఉంది.