2025-26 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాలకు చెందిన అభ్యర్థుల నుంచి అగ్నివీర్ సిబ్బంది నియామకాల కోసం గుంటూరులోని ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్ నమోదు ప్రక్రియను ప్రారంభించింది.
వివిధ కేటగిరీల్లో అగ్నివీర్ల నియామకం కోసం www.joinindianarmy.nic.in ద్వారా నమోదు చేసుకోవచ్చు. నమోదు చేసుకోడానికి చివరి తేదీ 10 ఏప్రిల్ 2025. ఒక్కొక్క అభ్యర్థి రెండు వేర్వేరు అగ్నివీర్ కేటగిరీలకు దరఖాస్తు చేసుకోవచ్చునని రిక్రూటింగ్ ఆఫీస్ వెల్లడించింది.
అగ్నివీర్ ఎంపిక కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్షను ఆన్లైన్లో నిర్వహిస్తారు. ఆ పరీక్ష మొట్టమొదటిసారిగా తెలుగుతో సహా 13 వేర్వేరు భాషల్లో నిర్వహించనున్నారు. అలాగే ఫిజికల్ ఫిట్నెస్ కోసం 1.6 కిలోమీటర్ల పరుగు సమయాన్ని 06 నిమిషాల 15 సెకన్లకు పెంచారు.
ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్ధులకు ఎన్సీసీ ‘ఎ’, ‘బి’ & ‘సి’ సర్టిఫికెట్ ఉంటే, లేక ప్రతిభావంతులైన క్రీడాకారులైతే, అలాగే అగ్నివీర్ టెక్నికల్ కేటగిరీ కోసం ఐటిఐ/డిప్లొమా అర్హత కలిగి ఉంటే… అలాంటి అభ్యర్థులకు అదనపు మార్కులు కూడా ఇస్తారు.
రాష్ట్రంలోని గుంటూరు, కర్నూలు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, అనంతపురము, వైఎస్ఆర్ కడప, ప్రకాశం, చిత్తూరు, బాపట్ల, పలనాడు, నంద్యాల, తిరుపతి, అన్నమయ్య, శ్రీ సత్యసాయి జిల్లాలకు చెందిన ఆసక్తిగల అభ్యర్థులందరూ అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ కార్యాలయ సహాయకులు/స్టోర్ కీపర్ టెక్నికల్ ఇంకా అగ్నివీర్ వృత్తి నిపుణుల పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
నియామక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా ఉంటుంది. కాబట్టి అగ్నివీర్గా సైన్యంలో నియామకం కోసం దళారులకు డబ్బులు చెల్లించవద్దని గుంటూరు ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్ డైరెక్టర్ కల్నల్ పునీత్ కుమార్ సూచించారు.