Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

సోము వీర్రాజు నామినేషన్‌లో సోమవారం హైడ్రామా

Phaneendra by Phaneendra
Mar 11, 2025, 10:38 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ అయిన ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీట్ల కోసం నామినేషన్ల పర్వం నిన్న సాయంత్రం పూర్తయింది. అయితే బీజేపీ అభ్యర్ధిగా సోము వీర్రాజు నామినేషన్ దాఖలు చేయడంలో హైడ్రామా చోటు చేసుకుంది. నిన్న ఉదయం వరకూ బీజేపీ అభ్యర్ధి రంగంలో ఉంటారని కూడా తెలియని పరిస్థితిలో, గడువు ముగియడానికి పావుగంట ముందు సోము వీర్రాజు నామినేషన్ వేయగలిగారు.

మొత్తం ఐదు ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అవగా, వాటన్నిటినీ అధికార ఎన్డీయే కూటమి అభ్యర్ధులే గెలుచుకునే పరిస్థితి ఉంది. వాటిలో ఒకటి జనసేన తరఫున పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు కేటాయించారు. మిగతా నాలుగింటిలో తెలుగుదేశం అభ్యర్ధులను నిలబెడతారని భావించారు. అయితే నామినేషన్ల ఆఖరి రోజైన సోమవారం ఉదయం కథ మారిపోయింది. ఒక సీటును బీజేపీకి కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. అక్కడినుంచీ నామినేషన్ సమయం పూర్తయేవరకూ కథ ఉత్కంఠభరితంగా సాగింది.

నామినేషన్ల దాఖలుకు సమయం సోమవారం మధ్యాహ్నం 3 గంటల వరకే ఉంది. అయితే ఉదయం వరకూ తనకు అవకాశం లభిస్తుందని సోము వీర్రాజుకు తెలియదు. దాంతో ఆయన ఉదయం 10.30కు రాజమండ్రి నుంచి హుటాహుటిన బయల్దేరి శరవేగంగా అమరావతి చేరుకున్నారు. అసెంబ్లీలో తెలుగుదేశం శాసనసభా పక్ష కార్యాలయంలో కూర్చుని తన నామినేషన్ పత్రాలను, అఫిడవిట్లను సరిచూసుకున్నారు. కానీ, అభ్యర్ధి నామినేషన్‌తో పాటు పార్టీ తరఫున జత చేయవలసిన ఎ, బి ఫారాలు బీజేపీ ఆంధ్రప్రదేశ్ కార్యాలయంలో లేవు. అక్కడినుంచీ రన్నింగ్ రేస్ మొదలైంది.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా సంతకం చేసిన రెండు ఫారాలు తెలంగాణ రాజధాని హైదరాబాద్ కార్యాలయంలో ఉన్నాయి. అక్కణ్ణుంచీ బీజేపీ తెలంగాణ నాయకుడు టివిఎస్ఎన్ రాజ్ హుటాహుటిన ప్రత్యేక విమానంలో బయల్దేరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. వాటిపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందరేశ్వరి సంతకం చేయవలసి ఉంది. ఆమె పార్లమెంటు సమావేశాల నిమిత్తం దేశ రాజధాని ఢిల్లీలో ఉన్నారు. ఆమె ఢిల్లీ నుంచి బయల్దేరి వచ్చేసరికి సమయం ముగిసిపోయే ప్రమాదం ఉంది. దాంతో ఫారాలపై సంతకాలు చేసేందుకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీ విశ్వనాథరాజుకు   బీజేపీ కేంద్ర కార్యాలయం ప్రత్యేక అనుమతి మంజూరు చేసింది. ఆ సమయానికి ఆయన ఏలూరు దగ్గరలో ఉన్నారు. ఆయనకు ఫోన్‌లో సమాచారం అందించగా, ఆయన పరుగు పరుగున గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ ఫారాలు తీసుకుని నేరుగా అమరావతి శాసనసభకు చేరుకున్నారు.

మరోవైపు, పురందరేశ్వరి ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో అమరావతికి బయల్దేరారు. కానీ ఆమె అసెంబ్లీకి చేరుకునేసరికి ఆలస్యం అయేలా ఉండడంతో విశ్వనాథరాజే ఎ, బి ఫారాలపై సంతకాలు చేసారు. సోము వీర్రాజు తన నామినేషన్ పత్రాలతో పాటు విశ్వనాథరాజు సంతకం చేసిన ఫారాలను జత చేసారు. దాంతో దరఖాస్తు పూర్తయింది. కానీ దాఖలు చేయడానికి కేవలం 14 నిమిషాల గడువు మాత్రమే మిగిలింది. పురందరేశ్వరి ఇంకా రాకపోవడంతో పాటు మంత్రుల కందుల దుర్గేష్, సత్యకుమార్ యాదవ్, టీడీపీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఉన్నారు.

నామినేషన్ దాఖలు ప్ర్రక్రియ పూర్తయిన కొద్దిసేపటికి పురందరేశ్వరి అమరావతి అసెంబ్లీకి చేరుకున్నారు. సోము వీర్రాజుతో పాటు పార్టీ ఎమ్మెల్యేలతో కాసేపు సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ అభ్యర్ధిగా ఖరారైన సోము వీర్రాజును అభినందించారు. తరువాత బీజేపీ బృందం అంతా కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసారు. బీజేపీకి ఒక ఎమ్మెల్సీ స్థానం ఇచ్చినందుకు చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. 

అలా, ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్ధి నామినేషన్ దాఖలు చేసే ఘట్టం సోమవారం రోజంతా అత్యంత ఉత్కంఠభరితంగా మొదలై సుఖాంతంగా ముగిసింది.

Tags: AP BJPAP BJP Chief PurandareswariBJP Leader Somu VeerrajuHigh DramaMLC NominationTOP NEWS
ShareTweetSendShare

Related News

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం
general

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం
Latest News

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా
general

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్
Latest News

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్
general

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

Latest News

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

లాహోర్‌లో పేలుళ్లు : విమానాశ్రయం మూసివేత

లాహోర్‌లో పేలుళ్లు : విమానాశ్రయం మూసివేత

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.