‘అన్నదాత సుఖీభవ’ పథకంపై శాసనమండలిలో వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారు. అర్హత కలిగిన రైతులందరికీ రూ. 20 వేల నగదు అందజేస్తామన్నారు. కౌలురైతులకు ‘అన్నదాత సుఖీభవ’ అమలుపై విధివిధానాలు ఖరారు చేస్తామన్నారు.
రైతులను గత వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందన్న అచ్చెన్నాయుడు, కూటమి ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందన్నారు. వైసీపీ పాలనలో వ్యవసాయ రంగం తీవ్రంగా నష్టపోయిందన్నారు. భూసార పరీక్షలు నిర్వహించలేదని, పంటల బీమా చెల్లింపు చేయలేదని దుయ్యబట్టారు.
‘ఆడుదాం ఆంధ్ర’పై స్వతంత్ర కమిటీ
వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ‘ఆడుదాం ఆంధ్ర’లో అవినీతి జరిగిందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. స్వతంత్ర దర్యాప్తు కమిటీతో విచారణ వేసి 45 రోజుల్లో నివేదిక సమర్పిస్తామని సభలో తెలిపారు.