ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ ఖరారైంది. ఏపీలో 5, తెలంగాణలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించడానికి రంగం సిద్ధమైంది. మార్చి 29న రెండు తెలుగు రాష్ట్రాల్లో పది మంది ఎమ్మెల్సీల పదవీ కాలం ముగియనుంది. దీంతో ఏపీలో 5, తెలంగాణలో 5 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
మార్చి 29 నాటికి, జంగా కృష్ణమూర్తి, పి. అశోక్ బాబు, తిరుమలనాయుడు, దువ్వారపు రామారావు, యనమల రామకృష్ణుడు పదవీ కాలం ముగియనుంది. తెలంగాణలో సత్యవతి రాథోడ్, ఎగ్గె మల్లేశం, శేరి సుభాష్ రెడ్డి, మహమూద్ అలీ, రియాజుల్ హాసన్ పదవీ కాలం ముగియనుంది.
మార్చి 3న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 10న నామినేషన్లు, 1న పరిశీలన, 13న ఉపసంహరణ ప్రక్రియ పూర్తి చేస్తారు. మార్చి 20 ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్… అదే రోజు 5 గంటలకు కౌంటింగ్ ప్రారంభిస్తారు. ఫలితాలు గంటలో తేలిపోనున్నాయి.