తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సీ వర్గీకరణ అంశంపై హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ డాక్టర్ షమీమ్ అక్తర్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ కాలపరిమితిని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఎస్సీ వర్గీకరణపై అధ్యయనం చేసి సిఫార్సు చేసేందుకు జస్టిస్ షమీమ్ అక్తర్ ఏకసభ్య కమిషన్ ను గత ఏడాదిలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నవంబర్ 11న ఆయన బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి రెండు నెలల్లో గడవు పొడిగించాల్సి ఉన్నప్పటికీ జనవరి 10న గడువు ముగియడంతో ఈ కమిషన్ కాలపరిమితిని ఫిబ్రవరి 10 వరకు పొడిగించారు. కమిషన్ ఇటీవల నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.
నివేదికలో పొందుపరిచిన అంశాలపై పలువురు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో కమిషన్ కాలపరిమితిని మార్చి 10 వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.