ఇంగ్లండ్ తో మూడు వన్డేల సిరీస్ ను భారత్ 3-0తేడాతో కైవసం చేసుకుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో బుధవారం జరిగిన చివరి వన్డేలో భారత్ 142 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 356 పరుగులు చేసింది. శుభ్ మన్ గిల్ (112) అద్భుతంగా ఆడగా విరాట్ కోహ్లీ (52), శ్రేయాస్ అయ్యర్ (78), కేఎల్ రాహుల్ (40) రాణించారు.
ఇంగ్లండ్ బౌలర్లలో అదిల్ రషీద్ నాలుగు వికెట్లు తీయగా, మార్క్ ఉడ్ రెండు, సకిబ్ మహమూద్ , గస్ ఆట్కిన్సన్ , జో రూట్ తలా ఒక వికెట్ తీశారు.
లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ జట్టు 34.2 ఓవర్లలో 214 పరుగులు మాత్రమే చేయగల్గింది. టామ్ బాంటన్ (38), గస్ ఆట్కిన్సన్ (38), బెన్ డకెట్ (34), జో రూట్ (24), ఫిల్ సాల్ట్ (23), హ్యారీ బ్రూక్( 19) పరుగులు చేశారు. కెప్టెన్ జోస్ బట్లర్( 6), లియామ్ లివింగ్ స్టన్ (9) విఫలం అయ్యారు.
భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ , హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా తలా రెండు వికెట్ల చొప్పున తమ ఖాతాలో వేసుకున్నారు. వాషింగ్టన్ సుందర్ , కుల్దీప్ యాదవ్ లు ఒక వికెట్ దక్కింది.
ఇంగ్లండ్ తో జరిగిన టీ20 సిరీస్ ను కూడా భారత్ చేజిక్కించుకుంది. 5 మ్యాచ్ ల సిరీస్ ను 4-1తో గెలిచింది.