Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home Latest News

చిలుకూరు ఘటనలో ఆరుగురి అరెస్ట్, రంగరాజన్‌ను పరామర్శించిన రేవంత్

Phaneendra by Phaneendra
Feb 11, 2025, 09:54 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

తెలంగాణలోని చిలుకూరు బాలాజీ గుడి ప్రధానార్చకులు రంగరాజన్‌పై దాడి చేసిన దుండగులను పోలీసులు అరెస్ట్ చేసారు. తమకు ఆర్థికంగా సహాయం చేయాలని డిమాండ్ చేసి, దానికి ఆయన ఒప్పుకోకపోవడంతోనే నిందితులు రంగరాజన్‌పై భౌతిక దాడికి పాల్పడ్డారని పోలీసులు వివరించారు.

దాడి ఘటనపై రాజేంద్రనగర్ డీసీపీ సీహెచ్ శ్రీనివాస్ ప్రకటన చేస్తూ ప్రధాన నిందితుడు వీరరాఘవ రెడ్డి, ఇద్దరు మహిళలు సహా మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేసామని వెల్లడించారు. సోమవారం ఉదయం ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని చెప్పారు.

ప్రధాన నిందితుడు వీరరాఘవ రెడ్డి తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం గ్రామానికి చెందినవాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని మణికొండలో నివసిస్తున్నాడు. 2022లో అతను రామరాజ్యం అనే సంస్థను ప్రారంభించాడు. ఆ సంస్థలో చేరిన వారికి రూ.20వేలు జీతం ఇస్తానని ప్రకటనలు చేసాడు. ఆంధ్రప్రదేశ్‌లోని తణుకు, కోటప్పకొండ ప్రాంతాల్లో పర్యటించి కొంతమందిని సభ్యులుగా చేర్చుకున్నాడు. ఈ నెల 7వ తేదీన వీరరాఘవరెడ్డి తన అనుచరులతో కలిసి మూడు వాహనాల్లో చిలుకూరు వెళ్ళాడు. అక్కడ వారు బాలాజీ గుడి ప్రధానార్చకులు రంగరాజన్‌ను కలిసారు. తమ సంస్థలో సభ్యులను చేర్పించాలనీ, ఆర్థికంగా సహాయం చేయాలనీ డిమాండ్ చేసారు. దానికి ఆయన ఒప్పుకోకపోవడంతో ఆయనపై దాడికి పాల్పడ్డారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ సంఘటన గురించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాకబు చేసారు. సోమవారం నాడు రంగరాజన్‌కు ఫోన్ చేసి పరామర్శించారు. ఇలాంటి దాడులను సహించే ప్రసక్తే లేదన్నారు. దుండగులపై కఠినచర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను ఆదేశించారు. సీఎం సూచనల మేరకు తెలంగాణ దేవదాయశాఖ మంత్రి కొండా సురేఖ చిలుకూరు వెళ్ళారు. రంగరాజన్‌ను పరామర్శించారు. ప్రభుత్వం తరఫున అర్చకులు రంగరాజన్‌కు అండగా ఉంటామన్నారు.

కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి చిలుకూరు ఘటనను తీవ్రంగా ఖండించారు. రంగరాజన్ విద్యాధికులని, ఉన్నతస్థాయి పదవులను సైతం పరిత్యజించారనీ గుర్తు చేసుకున్నారు. సనాతన ధర్మ పరిరక్షణకు అంకితభావంతో సేవలందిస్తూ, భక్తులకు ఆధ్యాత్మిక మార్గదర్శనం చేస్తూ ఉన్నత ధార్మిక విలువలను పాటిస్తున్నారని తెలియజేసారు. అలాంటి గౌరవప్రదమైన అర్చకవృత్తిలో ఉన్న వ్యక్తిపై జరిగిన దాడి గర్హనీయం, దురదృష్టకరం, బాధాకరం అని కిషన్‌రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యంలో భౌతికదాడులకు తావు లేదని, దౌర్జన్యాలూ బెదిరింపులకు స్థానం లేదనీ అన్నారు. చిలుకూరు ఘటన ఒక వ్యక్తి మీద కాదు, సనాతన ధర్మం మీద జరిగిన దాడి అని అభిప్రాయపడ్డారు.

Tags: Balaji TempleChilukurEndowments Minister Konda SurekhaHead Priest RangarajanHyderabadPriest AttackedTelanganaTelangana CM Revanth ReddyTOP NEWSUnion Minister G Kishan Reddy
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.