తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి (TTD) తిరుపతి, ఎన్ఆర్ఐ భక్తులకు శుభవార్త చెప్పింది. తిరుపతి వాసులకు ఈ నెల 11న తిరుమల శ్రీవారి దర్శనం కోసం 9న (నేడు) టోకెన్లు జారీ చేస్తున్నట్లు తెలిపింది. తిరుపతిలోని మహతి ఆడిటోరియం, తిరుమలలోని బాలాజీ నగర్ కమ్యూనిటీ హాలు లో టోకెట్లు జారీ చేయనున్నారు. ఫిబ్రవరి 4న రథసప్తమి సందర్భంగా ఫిబ్రవరి లో స్థానికులకు శ్రీవారి దర్శనాన్ని మొదటి మంగళవారం నుంచి రెండో మంగళవారానికి మార్చారు.
ప్రవాస భారతీయులకు…
తిరుమలకు వచ్చే ప్రవాస భారతీయుల కు ఇకపై రోజుకు వంద మంది వీఐపీ దర్శనాలకు అనుమతించనున్నారు. ఇప్పటి వరకు రోజుకు 50 మంది ఎన్ఆర్ఐలకు మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనానికి అవకాశం ఉండగా, ఆ సంఖ్యను రెట్టింపు చేశారు.