ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం గతంలో జరిగిన మద్యం అమ్మకాలపై సిట్ ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 2019 అక్టోబర్ నుంచి 2024 మార్చి వరకు అంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన విక్రయాలపై విచారించనుంది. దాదాపు రూ. 90 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. హోలోగ్రామ్ల వ్యవహారంపైనా విచారణ జరపనుంది.
విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో ప్రభుత్వం ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసింది. దర్యాప్తు వివరాలను ప్రతి 15 రోజులకు ఒకసారి సీఐడీ చీఫ్ ద్వారా ప్రభుత్వానికి నివేదిక రూపంలో
అందజేయాలని ఉత్త్వర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది.
సీఐడీ డీఐజీ ఆధ్వర్యంలో సిట్ పని చేయనుంది. ఎర్రచందనం టాస్క్ఫోర్స్ ఎస్పీ సుబ్బారాయుడు, అదనపు ఎస్పీ కొల్లి శ్రీనివాస్, సీఐడీ ఏఎస్పీ శ్రీహరిబాబు, డోన్ డీఎస్పీ శ్రీనివాస్, సీఐ శివాజీ లు సిట్ లో సభ్యులుగా ఉన్నారు.