ఆంధ్రప్రదేశ్ లో కొత్త రైల్వే జోన్ ఏర్పాటైంది. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు భారత రైల్వే శాఖ ఖరారు చేసింది. విశాఖ రైల్వే డివిజన్ ను దక్షిణ కోస్తా రైల్వే జోన్ లో భాగం చేశారు.
ప్రస్తుతం ఉన్న వాల్తేరు డివిజన్ ను విశాఖ డివిజన్ గా మారుస్తారు. విశాఖ, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు దక్షిణ కోస్తా జోన్ లో ఉండనున్నాయి. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ పరిధి 410 కిలోమీటర్లుగా ఉంది.
సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని కొండపల్లి-మోటుమర్రి సెక్షన్ విజయవాడ డివిజన్ లో విలీనం కానుంది. విజయవాడ శివార్లలోని కొండపల్లి ప్రాంతం ప్రస్తుతం సికింద్రాబాద్ డివిజన్ లో భాగంగా ఉంది. ఇక నుంచి ఈ సెక్షన్ ను విజయవాడ డివిజన్లో భాగంగా పరిగణిస్తారు.