Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home Latest News

కేజ్రీవాల్ ‘విష’ ప్రచారం అబద్ధమని తేల్చిన ఢిల్లీ జల్ బోర్డు

Phaneendra by Phaneendra
Jan 28, 2025, 11:52 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

త్వరలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ నోటికొచ్చిన ప్రేలాపనలు పేలుతున్నారు. ఆ క్రమంలోనే, హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం ఆ రాష్ట్రం నుంచి ఢిల్లీకి సరఫరా చేసే యమున నీటిలో విషం కలుపుతోందంటూ ఆరోపించారు. అయితే అది తప్పుడు సమాచారమని ఢిల్లీ జల్ బోర్డు స్పష్టం చేసింది.

ఢిల్లీ జల్ బోర్డ్ సీఈఓ శిల్పా శిండే సోమవారం నాడు ఢిల్లీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి లేఖ రాసారు. ఆ లేఖలో ఆప్ అధినేత చేసిన ప్రకటనలు ‘నిజానికి తప్పులుగా ఉన్నాయ’ని స్పష్టం చేసారు. ‘‘కేజ్రీవాల్ చేసిన ప్రకటనలు వాస్తవానికి ఎంతమాత్రం నిజం కావు, వాటికి ఏ ప్రాతిపదికా లేదు. అవి తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయి. అలాంటి తప్పుడు ప్రకటనలు నగర ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తాయి. ఎగువ రాష్ట్రమైన హర్యానాతో సంబంధాలపై ప్రతికూల ప్రభావం పడేలా చేస్తాయి’’ అని శిల్పా శిండే రాసారు.

ఈ విషయాన్ని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా దృష్టికి తీసుకెళ్ళాలంటూ శిల్పా శిండే రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని కోరారు. ‘‘ఈ విషయం అంతర్రాష్ట్ర సంబంధాలను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున ఈ వాస్తవాలను వెల్లడించాల్సి ఉంది. ట్రాన్సాక్షన్ ఆఫ్ బిజినెస్ నియమ నిబంధనల ప్రకారం ఈ విషయాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ దృష్టికి తీసుకువెళ్ళవలసిందిగా కోరుతున్నాము’’ అని జల్ బోర్డ్ సీఈఓ రాష్ట్ర సీఎస్‌ను కోరారు.

వచ్చేవారం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఆ నేపథ్యంలో బీజేపీ మీద బురద జల్లడానికి కేజ్రీవాల్ ప్రయత్నించారు. ‘‘హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం యమునా నది నీటిలో విషం కలిపింది. ఆ నీళ్ళు ఢిల్లీకి చేరి ఉంటే, ఇక్కడ సరఫరా చేసే తాగునీటిలో కలిసి ఉంటే ఎంతోమంది చనిపోయి ఉండేవారు. అదొక సామూహిక జన హనన దుర్మార్గం అయి ఉండేది. అయితే ఢిల్లీ జల్ బోర్డు అప్రమత్తంగా ఉండడం వల్ల ఆ విషపూరితమైన నీటిని ఇక్కడ తాగునీటిలో కలవకుండా నిలువరించగలిగింది’’ అని కేజ్రీవాల్ ఆరోపించారు.

నిరాధారమైన ఆరోపణలు చేసిన అరవింద్ కేజ్రీవాల్‌పై బీజేపీ నేతలు తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఫేక్ న్యూస్‌ను వ్యాపింపజేయడం ద్వారా ఢిల్లీలో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి హింస జరిగేలా చేయాలని, తద్వారా ప్రజలను భయభ్రాంతులను చేయాలనీ కేజ్రీవాల్ ప్రయత్నించారంటూ మండిపడ్డారు. మరోవైపు, హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ, కేజ్రీవాల్ ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఢిల్లీలో నీటికొరతకు కారణం తాము యమునా జలాలను సరిగ్గా ఇవ్వకపోవడం కాదనీ, కేజ్రీవాల్ పదేళ్ళ పాటు సీఎంగా ఉన్నా తాగునీటి సరఫరాకు సరైన వ్యవస్థను ఏర్పాటు చేసి అమలు చేయడంలో విఫలమవడమే కారణమని మండిపడ్డారు.

‘‘విషపూరితమైన నీళ్ళ సరఫరా వంటి తప్పుడు ఆరోపణలు చేయడం, వాటికి ఏ ఆధారాలూ చూపించకుండా పారిపోవడం అతని పద్ధతి. యమునా నది హర్యానా నుంచి ఢిల్లీకి చేరుకునే సోనిపట్ దగ్గరకు మా ప్రధాన కార్యదర్శిని పంపిస్తాను, కేజ్రీవాల్‌ తమ సీఎస్‌ను పంపాలి. అక్కడే విషయం తేల్చేద్దాం’’ అని నాయబ్ సింగ్ సైనీ సవాల్ విసిరారు.

Tags: Arvind KejriwalAssembly ElectionsDelhiHaryana Chief Ministernayab singh sainiRiver YamunaTOP NEWSWater Poisoning Allegations
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.