Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home ఆధ్యాత్మికం

అయోధ్య బాలరాముడి మూర్తికి శిలను సేకరించిన ప్రదేశంలో రామమందిర నిర్మాణ సన్నాహాలు

Phaneendra by Phaneendra
Jan 25, 2025, 05:17 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

శ్రీరామజన్మభూమి అయోధ్యలో ఐదు శతాబ్దాల పోరాటాల తర్వాత బాలరాముడి భవ్యమందిరం సాకారమవడం హిందువులందరినీ భావోద్వేగాలకు లోనుచేసింది. ఇటీవలే ఆ మందిర ప్రాణప్రతిష్ఠ మొదటి వార్షికోత్సవం కూడా వైభవంగా జరిగింది. ఆ సందర్భంలో… బాలరాముడి విగ్రహాన్ని రూపొందించడానికి కృష్ణశిలను సేకరించిన స్థలంలో అద్భుతమైన రామాలయం నిర్మించడానికి సన్నాహాలు మొదలయ్యాయి.

కర్ణాటకలోని మైసూరు ప్రాంతంలో అరోహళ్ళి అనే గ్రామంలో ఒక వ్యవసాయభూమిలో లభించిన కృష్ణశిలతో బాలరాముడి మూర్తిని తీర్చిదిద్దారు. ఆ పొలం 80 ఏళ్ళ హెచ్ రామదాస అనే వ్యక్తిది. తన పొలంలో దొరికిన రాతితో అయోధ్యరామయ్య తయారవడంతో ఆయన ఆనందానికి అవధులు లేవు. ఆ రాతిని వెలికితీసిన ప్రదేశంలో ఆయన ఒక షెడ్డు వేసి, అక్కడ రామ్‌లల్లా ఫొటో పెట్టారు. దానికి ప్రతీరోజూ పూజలు చేస్తున్నారు. ఆ ప్రదేశం స్థానికంగా భక్తులను ఆకర్షిస్తున్న తీర్థప్రదేశం అయిపోయింది.

ఇటీవల రామమందిర ప్రాణప్రతిష్ఠ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఆరోహళ్ళి గ్రామంలోని ఆ పొలంలో కూడా సుమారు 400మంది చేరి ప్రత్యేక పూజలు చేసారు. అరమణె గణేశ మందిరం పూజారి ప్రహ్లాదరావు ఆ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆ కార్యక్రమాలకు చాముండేశ్వరి నియోజకవర్గ ఎంఎల్ఎ జిటి దేవెగౌడ కూడా హాజరయ్యారు.  

అయోధ్య రామాలయంలో ప్రాణప్రతిష్ఠ జరిగిన గత జనవరి 22నే అరోహళ్ళిలోని పొలంలో కూడా రామమందిరం నిర్మించడానికి ఆ పొలం యజమాని రామదాస శంకుస్థాపన చేసారు. కొన్ని అనివార్య పరిస్థితుల కారణంగా ఆలయ నిర్మాణం అప్పటికి ఆగిపోయింది. ఎలాగైనా అక్కడ చిన్న గుడి కట్టాలని రామదాస మళ్ళీ ప్రయత్నాలు మొదలుపెట్టారు. రామదాస ఉత్సాహానికి స్థానిక ఎంఎల్ఎ దేవెగౌడ ఊతమిచ్చారు. అక్కడ భారీస్థాయిలో పెద్ద గుడి కట్టడానికి తనవంతు సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఒక ట్రస్టు రిజిస్టర్ చేసి నిధులు సేకరించే ప్రయత్నం  ప్రారంభించారు.   

అయోధ్యలో బాలరాముడి మూర్తి రూపకల్పనకు తమ పొలంలోని శిల ఎంపికైందని తెలిసిన నాటినుంచీ రామదాస ఆనందానికి అవధులు లేవు. తర్వాత సీతా లక్ష్మణ భరత శత్రుఘ్నుల మూర్తులకు కూడా అక్కడినుంచే శిలను సేకరించారు. వాటికి వేటికీ ఆయన పైసా డబ్బులు తీసుకోలేదు. అంతేకాదు, ఆ రాయి సేకరించిన స్థలంలో రాముడికి గుడి కట్టాలని నిర్ణయించుకున్నారు. ఆయన నలుగురు కొడుకులు కూడా దానికి ఒప్పుకున్నారు.

అయోధ్య భవ్యమందిరంలో బాలరాముడి మూర్తికి రూపకల్పన చేసిన శిల్పి అరుణ్ యోగిరాజ్ చేతనే ఈ కొత్త ఆలయంలోనూ రాముడి మూర్తిని చెక్కించాలని రామదాస భావిస్తున్నాడు. అయోధ్య మందిరం లాంటి అద్భుతమైన మందిరమే ఆరోహళ్ళిలోనూ వెలియాలన్నది ఆయన ఆకాంక్ష.

Tags: ArohalliAyodhya Balak Ram MandirKarnatakaLord Ram StatueNew TempleSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్
Latest News

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్
general

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం
general

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం
Latest News

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం
general

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

Latest News

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

లాహోర్‌లో పేలుళ్లు : విమానాశ్రయం మూసివేత

లాహోర్‌లో పేలుళ్లు : విమానాశ్రయం మూసివేత

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి

ఆపరేషన్ సిందూర్ : మీడియా తప్పుడు కథనాల వివాదాలు

ఆపరేషన్ సిందూర్ : మీడియా తప్పుడు కథనాల వివాదాలు

ఆపరేషన్ సిందూర్ గురించి వివరించిన ఆ ఇద్దరు మహిళలు ఎవరు?

ఆపరేషన్ సిందూర్ గురించి వివరించిన ఆ ఇద్దరు మహిళలు ఎవరు?

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.