Sunday, June 1, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

వాట్సప్ ద్వారా మెగా డీఎస్సీ హాల్ టికెట్లు

ఏపీ సోలార్ రూప్‌టాప్ పథకం : పేదలకు ఆదాయ మార్గం

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు

హనీమూన్‌కు వెళ్లిన జంట మిస్సింగ్

సాకుకు భరోసా కనీస మద్దతు ధర

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

వాట్సప్ ద్వారా మెగా డీఎస్సీ హాల్ టికెట్లు

ఏపీ సోలార్ రూప్‌టాప్ పథకం : పేదలకు ఆదాయ మార్గం

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు

హనీమూన్‌కు వెళ్లిన జంట మిస్సింగ్

సాకుకు భరోసా కనీస మద్దతు ధర

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home జాతీయ

ప్రవాస భారతీయులు ఈ ప్రపంచానికి భారతదేశపు రాయబారులు: మోదీ

Phaneendra by Phaneendra
Jan 9, 2025, 04:15 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

భారతదేశం 2047 నాటికి వికసిత భారత్‌గా ఎదగడంలో ప్రవాస భారతీయులు కీలక పాత్ర పోషిస్తారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఒడిషా రాజధాని భువనేశ్వర్‌లో 18వ ప్రవాసీ భారతీయ దివస్ ప్రారంభోత్సవంలో ఆయన ఎన్ఆర్ఐలను ప్రశంసల్లో ముంచెత్తారు. ప్రపంచం అభివృద్ధికీ, భారత్ ఎదుగుదలకూ ఇండియన్ డయాస్పోరా విశేష కృషి చేస్తోందన్నారు. ప్రవాస భారతీయులు ప్రపంచానికి భారతదేశపు రాయబారులు అని కొనియాడారు. తమ ఘనమైన విజయాలతో భారత్‌కు గర్వకారణంగా నిలిచారన్నారు. ప్రపంచమంతటా భారతీయ విలువలకు గౌరవం పెరగడానికి కారణం వారేనన్నారు. గత పదేళ్ళలో ప్రపంచదేశాల నాయకులు ఎందరినో కలిసాను, వారందరూ ప్రవాస భారతీయులను ప్రశంసించారని మోదీ చెప్పారు. ప్రపంచ దేశాల్లో భారతీయ సామాజిక విలువలను ప్రచారం చేయడం ద్వారా ఎన్ఆర్ఐలు అందరి మన్ననలూ అందుకున్నారని అభినందించారు. భారతదేశం ప్రజాస్వామ్యానికి మాతృస్థానంలో ఉండడం మాత్రమే కాదు, మన జీవన విధానంలోనే ప్రజాస్వామ్యం ఉందని గుర్తు చేసారు.

గత దశాబ్ద కాలంలో భారతదేశంలో 25కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బైటపడ్డారని మోదీ ప్రస్తావించారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతోందన్నారు. పునర్వినియోగ ఇంధనరంగం, ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల తయారీ, మెట్రో-బులెట్ రైళ్ళు సహా అన్ని రంగాల్లోనూ భారత్ అభివృద్ధి సాధిస్తోందన్నారు. కొన్నాళ్ళలో ఎన్ఆర్ఐలు ‘మేడిన్ ఇండియా’ విమానాల్లో స్వదేశానికి వస్తారన్నారు.

మోదీ భారత యువతరం గురించి కూడా ప్రస్తావించారు. ఈ దేశపు యువత తమ సామర్థ్యాలను వెలికితీయడం కోసం ప్రభుత్వం వారి నైపుణ్యాలకు మెరుగులు దిద్దడంపైనే దృష్టి కేంద్రీకరించిందన్నారు.

1915 జనవరి 9న, సుదీర్ఘకాలం తర్వాత గాంధీ విదేశాల నుంచి భారతదేశానికి వచ్చారంటూ ఇవాళ్టి విశిష్టతను మోదీ తలచుకున్నారు. మరికొద్ది రోజుల్లో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో మహాకుంభమేళా మొదలవబోతోందని గుర్తు చేసారు. అదే సమయంలో దేశవ్యాప్తంగా మకర సంక్రాంతి పండుగ శోభ వెల్లివిరుస్తుందన్నారు. ఆ శోభ ప్రపంచంలో భారతీయులు ఉన్న ప్రతీచోటా కనిపిస్తుందన్నారు. భారతదేశానికి, ప్రవాస భారతీయులకూ మధ్య బంధాలను బలపరచడం కోసం మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయీ ప్రవాసీ భారతీయ దివస్‌ను ప్రారంభించారని గుర్తుచేసుకున్నారు.   

ఈ సందర్భంగా మోదీ, ‘ప్రవాసీ తీర్థదర్శన్ యోజన’ పథకం కింద ఎన్ఆర్ఐల కోసం ప్రత్యేకంగా ప్రారంభించిన పర్యాటక రైలుకు వర్చువల్‌గా జెండా ఊపి దాని మొదటి ప్రయాణాన్ని ప్రారంభించారు. ఢిల్లీలోని నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ నుంచి బయల్దేరే ఆ రైలు దేశంలోని వివిధ ఆధ్యాత్మిక, పర్యాటక ప్రదేశాల్లో మూడు వారాల పాటు తిరుగుతుంది. అలాగే ప్రవాసీ భారతీయ దివస్ సందర్భంగా పలు ఎగ్జిబిషన్లు, వివిధ మంత్రిత్వ శాఖల స్టాళ్ళను కూడా మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు ఎస్ జయశంకర్, జుయెల్ ఓరమ్, ధర్మేంద్ర ప్రధాన్, అశ్వినీ వైష్ణవ్, ఒడిషా గవర్నర్ కంభంపాటి హరిబాబు, ముఖ్యమంత్రి చరణ్ మాఝీ తదితరులు పాల్గొన్నారు. రేపటి ముగింపు కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరవుతారు.

 

Tags: BhubaneswarIndian DiasporaOdishaPM Narendra ModiPravasi Bhartiya DivasSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

ఏపీ సోలార్ రూప్‌టాప్ పథకం : పేదలకు ఆదాయ మార్గం
general

ఏపీ సోలార్ రూప్‌టాప్ పథకం : పేదలకు ఆదాయ మార్గం

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు
general

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు

హనీమూన్‌కు వెళ్లిన జంట మిస్సింగ్
general

హనీమూన్‌కు వెళ్లిన జంట మిస్సింగ్

సాకుకు భరోసా కనీస మద్దతు ధర
general

సాకుకు భరోసా కనీస మద్దతు ధర

మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్ట్
general

మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్ట్

Latest News

వాట్సప్ ద్వారా మెగా డీఎస్సీ హాల్ టికెట్లు

వాట్సప్ ద్వారా మెగా డీఎస్సీ హాల్ టికెట్లు

ఏపీ సోలార్ రూప్‌టాప్ పథకం : పేదలకు ఆదాయ మార్గం

ఏపీ సోలార్ రూప్‌టాప్ పథకం : పేదలకు ఆదాయ మార్గం

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు

హనీమూన్‌కు వెళ్లిన జంట మిస్సింగ్

హనీమూన్‌కు వెళ్లిన జంట మిస్సింగ్

సాకుకు భరోసా కనీస మద్దతు ధర

సాకుకు భరోసా కనీస మద్దతు ధర

మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్ట్

మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్ట్

పాకిస్థాన్ ఐఎస్ఐ కోసం పనిచేస్తోన్న ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్

పాకిస్థాన్ ఐఎస్ఐ కోసం పనిచేస్తోన్న ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్

వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం

వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం

ట్రంప్ పాలకవర్గం నుంచి తప్పుకున్న ఎలాన్ మస్క్

ట్రంప్ పాలకవర్గం నుంచి తప్పుకున్న ఎలాన్ మస్క్

శ్రీవాణి టికెట్ల జారీకి ప్రత్యేక కౌంటర్లు

శ్రీవాణి టికెట్ల జారీకి ప్రత్యేక కౌంటర్లు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.