Sunday, July 6, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home జాతీయ

పార్లమెంటు రగడ: రాహుల్ గాంధీపై ఫిర్యాదు, ఎఫ్ఐఆర్ దాఖలు

Phaneendra by Phaneendra
Dec 19, 2024, 04:36 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

పార్లమెంటులో నాటకీయ పరిణామాల మధ్య ఇద్దరు బీజేపీ ఎంపీలు గాయపడిన ఘటనలో కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ మీద ఎఫ్ఐఆర్  దాఖలయింది. గాయపడిన ఎంపీలు ఇద్దరూ ఆస్పత్రి పాలయ్యారు.

రాజ్యసభలో ఓ చర్చ సందర్భంగా అంబేద్కర్‌ మీద కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభ్యంతరకరంగా మాట్లాడారని ఆరోపిస్తూ ఇండీ కూటమి పక్షాలు పార్లమెంటులో ఇవాళ ఆందోళన చేపట్టాయి. ఆ సందర్భంలో పార్లమెంటు ఆవరణలో బీజేపీ, ఇండీ కూటమి ఎంపీలు పరస్పరం తారసపడ్డారు. కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ ఒక ఎంపీని తోసేసారని, ఆయన తన మీద పడడంతో తాను కింద పడిపోయాననీ బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి చెప్పారు. ఆ ఘటనలోనే తనకూ గాయాలయ్యాయని మరో బీజేపీ ఎంపీ ముకేష్ రాజ్‌పుత్ ఆరోపించారు. తీవ్రంగా గాయపడిన వారిద్దరూ ప్రస్తుతం రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.

ఆ సంఘటనను బీజేపీ తీవ్రంగా పరిగణించింది. బీజేపీ లీగల్ టీమ్ సభ్యులు, ఎంపీలు అయిన అనురాగ్ ఠాకూర్, బాన్సురీ స్వరాజ్‌లతో కూడిన బృందం పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్ళింది. అక్కడ రాహుల్ గాంధీ మీద వారు ఫిర్యాదు చేసారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తమ పార్టీ ఎంపీల మీద భౌతికదాడికి పాల్పడ్డారని బీజేపీ నేతలు ఆరోపించారు.

ప్రతాప్ చంద్ర సారంగికి తల మీద గాయమైందని, పెద్దగా రక్తస్రావమైందనీ, ఆయనకు కుట్లు వేయవలసి వచ్చిందనీ వైద్యులు వెల్లడించారు. సారంగి ప్రస్తుతం వైద్యుల పరిశీలనలో ఉన్నారు. ఆ గొడవలో గాయపడిన రెండో ఎంపీ ముకేష్ రాజ్‌పుత్, వాగ్వాదం జరుగుతుండగానే స్పృహ తప్పి పడిపోయారు. ఇప్పుడు ఆయన స్పృహలోకి వచ్చారు కానీ ఆయన రక్తపోటు పెరిగిపోయిందని, ఆయన ఇంకా ఆందోళనగానే ఉన్నారనీ వైద్యులు చెప్పారు. ముకేష్‌కు మరికొన్ని పరీక్షలు చేయాల్సి ఉందని వైద్యులు వెల్లడించారు.

బీజేపీ ఎంపీలను తాను తోసివేసానన్న ఆరోపణలను రాహుల్ గాంధీ ఖండించారు. తాను పార్లమెంటులోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తుండగా బీజేపీ ఎంపీలు అడ్డుకున్నారని, వారే తనను బెదిరించారనీ రాహుల్ ఆరోపించారు. ఆ గొడవలో తమ నాయకుడు మల్లికార్జున ఖర్గేను కూడా తోసేసారని రాహుల్ చెప్పుకొచ్చారు.

Tags: BJP MPs InjuredMallikarjuna KhargeMukesh RajputParliament ScufflePolice ComplaintPratap Chandra SarangiRahul GandhiSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ
general

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి
general

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు
general

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ
general

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం
general

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

Latest News

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.