Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home జాతీయ

భారత్-చైనా సంబంధాలు కొంత మెరుగుపడ్డాయి: ఎస్‌ జయశంకర్

Phaneendra by Phaneendra
Dec 3, 2024, 03:43 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఏప్రిల్‌ 2020 తర్వాత దెబ్బతిన్న భారత-చైనా సంబంధాలు ఇటీవల కొంత మెరుగుపడ్డాయని విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ లోక్‌సభలో వెల్లడించారు. నాలుగేళ్ళ క్రితం తూర్పు లద్దాఖ్‌లో భారత్-చైనా సైన్యాల మధ్య ఘర్షణలు జరిగాయి. 45ఏళ్ళలో మొదటిసారిగా రెండు పక్షాలలోనూ సైనికులు చనిపోయారు. అప్పటినుంచీ ఇరుదేశాల మధ్యా సంబంధాలు దెబ్బతిన్నాయి.  ‘‘అప్పటినుంచీ నిరంతరాయంగా దౌత్యపరమైన చర్చలు జరుపుతూ వస్తున్న ఫలితం వల్ల ఇరుదేశాల మధ్య సంబంధాల్లో కొంత మెరుగుదల వచ్చింది’’ అని జయశంకర్ పార్లమెంటుకు వివరించారు.

సరిహద్దు సమస్యకు ద్వైపాక్షిక చర్చల ద్వారా న్యాయమైన, తార్కికమైన, పరస్పరం అంగీకారయోగ్యమైన పరిష్కారం కనుగొనాలన్న విధానానికే భారతదేశం కట్టుబడి ఉందని జయశంకర్ పార్లమెంటుకు చెప్పారు. అయితే ఇటీవలి అనుభవాల దృష్ట్యా సరిహద్దుల నిర్వహణపై మరింత నిశితంగా దృష్టి సారించడం అవసరమని స్పష్టమైందని వివరించారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మూడు కీలకమైన సూత్రాలను అనుసరించడం తప్పనిసరి అని ఆయన చెప్పారు. ఆ మూడు సూత్రాలూ ఏంటంటే…

వాస్తవాధీన రేఖను ఇరుపక్షాలూ గౌరవించాలి, దానికి కట్టుబడి ఉండాలి. యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చడానికి భారత్ కానీ చైనా కానీ ప్రయత్నించకూడదు. గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలు, అవగాహనలకు ఇరుదేశాలూ పూర్తిగా కట్టుబడి ఉండాలి.

‘‘ఏప్రిల్-మే 2020 సమయంలో తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాధీనరేఖ వెంబడి పలు ప్రదేశాల వద్ద చైనా పెద్దసంఖ్యలో తమ సైనిక బలగాలను మోహరించడం వల్ల ఇరుదేశాల బలగాల మధ్యా చాలా ఘర్షణలు జరిగాయి. ఆ పరిస్థితుల వల్ల పెట్రోలింగ్ కార్యకలాపాలకు కూడా అంతరాయం కలిగింది. రవాణా పరంగా, వాతావరణ పరంగా, ఇంకా మరెన్నో రకాలుగా ఎన్ని సవాళ్ళు ఎదురైనా తట్టుకుని మన సైనిక బలగాలు ప్రత్యర్ధులను నిలువరించాయి. కోవిడ్ సమయంలో కూడా మన సైనికులు చాలావేగంగా, ప్రభావవంతంగా చైనా వ్యూహాలకు ప్రతివ్యూహాలు రచించి అమలు చేసారు’’ అని జయశంకర్ చెప్పుకొచ్చారు.

‘‘తక్షణ స్పందనగా తగినంతమంది సైనికులను మోహరించడం జరిగింది, అదే సమయంలో ఇరు పక్షాల మధ్యా ఉద్రిక్తతలను నివారించడానికి, శాంతియుత వాతావరణాన్ని పునరుద్ధరించడానికీ దౌత్యపరమైన ప్రయత్నాలు కూడా జరిగాయి. మిలటరీ కమాండర్ స్థాయి అధికారుల మధ్య సుమారు పాతికసార్లు చర్చలు జరిగాయి. వాటి ఫలితంగానే ఇటీవల అక్టోబర్ ఒప్పందం జరిగింది. దానివల్లనే భారత్-చైనా బలగాలు తమ పాత స్థానాలకు మళ్ళీ వెళ్ళాయి. 2020 ఏప్రిల్‌కు ముందరి గస్తీ దారులు మళ్ళీ మొదలయ్యాయి. బ్రిక్స్ సమావేశం కోసం చైనా ప్రధాని షి జింపింగ్, భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా వెళ్ళడానికి కొన్ని గంటల ముందు ఒప్పందం కుదిరింది. వాస్తవాధీన రేఖ వెంబడి శాంతిని నెలకొల్పడానికి అదొక రోడ్‌మ్యాప్‌. ఇరుదేశాల మధ్య సంబంధాలనూ సాధారణ స్థాయికి తేవడానికి అవసరమైన మొదటి అడుగుగా భారతదేశం చెబుతూవచ్చిన యథాతథ స్థితి ఆ ఒప్పందం.

దానిగురించి జయశంకర్ మాట్లాడుతూ, తూర్పు లద్దాఖ్‌లో ఘర్షణాత్మక ప్రాంతాలైన దెప్సాంగ్, దెమ్‌చోక్ నుంచి సైనిక బలగాల ఉపసంహరణ అనేది మొదటి ప్రాధాన్య అంశమనీ, దాన్ని పూర్తిగా సాధించామనీ వెల్లడించారు. తదుపరి ప్రాధాన్యాంశం, అంతర్జాతీయ సరిహద్దుగా పరిగణిస్తున్న వాస్తవాధీన రేఖ వెంబడి భారీగా మోహరించిన సైనిక బలగాలను క్రమంగా తగ్గించుకుంటూ రావడమని జయశంకర్ చెప్పుకొచ్చారు.

Tags: andhra today newsBorder CrisisDemchokDepsongEastern LaddakhIndia China TiesLACLine of Actual ControlLok SabhaParliamentS JaishankarSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా
general

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు
general

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ
general

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్
general

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు
general

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

Latest News

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

నేడు ఏపీలో భారీ వర్షాలు

నేడు ఏపీలో భారీ వర్షాలు

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.