Sunday, June 1, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడే స్పాన్సర్

వాట్సప్ ద్వారా మెగా డీఎస్సీ హాల్ టికెట్లు

ఏపీ సోలార్ రూప్‌టాప్ పథకం : పేదలకు ఆదాయ మార్గం

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు

హనీమూన్‌కు వెళ్లిన జంట మిస్సింగ్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడే స్పాన్సర్

వాట్సప్ ద్వారా మెగా డీఎస్సీ హాల్ టికెట్లు

ఏపీ సోలార్ రూప్‌టాప్ పథకం : పేదలకు ఆదాయ మార్గం

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు

హనీమూన్‌కు వెళ్లిన జంట మిస్సింగ్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home జాతీయ

ప్రైవేటు ఆస్తిని లాక్కోడానికి కర్ణాటక వక్ఫ్ బోర్డ్ ప్రయత్నాన్ని అడ్డుకున్న హైకోర్టు

Phaneendra by Phaneendra
Nov 16, 2024, 06:13 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఒక వ్యక్తి ఆస్తిని లాక్కోడానికి కర్ణాటక వక్ఫ్ బోర్డు చేసిన ప్రయత్నాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు అడ్డుకుంది. ఆ వివాదాన్ని వక్ఫ్ బోర్డ్ ట్రిబ్యునల్‌లో తేల్చుకోవాలని స్పష్టం చేసింది. కర్ణాటక వక్ఫ్ బోర్డ్ 1976లో తామే ప్రైవేటు ఆస్తి అని ప్రకటించిన ఒక భూమిని వెనక్కు తీసుకోడానికి ఇప్పుడు ప్రయత్నాలు మొదలుపెట్టింది. వాటిని హైకోర్టు నిలువరించింది.  

జబీర్ అలీ అనే వ్యక్తి వేసిన పిటిషన్ను విచారించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంజిఎస్ కమల్ ఆ తీర్పు ఇచ్చారు. వక్ఫ్ బోర్డు గత పాలకులు తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పటి బోర్డు, ఒక కమిటీ వేసి మార్చేయడం సాధ్యం కాదని న్యాయస్థానం స్పష్టం చేసింది. పాత బోర్డు నిర్ణయాన్ని తిరగదోడాలంటే ట్రిబ్యునల్‌కు వెళ్ళాల్సిందేనని చెప్పింది. పాత బోర్డు, ఇప్పటి ట్రిబ్యునల్ సమాన స్థాయి కలిగిన వ్యవస్థలని తేల్చింది.

బెంగళూరులో షా మహమ్మద్ రజా అలీ అనే వ్యక్తి నియంత్రణలో కొన్ని ఆస్తులుండేవి. వాటిలో ఒక శ్మశానం కూడా ఉంది. అవి వక్ఫ్ ఆస్తులు అని 1965లో అప్పటి మైసూరు వక్ఫ్ బోర్డు ప్రకటించింది. ఆ తర్వాత కూడా ఆ ఆస్తులు రజా అలీ నియంత్రణలోనే ఉండేవి. ఆ విషయమై 1975లో వక్ఫ్ బోర్డు రజా అలీకి నోటీసులు పంపింది కూడా. అయితే ఆ వ్యవహారంలో దర్యాప్తు జరిగాక, 1976లో కర్ణాటక వక్ఫ్ బోర్డు ఆ ఆస్తులు రజా అలీ వ్యక్తిగత ఆస్తులు అని నిర్ణయించి ప్రకటించింది. ఆ ఆస్తులను వక్ఫ్ బోర్డు జాబితా నుంచి తొలగించాలి అని 1977లో ఆదేశాలు కూడా జారీ చేసింది.

అప్పటి వక్ఫ్ బోర్డు ఆదేశాల తర్వాత ఇటీవలి వరకూ ఆ ఆస్తుల విషయంలో ఎలాంటి సమస్యా లేదు. అయితే 2020 నవంబర్‌లో కర్ణాటక వక్ఫ్ బోర్డు రజా అలీ కొడుకు జబీర్ అలీకి నోటీసులు పంపింది, అతనిపై వక్ఫ్ ఆస్తుల ఆక్రమణదారుడు అని ఆరోపణ చేసింది. జబీర్ అలీ వక్ఫ్ బోర్డును మోసం చేసి ఆ ఆస్తిని స్వాధీనం చేసుకున్నాడని ఆరోపించింది. దానిపై జబీర్ అలీ కోర్టుకు వెళ్ళాడు. మరోవైపు ఆ వ్యవహారంపై వక్ఫ్ బోర్డు ఒక లీగల్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ 1976 నాటి వక్ఫ్ బోర్డు ఆదేశాలను రద్దు చేసింది. జబీర్ అలీ దగ్గరున్నది వక్ఫ్ ఆస్తేనని ప్రకటించింది.

దాంతో జబీర్ అలీ హైకోర్టును ఆశ్రయించాడు. 1976లో ముగిసిపోయిన వ్యవహారాన్ని వక్ఫ్ బోర్డు ఇప్పుడు తిరగదోడుతోందని, అది సరికాదనీ జబీర్ వాదించాడు. పైగా, ప్రస్తుత న్యాయసూత్రాల ప్రకారం అప్పటి వక్ఫ్ బోర్డు ఇచ్చిన ఆదేశాలను మార్చాలంటే ట్రిబ్యునల్ లేదా అంతకంటె ఉన్నతస్థాయి న్యాయస్థానమే మార్చగలదని వాదించాడు.

వక్ఫ్ బోర్డు, ఒక కమిటీ ద్వారా తన ఆస్తిని స్వాధీనం చేసుకోడానికి చేస్తున్న ప్రయత్నం తప్పు అని జబీర్ అలీ వాదించాడు. అతని వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. అతని ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా చేసిన ప్రకటనను రద్దు చేసింది. ఒకవేళ వక్ఫ్ బోర్డు ఆ ఆస్తి తమదేనని నిరూపించదలచుకుంటే వక్ఫ్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాలని స్పష్టం చేసింది.  

Tags: andhra today newsHigh CourtKarnatakaProperty LitigationSLIDERTOP NEWSWaqf Board
ShareTweetSendShare

Related News

జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడే స్పాన్సర్
general

జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడే స్పాన్సర్

ఏపీ సోలార్ రూప్‌టాప్ పథకం : పేదలకు ఆదాయ మార్గం
general

ఏపీ సోలార్ రూప్‌టాప్ పథకం : పేదలకు ఆదాయ మార్గం

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు
general

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు

హనీమూన్‌కు వెళ్లిన జంట మిస్సింగ్
general

హనీమూన్‌కు వెళ్లిన జంట మిస్సింగ్

సాకుకు భరోసా కనీస మద్దతు ధర
general

సాకుకు భరోసా కనీస మద్దతు ధర

Latest News

జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడే స్పాన్సర్

జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడే స్పాన్సర్

వాట్సప్ ద్వారా మెగా డీఎస్సీ హాల్ టికెట్లు

వాట్సప్ ద్వారా మెగా డీఎస్సీ హాల్ టికెట్లు

ఏపీ సోలార్ రూప్‌టాప్ పథకం : పేదలకు ఆదాయ మార్గం

ఏపీ సోలార్ రూప్‌టాప్ పథకం : పేదలకు ఆదాయ మార్గం

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు

హనీమూన్‌కు వెళ్లిన జంట మిస్సింగ్

హనీమూన్‌కు వెళ్లిన జంట మిస్సింగ్

సాకుకు భరోసా కనీస మద్దతు ధర

సాకుకు భరోసా కనీస మద్దతు ధర

మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్ట్

మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్ట్

పాకిస్థాన్ ఐఎస్ఐ కోసం పనిచేస్తోన్న ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్

పాకిస్థాన్ ఐఎస్ఐ కోసం పనిచేస్తోన్న ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్

వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం

వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం

ట్రంప్ పాలకవర్గం నుంచి తప్పుకున్న ఎలాన్ మస్క్

ట్రంప్ పాలకవర్గం నుంచి తప్పుకున్న ఎలాన్ మస్క్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.