Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home జాతీయ

‘15 నిమిషాలు…’ వ్యాఖ్యని మరోసారి గుర్తుచేసిన అక్బరుద్దీన్ ఒవైసీ

Phaneendra by Phaneendra
Nov 7, 2024, 01:45 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

అక్బరుద్దీన్ ఒవైసీ అనగానే గుర్తొచ్చేది 2012లో అతను చేసిన ‘15 నిమిషాలు పోలీసులని తప్పించండి… ఏం జరుగుతుందో చూడండి’ అన్న రెచ్చగొట్టే వ్యాఖ్య. నిన్న బుధవారం మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో ఒక ర్యాలీలో మాట్లాడుతూ ఆ వ్యాఖ్యని మరోసారి గుర్తు చేసాడు.

అక్బరుద్దీన్ బుధవారం రాత్రి శంభాజీనగర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు. అప్పటికి సమయం రాత్రి 9.45 అయింది. మరో పదిహేను నిమిషాల్లో ప్రచారం ముగించేయాలి. ఆ సమయంలో అక్కడున్న జనాలని ఉద్దేశించి, ‘‘ఇంకా పదిహేను నిమిషాలు సమయం ఉంది. సహనంగా ఉండండి. తను (సమయం) నన్ను వదలడం లేదు, నేను తనని వదలను. తను ఇంకా నడుస్తూనే ఉంది. కానీ దాని ప్రతిధ్వని ఏమిటి?’’ అని మాట్లాడాడు.

హిందూజాతి మొత్తాన్నీ హననం చేసేస్తానంటూ గతంలో చేసిన ‘పోలీసులను 15 నిమిషాలు వదిలేయండి’ అన్న వ్యాఖ్యని గుర్తుచేసేలా అక్బరుద్దీన్ సైగలు చేసాడు. దాంతో ముస్లిం జనాలు కిర్రెక్కిపోయారు. చప్పట్లు, కేరింతలు కొట్టారు. కొంతమంది అయితే ‘పదిహేను నిమిషాలు, పదిహేను నిమిషాలు’ అంటూ కేకలు వేసారు.

 

ఏమిటా అక్బరుద్దీన్ వివాదాస్పద ప్రసంగం?

అక్బరుద్దీన్ ఒవైసీ 2012లో హిందువులపై విద్వేషాన్ని కురిపిస్తూ, హిందువులకు వ్యతిరేకంగా ముస్లిములను రెచ్చగొడుతూ బహిరంగ ప్రసంగం చేసాడు. ఆ ప్రసంగంలో హిందూ దేవీదేవతల మీద నోటికొచ్చినట్లు పిచ్చిపిచ్చి వ్యాఖ్యలు చేసాడు. పోలీసుల అండ లేకుండా పావుగంటైనా బతకలేరంటూ బహిరంగంగా సవాల్ విసిరాడు. పదిహేను నిమిషాల పాటు పోలీసులని తప్పించండి, ఏం జరుగుతుందో చూస్తారు అంటూ తొడకొట్టాడు. అంతేకాదు, నరేంద్రమోదీ ప్రధానమంత్రి ఎలా అవుతాడో చూస్తానంటూ బీరాలు పలికాడు.

‘‘ఎందరో మోదీలు వచ్చారు, పోయారు. ఇవాళ జనాలు గుజరాత్‌లో మోదీ గెలిచాడంటున్నారు. ఏదో ఒకరోజు మోదీ ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతాడంటున్నారు. అది ఎలా జరుగుతుందో మేమూ చూస్తాం. మాకు మోదీ ఉన్నాడంటూ ముస్లిములను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఎవడా మోదీ? ఎక్కణ్ణుంచి వచ్చాడు, దమ్ముంటే ఒకసారి హైదరాబాద్ రమ్మనండి. మా తాకత్ ఏంటో చూపిస్తాం’’ అన్నాడు అక్బరుద్దీన్.

‘‘తస్లీమా నస్రీన్ హైదరాబాద్ వచ్చింది. ఇప్పుడు ఆమె ఎక్కడుందో ఎవరికీ తెలీదు. ఓ హిందుస్తాన్, మేం 25కోట్ల మందిమి ఉన్నాం. మీరు వందకోట్ల మంది ఉన్నారు కదా. సరే. మాకంటె మీ సంఖ్య చాలా ఎక్కువ కదా. ఒక పావుగంట పోలీసులని పక్కన పెట్టండి. ఎవరు ఎక్కువ బలవంతులో తేల్చుకుందాం’’ అన్నాడు. వేల సంఖ్యలో ఆ సమావేశానికి హాజరైన ముస్లిములు చప్పట్లతో హోరెత్తించారు, హుషారుగా అరుపులు, కేకలు పెట్టారు. ‘’15 నిమిషాలు పోలీసులను తీసేయండి. వెయ్యి మంది, లక్ష మంది లేదా కోటిమంది అయినా సరే, నపుంసకులైన హిందువులు సమష్టిగా ప్రయత్నించినా ఒక్కరిని కూడా బతికించలేరు. వీళ్ళకు మనను ముఖాముఖి చూసే ధైర్యమే లేదు. ముస్లిములు బలహీనులు అయినప్పుడే ఈ నపుంసకులు రాగలరు’’ అంటూ హిందువులపై విద్వేషాన్ని రంగరించి ప్రసంగించాడు అక్బరుద్దీన్ ఒవైసీ.

ఆ ప్రసంగంలోనే అక్బరుద్దీన్ ఒవైసీ అప్పటికింకా పరిష్కారం కాని రామజన్మభూమి కేసు గురించి మాట్లాడుతూ శ్రీరామచంద్రమూర్తి గురించి, ఆయన తల్లి కౌసల్యాదేవి గురించీ అవమానకరంగా దూషించాడు.

‘‘ప్రతీ వంద కిలోమీటర్లకూ భాష మారిపోతుందంటారు, సంస్కృతి మారిపోతుందంటారు, జీవన విధానం, ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, పద్ధతులూ అన్నీ మారిపోతాయని వారు చెబుతూ ఉంటారు. ఇక్కడ వాళ్ళ దేవుళ్ళ రూపాలు కూడా మారిపోతుంటాయి. ఎంత హాస్యాస్పదమో కదా’’ అని జూనియర్ ఒవైసీ హిందువుల బహుళ దేవతారాధన ప్రక్రియను అపహాస్యం చేస్తూ మాట్లాడాడు.

హిందువులను అవమానిస్తూ, అపహాస్యం చేస్తూ, హిందువులపై ద్వేషాన్ని పెంచేలాంటి వ్యాఖ్యలు చేసిన 2012 నాటి అక్బరుద్దీన్ ఒవైసీ ప్రసంగం మీద రెండు విద్వేష ప్రసంగం కేసులు నమోదయ్యాయి. ఆ రెండు కేసులనూ హైదరాబాద్ కోర్టు 2022లో కొట్టేసింది. ఇదీ హిందూదేశంలో హిందువులను నిందించేవారికి దక్కే ఆదరణ. ఆ ధైర్యంతోనే ఇప్పుడు మళ్ళీ మహారాష్ట్ర ఎన్నికల సందర్భంలో ఆ పాత ’15 నిమిషాలు పోలీసులను పక్కన పెట్టండి…’ అనే వ్యాఖ్యలను గుర్తుచేస్తూ పరోక్షంగా హిందువులను సర్వనాశనం చేస్తామని సంకేతాలు ఇస్తున్నాడు అక్బరుద్దీన్ ఒవైసీ.

Tags: AIMIMAkbaruddin Owaisiandhra today newsChhatrapati Sambhaji NagarElection CampaignHate SpeechHateful IncitementHinduphobic RhetoricInciting Hate Against HindusMaharashtra Assembly ElectionsSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ
general

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్
general

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు
general

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను
general

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి
general

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

Latest News

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

నేడు ఏపీలో భారీ వర్షాలు

నేడు ఏపీలో భారీ వర్షాలు

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

టీఆర్ఎఫ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి : భారత్

టీఆర్ఎఫ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి : భారత్

‘బ్రహ్మోస్ ముందు చైనా, పాక్ ఏడీఎస్‌లు దిగదుడుపే’

‘బ్రహ్మోస్ ముందు చైనా, పాక్ ఏడీఎస్‌లు దిగదుడుపే’

దేశ విచ్ఛిన్నానికి తమిళ అతివాద సంస్థ ప్రయత్నాలు, డీఎంకే వ్యూహాత్మక మౌనం-3

దేశ విచ్ఛిన్నానికి తమిళ అతివాద సంస్థ ప్రయత్నాలు, డీఎంకే వ్యూహాత్మక మౌనం-3

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.