Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home ఆధ్యాత్మికం

వసు బారస్ : దీపావళి ముందు ద్వాదశి నాడు గోవులను పూజించే పండుగ

Phaneendra by Phaneendra
Oct 28, 2024, 04:28 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఉత్తర భారతదేశంలో దీపావళి వేడుకలు ఇవాళ వసు బారస్ పండుగతో మొదలవుతున్నాయి. గోవత్స ద్వాదశి అని కూడా  పిలిచే ఈ పండుగ రోజును ఆవులు, ఆవుదూడలకు పూజలు చేస్తారు. ఈ పండుగ పూజలను ప్రదోష వేళ జరుపుకుంటారు. ఈ యేడాది భారతీయ కాలమానం ప్రకారం ఈ సాయంత్రం 6.04 గంటల నుంచి 8.34 గంటల వరకూ గోవులకు పూజ చేయాలి.

వసు అంటే సంపద. బారస్ అంటే పన్నెండు, అంటే ద్వాదశి తిథికి సంకేతం. మానవులకు, ప్రకృతికీ మధ్య పరస్పర ఆధార బంధాన్నీ సూచించే రోజిది. ప్రత్యేకించి మనకూ, గోసంపదకూ ఉండే అనుబంధాన్ని వేడుక జరుపుకునే పండుగ ఇది. హిందువులు గోవును తల్లిగా భావిస్తారు. ఆవు సంపదకు, సమృద్ధికీ ప్రతీక. ఉత్తర భారతదేశంలో ఈ పండుగ రోజు ఆవులకు గౌరవ సూచకంగా పాలు, గోధుమ ఉత్పత్తులు వాడరు. ఆవులను అలంకరించి, వాటికి గడ్డి మేపి, వాటిని పూజిస్తారు.

ఈ పండుగ రోజు భక్తులు తెల్లవారుజామునే లేచి, తమ ఆవులను పసుపు కుంకుమలతో అలంకరిస్తారు. వాటికి గోధుమలు, బెల్లం కలిపి తినిపిస్తారు. సాధారణంగా ఈరోజు ఇళ్ళలోని ఆడవారు ఉపవాసం ఉంటారు. ఆరోగ్యం, సంపద, సమృద్ధి, కుటుంబ సంక్షేమం కోసం గోవులను జాగ్రత్తగా చూసుకుంటామని వారు సంకల్పం తీసుకుంటారు. గోవులను పూజించడం వల్ల శ్రీకృష్ణ భగవానుడి ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు.

మహారాష్ట్రలో దీపావళి వేడుకలు వసు బారస్‌తోనే మొదలవుతాయి. ఇవాళ ప్రతీ ఇంటిముంగిలినీ వర్ణమయమైన ముగ్గులతో తీర్చిదిద్దుతారు. తామరలు, కలువలు, నెమళ్ళు, ఆవులు, చిన్నికృష్ణుడి పాదాలు… ఇలాంటి ముగ్గులు వేస్తారు. ప్రకృతి సహజ రంగులు, బియ్యంపిండి, పువ్వులతో ముగ్గులు మెరిసిపోతుంటాయి. దీపావళి పండుగ సందర్భంగా ఇళ్ళకు బంధువులు, అతిథులు రావడం నేటినుంచే మొదలవుతుంది. అలా ఈ పండుగ సమైక్యతను, ప్రకృతి పట్ల గౌరవాన్నీ, జీవిత విలువలనూ ప్రబోధిస్తుంది.

ఉత్తరభారతదేశంలో ఈ పండుగను, ప్రకృతిని గౌరవించి రక్షించుకోడానికి మనం నిబద్ధతను చాటుకునే రోజుగా జరుపుకుంటారు. మరీ ముఖ్యంగా మనకు జీవితాన్నీ ఆహారాన్నీ ఇచ్చే ఆవులను కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేసే సందర్భమిది. నిరాడంబరత, కృతజ్ఞత, ప్రకృతితో తాదాత్మ్యత అనే గుణాలను గుర్తుచేసే పర్వదినమిది.

Tags: andhra today newsDeepawaliFestival of CowsGovatsa DwadashiSLIDERTOP NEWSVasu Baras
ShareTweetSendShare

Related News

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి
general

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

general

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం
general

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ
general

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా
general

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

Latest News

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.