పొదిలి డిపో డ్రైవరుపై ప్రైవేటు బస్సు డ్రైవర్లు దాడికి దిగారు. సోమవారం రాత్రి కురిచేడు వద్ద ఈ దాడి చోటుచేసుకుంది. ఆర్టీసీ డ్రైవర్ సత్తార్ ప్రవేటు బస్సులకు దారి ఇవ్వలేదని కొందరు డ్రైవర్లు అతనిపై దాడికి దిగారు. పొదిలి నుంచి ఆర్టీసీ బస్సు హైదరాబాద్ వెళుతోండగా కురిచేడు వద్ద ఈ దాడి జరిగింది.
గాయపడ్డ డ్రైవర్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రైవేటు బస్సు డ్రైవర్ల దాడికి నిరసనగా పొదిలి డిపో వద్ద ఆర్టీసీ డ్రైవర్లు నిరసనకు దిగారు. ప్రైవేటు బస్సులను అడ్డుకున్నారు. పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. దాడికి దిగిన వారిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.