బెంగళూరు వేదికగా న్యూజిలాండ్తో జరుగుతోన్న తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో భారత్ 462 పరుగులు చేసింది. కివీస్కు 107 పరుగుల లక్ష్యం నిర్దేశించింది. సర్పరాజ్ ఖాన్ 195 బంతుల్లో 150 పరుగులు చేసి అరుదైన స్కోరు సాధించాడు. 18 ఫోర్లు, 3 సిక్సులు బాదాడు. రిషబ్ పంత్ 105 బంతుల్లో 99 పరుగులు చేశాడు. విరాట్ కొహ్లీ 70, రోహిత్ 52 పరుగులు చేశారు. జైస్వాల్ 32, రాహుల్ 12 పరుగులతో జట్టు స్కోరు పెంచారు.
ఒక దశలో 3 వికెట్ల నష్టానికి 400 పరుగులు చేసిన భారత్, కివీస్ కొత్త బంతి అందుకోగానే వేగంగా వికెట్లు కోల్పోయింది. కొత్త బంతితో 7 వికెట్లు కోల్పోయారు. హెన్రీ 3, విలియం 3, అజాద్ 2 వికెట్లు తీశారు. మొదటి ఇన్నింగ్స్లో భారత జట్టు 46 పరుగులకే ఆలౌటైంది. న్యూజిలాండ్ జట్టు 402 పరుగులు చేసింది.