పారిస్ పారాలింపిక్స్లో పతకాలు సాధించిన భారత అథ్లెట్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పతక విజేతలకు క్యాష్ ప్రైజ్ ప్రకటించింది.
గోల్డ్ మెడలిస్టులకు రూ.75 లక్షలు, రజత పతక విజేతలకు రూ. 50 లక్షలు, కాంస్యం సాధించిన క్రీడాకారులకు రూ.30 లక్షలు చొప్పున నగదు రివార్డు అందజేయనున్నట్లు కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు.
ఆర్చర్ శీతల్ దేవి మాదిరిగా మిక్స్డ్ టీమ్ ఈవెంట్లలో మెరుగైన ప్రదర్శనతో రాణించిన అథ్లెట్లకు రూ. 22.5 లక్షల చొప్పున అందించనున్నారు. విజేతల కోసం ఏర్పాటు చేసిన సన్మానం కార్యక్రమంలో ఈ ప్రకటన చేశారు.
లాస్ ఏంజెల్స్ వేదికగా 2028లో జరిగే పారాలింపిక్స్లో మన పారా అథ్లెట్లు మరిన్ని పతకాలు సాధించేలా ప్రోత్సాహిస్తామన్నారు.
పారాలింపిక్స్ -2016లో భారత్ 4 పతకాలు సాధించగా టోక్యోలో 19 పతకాలు , పారిస్లో 29 పతకాలు సాధించింది. ఈ దఫా మన అథ్లెట్లు అంచనాలకు మించి 7 స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్యాలు సాధించారు. పారిస్ పారాలింపిక్స్లో రాణించిన భారత అథ్లెట్ల బృందం మంగళవారం స్వదేశానికి రాగా భారీ స్వాగతం లభించింది.