విద్యుత్తు బిల్లులను గతంలోలా మొబైల్ నుంచి యూపీఐ ద్వారా చెల్లించవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో విద్యుత్తు బిల్లుల చెల్లింపులు సరళీకృతం చేసేందుకు మార్గం సుగమం అయింది. తెలంగాణలోని టీజీఎస్పీడీసీఎల్, టీజీఎన్పీడీసీఎల్, ఆంధ్రప్రదేశ్లోని ఏపీసీపీడీసీఎల్లు భారత్ బిల్ పేమెంట్ సిస్టం(బీబీపీఎస్)లో చేరడంతో చెల్లింపులు సులభం అయ్యాయి.
డిస్కంలు బీబీపీఎస్లోకి రావడంతో ఇకపై బ్యాంకులు, ఫిన్టెక్ యాప్లు, వెబ్సైట్లతో పాటు బీబీపీఎస్ ఆధారిత ప్లాట్ఫామ్ల ద్వారా కూడా సురక్షితంగా చెల్లింపులు చేయవచ్చు. ఈ విషయాన్ని ఎన్పీసీఐకి చెందిన భారత్ బిల్ పే లిమిటెడ్(బీబీఎల్) సీఈవో నూపూర్ చతుర్వేది వివరించారు.
రిజర్వ్ బ్యాంక్ జులై 1 నుంచి యూపీఐ ద్వారా నేరుగా విద్యుత్తు బిల్లుల చెల్లించడాన్ని నిలిపివేసింది. బీబీపీఎస్ ఆధారిత ప్లాట్ఫామ్ల ద్వారానే లావాదేవీలు జరగాలని నిర్దేశించింది. ఈ క్రమంలో విద్యుత్ సంస్థలు బీబీపీఎస్లోకి చేరాయి. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న టీజీఎస్పీడీసీఎల్ పరిధిలోని వినియోగదారులు ఫోన్ పే ద్వారా చెల్లింపులు చేస్తున్నారు.