పారిస్ ఒలింపిక్స్ లో శనివారం నాడు భారత్ కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. 25 మీటర్ల మహిళల పిస్టల్ ఈవెంట్లో ఫైనల్లో మను భాకర్ కు పతకం దక్కలేదు. ఆమె నాల్గో స్థానంతో సరిపెట్టుకోవడంతో పతకం చేజారింది.
ఆర్చరీలో దీపికా కుమారి సింగిల్స్ లో క్వార్టర్స్ కు దూసుకెళ్లింది. రౌండ్ 16లో భాగంగా జర్మనీ ప్లేయర్ మిచెల్లె క్రోపెన్ పై 6-4 తేడాతో విజయం సాధించింది. కాసేపట్లో అంటే సాయంత్రం 5.09 గంటలకు (భారత కాలమానం ప్రకారం) క్వార్టర్ ఫైనల్లో తలపడనుంది. క్వార్టర్స్ లో సుహ్యెన్ నామ్ లేదా మదలీనా అమైస్ట్రోయిలో ఒకరితో పోటీ పడాల్సి ఉంది.
నోరు పారేసుకున్న కర్ణాటక కాంగ్రెస్ హోంమంత్రి