Tuesday, July 8, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

‘బిహార్‌కు ప్రత్యేక హోదా ప్రతిపాదన ఏదీ లేదు’

Phaneendra by Phaneendra
Jul 22, 2024, 04:43 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

బిహార్‌కు ప్రత్యేకహోదా ఇచ్చే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్రప్రభుత్వం తెలియజేసింది. ఎన్డీయే కూటమి భాగస్వామ్య పార్టీ అయిన జనతాదళ్‌ యునైటెడ్‌, బిహార్‌కు ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ డిమాండ్ చేసింది. దానిగురించి పార్లమెంటులో ఇవాళ కేంద్రం జవాబిచ్చింది.

ఆర్థికాభివృద్ధి, పారిశ్రామికీకరణను ప్రోత్సహించేందుకు బిహార్‌ సహా వెనుకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చే ఆలోచన ఉందా అని జేడీయూ ఎంపీ రామ్‌ప్రీత్ మండల్‌ ప్రశ్నించారు. దానికి ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌధురి రాతపూర్వకంగా జవాబిచ్చారు. బిహార్‌కు ప్రత్యేకహోదా ఇచ్చే ప్రతిపాదన ఏదీ లేదని పార్లమెంట్‌ వేదికగా వెల్లడించారు.

ఎన్డీయేలో జేడీయూ మూడో అతిపెద్ద పార్టీ. 12మంది ఎంపీల బలం ఉంది. కేంద్రంలో మోదీ 3.0 ప్రభుత్వం ఏర్పడిన నాటినుంచీ జేడీయూ తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలన్న వాదనను పలుసందర్భాల్లో వినిపించింది. ఇటీవల ఆ పార్టీ తమకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినా ఆమోదిస్తామంటోంది.

ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు. 2014లో రాష్ట్రంలో టీడీపీ, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక కొన్నాళ్ళకు ప్రత్యేక హోదా కుదరదు, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పారు. దానికి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం అంగీకరించింది. అయితే 2019 ఎన్నికల   ముందు వైసీపీ ప్రత్యేక హోదా అంశాన్ని బలంగా లేవనెత్తింది. దాంతో నష్టపోతామని భావించిన టీడీపీ, ఎన్డీయే నుంచి బైటకు వచ్చి ప్రత్యేక హోదా పేరిట బీజేపీ, నరేంద్రమోదీకి వ్యతిరేకంగా పోరాడింది.

ఇప్పుడు 2024 ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ముందు టీడీపీ మళ్ళీ ఎన్డీయేలో చేరింది. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కూటమి అధికారంలోకి వచ్చింది. లోక్‌సభలో ఎన్డీయే కూటమిలో తెలుగుదేశం రెండోస్థానంలో నిలిచింది. మూడోస్థానంలో నిలబడిన జేడీయూ ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించిన ప్రతీసారీ తెలుగుదేశం వైఖరి గురించి ప్రశ్నలు వస్తున్నాయి. అయితే టీడీపీ వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది.

ఇవాళ పార్లమెంటులో బిహార్‌కు ప్రత్యేక హోదా ప్రతిపాదన ఏదీ లేదని కేంద్రమంత్రి స్పష్టం చేయడంతో ఆంధ్రప్రదేశ్‌కు కూడా ప్రత్యేక హోదా వచ్చే అవకాశం లేదని తేలిపోయింది. దీనిపై విపక్షాలు రచ్చ చేసే అవకాశముంది.

Tags: BiharLok SabhaPankaj ChaudhuryRasmprit MandalSLIDERSpecial Category StatusSpecial PackageTOP NEWS
ShareTweetSendShare

Related News

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ
general

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి
general

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు
general

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ
general

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర
general

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

Latest News

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.