Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home జాతీయ

‘కావడ్ యాత్ర మార్గంలోని దుకాణాలపై విక్రేతల పేర్లుండాలి’

యోగి సర్కారు నిర్ణయానికి సున్నీ మహిళల సమర్థన

Phaneendra by Phaneendra
Jul 19, 2024, 01:34 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఉత్తరప్రదేశ్‌లో జులై 22 నుంచి కావడ్ యాత్ర మొదలవుతోంది. ఆ సందర్భంగా ముజఫర్‌నగర్ జిల్లా యంత్రాంగం యాత్రకు ఐదు రోజుల ముందు అంటే జులై 17 నుంచి ఒక నిబంధన విధించింది. యాత్ర మార్గంలో ఆహారపదార్ధాలు అమ్మేవారు తమ పేర్లను దుకాణాలపై స్ఫుటంగా కనిపించేలా ప్రదర్శించాలి అన్నదే ఆ నిబంధన. యాత్రలో పాల్గొనే భక్తులకు ఎలాంటి అయోమయమూ కలగకుండా, ప్రజాజీవనానికి భంగం కలగజేసే ఎలాంటి అవాంతరాలూ తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు.  

ఆ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించాయి, కానీ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ ఒక సున్నీ ముస్లిం మహిళ మాట్లాడిన వీడియో రాష్ట్రవ్యాప్తంగా వైరల్ అయింది. ఆ వీడియోలో ఆమె ‘‘సున్నీలు, బరేల్వీలు అయిన మేమే నిజమైన ముస్లిములం. ఇలాంటి పనులన్నీ షియాలు చేస్తారు. మీరు వారిని ఒక గ్లాసు నీళ్ళు అడిగితే, వాళ్ళు మీకు నీళ్ళు ఇచ్చేముందు అందులో ఊస్తారు. మేము అలాంటి పని చేయము. అందుకే యోగి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం’’ అని స్పష్టంగా చెప్పింది.

ఆహార పదార్ధాలు, పండ్లు అమ్మేవారు వాటిపై ఉమ్ముతారా అని అడిగినప్పుడు షియా తెగకు చెందిన ముస్లిములు ఆ పని కచ్చితంగా చేస్తారని ఆమె తేల్చిచెప్పింది.

కావడ్ యాత్ర జరిగే మార్గంలోని హోటళ్ళు, ధాబాలు, తోపుడుబళ్ళపై వాటి యజమానులు లేదా నిర్వాహకుల పేర్లు స్పష్టంగా కనబడేలా కచ్చితంగా రాయాలని ముజఫర్‌నగర్ జిల్లా యాజమాన్యం ఆదేశాలు జారీచేసింది. ఆ ఉత్తర్వులు తమపట్ల వివక్ష కనబరుస్తున్నాయని ముస్లిములు విమర్శిస్తున్నారు. నిజానికి ఆ ఉత్తర్వుల్లో ముస్లిములు లేదా హైందవేతరులు మాత్రమే తమ పేర్లు వెల్లడించాలి అని లేదు, దుకాణదారులు అందరూ తమ పేర్లు ప్రకటించాల్సిందే అని మాత్రమే ఉంది.

కావడ్ యాత్రలో పాల్గొనేవారు ఎవరి దగ్గరనుంచైనా పండ్లు లేదా మరే ఇతర ఆహారపదార్ధాలు కొనుగోలు చేయవచ్చని, దానిపై ఎలాంటి ఆంక్షలూ లేవనీ ముజఫర్‌నగర్ ఎస్ఎస్‌పి స్పష్టంగా చెప్పారు. విక్రేత పేరు ప్రదర్శించాలన్న నియమం ఒక్క ముస్లిములకే కాదని, అందరికీ వర్తిస్తుందనీ చెప్పారు. ఆ విషయాన్ని తమ విమర్శకులు ఉద్దేశపూర్వకంగా దాచిపెడుతున్నారని వివరించారు.

సాధారణంగా ముస్లిములు నడిపే దుకాణాలకు హిందూ పేర్లు పెట్టడం చాలాచోట్ల జరుగుతూనే ఉంది. తద్వారా ఆ దుకాణాలు హిందువులవే అనే భ్రమ కలుగుతుంది. యుపిఐ ద్వారా చెల్లింపులు చేసినప్పుడు మాత్రమే విక్రేత అసలు పేరు తెలుస్తుంది. అందువల్ల, వినియోగదారులను, ప్రత్యేకించి కావడియాలను ఆకర్షించడానికి ముస్లింలు నిర్వహించే దుకాణాల విషయంలో ఆందోళన నెలకొంది.

దేశవ్యాప్తంగా పలు సందర్భాల్లో విక్రేతలు తాము విక్రయించే వస్తువుల మీద ఉమ్మి వేయడం, వాటిని నాకడం, కొన్నిసందర్భాల్లో మూత్రం విసర్జించడం వంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వాటి వీడియోలు వైరల్ అవుతున్నాయి. అటువంటి చర్యలకు పాల్పడుతున్న విక్రేతలపై అపనమ్మకం, ఆగ్రహం కలుగుతున్నాయి.

అటువంటి చర్యలను నివారించడానికి, కావడ్ యాత్ర చేసే భక్తుల ధార్మిక విశ్వాసాలు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోడానికే  యూపీ ప్రభుత్వం ఇటువంటి ఆంక్షలు విధించింది. దాన్ని సున్నీ తెగ ముస్లిములు కొందరు సమర్ధించడమూ పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.

Tags: Kanwar YatraMandatory Name DisplayMuzaffarnagar AdministrationSLIDERSpitting on FoodSunni MuslimsTOP NEWSUttar Pradesh
ShareTweetSendShare

Related News

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి
general

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

general

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం
general

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ
general

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా
general

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

Latest News

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.