సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్పై హత్యాయత్నం కేసు నమోదైంది. టీడీపీ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుంటూరు నగరపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపీ సీఐడీ డీజీగా సునీల్ కుమార్ పనిచేసిన కాలంలో తనను అక్రమంగా అరెస్ట్ చేయడంతోపాటు, హత్యాయత్నం చేశారని రఘురామరాజు ఫిర్యాదు చేసిన మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
వైసీపీ అధికారంలో ఉండగా రఘురామరాజును హైదరాబాద్లో అరెస్ట్ చేసి గుంటూరుకు తరలించారు. అప్పటి సీఎం జగన్మోహన్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై ఆయన్ను అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురిచేశారనే వార్తలు అప్పట్లో రాజకీయ చర్చకు దారితీశాయి. కోర్టు ఆదేశాల మేరకు రఘురామరాజును విడుదల చేశారు. వైసీపీ అధికారం కోల్పోగానే ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామరాజు గుంటూరు పోలీసులకు గత నెలలో ఫిర్యాదు చేశారు. దానిపై తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు.
మాజీ సీఎం జగన్మోహన్రెడ్డిపై కూడా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెంటుగా పని చేసిన ప్రభావతమ్మ, మరికొందరు సీఐడి, పోలీసు అధికారులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.