Thursday, July 3, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home జాతీయ

సనాతన ధర్మంలోకి ఘర్‌వాపసీ అయిన 30మంది ముస్లిములు

Phaneendra by Phaneendra
Jun 29, 2024, 04:15 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో 30మంది ముస్లిములు ఇస్లాం మతాన్ని వదిలిపెట్టి సనాతన ధర్మంలోకి తిరిగివచ్చిన సంఘటన చోటు చేసుకుంది. ‘సాఝా సంస్కృతి మంచ్’ అనే స్వచ్ఛంద సంస్థ ఆ ముస్లిములను స్వధర్మంలోకి తీసుకొచ్చే సంప్రదాయాన్ని పూర్తి చేసింది.

మధ్యప్రదేశ్ మతస్వేచ్ఛ చట్టం 2021 ప్రకారం 14మంది మహిళలు సహా మొత్తం 30 మంది ముస్లిములు సనాతన ధర్మంలోకి వచ్చారు. ఇండోర్‌లోని ప్రముఖ ఖజ్రానా గణేశ్ ఆలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. సాఝా సంస్కృతి మంచ్ అధ్యక్షుడు శ్యామ్ పవారీ, ఈ ముస్లిముల పూర్వీకులు హిందువులేననీ, వారు ఇండోర్, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండేవారనీ తెలియజేసారు.   

గణేశుడి మందిరంలో నిర్వహించిన ధార్మిక కార్యక్రమంలో ఈ ముస్లిములు సనాతన ధర్మంలోకి తిరిగి వచ్చారు. ఇప్పుడు 58ఏళ్ళ జమీర్ బీ జమునాబాయి అయింది. 34ఏళ్ళ నీలోఫర్ షేక్ పేరు నికితగా మారింది. 34ఏళ్ళ అక్సర్ షేక్ ఇప్పుడు ఆకాంక్షగా మారింది. అలా, మొత్తం 30మంది ముస్లిములు తమ ప్రాచీన సనాతన ధర్మంలోకి మళ్ళీ చేరుకున్నారు.

ఇస్లాంను వదిలిపెట్టి సనాతన ధర్మాన్ని ఆశ్రయిస్తున్న ముస్లిములు నిజానికి మతం మారడం లేదని, తమ సొంతగూటికి తిరిగివస్తున్నారనీ మాల్వా ప్రాంత విశ్వహిందూపరిషద్ నేత వ్యాఖ్యానించారు. రోహిత్ అనే యువకుడు కొంతకాలం క్రితం ఇస్లాంలోకి మతం మారాడు. ఇప్పుడతను మళ్ళీ సనాతన ధర్మంలోకి వచ్చేసాడు. ఇండోర్‌లోనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన ముస్లిములు కూడా ఇప్పుడు సనాతన ధర్మంలోకి అంటే తమ సొంత ఇంటికి తిరిగి వస్తున్నారు.

ఏప్రిల్ 27న ఖజ్రానా గణేశ్ మందిరంలో 9మంది ముస్లిములు ఘర్ వాపసీ అయ్యారు. పవిత్ర గంగాజలాన్ని, గోపంచకాన్నీ స్వీకరించి వారు సనాతన ధర్మంలోకి వచ్చేసారు. వారిలో ఆరుగురు ఇండోర్‌కు చెందినవారు కాగా మరో ముగ్గురు మాదసోర్ ప్రాంతానికి చెందినవారు.  

స్వధర్మంలోకి మళ్ళీ వచ్చిన ఈ ముస్లిములు, తాము స్వచ్ఛందంగానే తమ మతాన్ని వదులుకున్నామని జిల్లా అధికారులకు అఫిడవిట్ సమర్పించారు. 28మంది వ్యక్తులు ఇష్టపూర్తిగా హిందూధర్మంలోకి మారినట్లు తమకు సమాచారం వచ్చిందని స్థానిక డిఎస్‌పి వెల్లడించారు. వారిపై ఎవరూ ఒత్తిడి తెచ్చినట్లు గానీ, లేక వారిని ప్రలోభపెట్టినట్టు కానీ ఎలాంటి ఆరోపణలూ లేవన్నారు.

మధ్యప్రదేశ్ ప్రభుత్వం 2021లో మతస్వేచ్ఛ చట్టం చేసింది. దాని ప్రకారం మోసపూరితంగా లేదా ప్రలోభపెట్టి మతం మార్చడం నేరం. ఆ నేరానికి పాల్పడిన వారికి గరిష్ఠంగా పదేళ్ళ జైలుశిక్ష, లక్ష రూపాయల వరకూ జరిమానా విధిస్తారు.

Tags: Ghar WapsiIndoreKhajrana Ganesh MandirMadhya PradeshMuslims ConvertSanatan DharmaSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు
general

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ
general

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం
general

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ
general

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు
general

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

Latest News

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.