Wednesday, July 2, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home క్రైమ్ న్యూస్

పెళ్ళైన 14ఏళ్ళకు, తన భార్య ముస్లిం వివాహిత అని తెలిసి ప్రొఫెసర్ షాక్

Phaneendra by Phaneendra
Jun 28, 2024, 04:31 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

అమరేంద్ర త్రిపాఠీ అలహాబాద్ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు అసోంలోని గువాహటికి చెందిన ప్రతిభా తివారీతో 2011లో పెళ్ళయింది. కొద్దిరోజుల క్రితం ఆయనకు తన జీవితాన్ని అతలాకుతలం చేసే వాస్తవాలు తెలిసాయి. అవేంటంటే… తన భార్య తనకు భార్య అవడానికి ముందే మరో వ్యక్తికి భార్య. అప్పట్లో ఆమె ముస్లింగా ఉండేది. అలా 4ఏళ్ళు గడిపాక మళ్ళీ హిందువునని చెప్పుకుని అమరేంద్రను పెళ్ళి చేసుకుంది.

ప్రతిభా తివారీ మొదట మహరూఫ్ హసన్ అనే వ్యక్తిని పెళ్ళి చేసుకుంది. ముస్లింగా మారి మెహనాజ్ హసన్ అని పేరు మార్చుకుంది. అలా నాలుగేళ్ళు మహరూఫ్‌తో సంసారం చేసాక పుట్టింటికి వచ్చేసింది. తర్వాత ఆమె తల్లిదండ్రులు, సోదరి ఆమె గతాన్ని దాచిపెట్టారు. వెనక్కి వచ్చిన రెండే రెండు వారాల్లో ఆమెకు అలహాబాద్ యూనివర్సిటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న అమరేంద్ర త్రిపాఠీతో పెళ్ళి కుదిర్చారు. అలా 2011లో ప్రతిభ, అమరేంద్రలకు పెళ్ళయింది. వారికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు.

14ఏళ్ళు గడిచాక అమరేంద్రకు అసలు విషయం తెలియడంతో ఇప్పుడతను పోలీసులకు ఫిర్యాదు చేసాడు. తనను మోసగించి పెళ్ళి చేసుకుని తన జీవితాన్ని నాశనం చేసిందని ఆవేదన వ్యక్తం చేసాడు. అతని ఫిర్యాదు ప్రకారం… ప్రతిభ తన అత్తవారింట్లో ఎప్పుడూ సవ్యంగా ఉండలేదు. ప్రతీ చిన్నవిషయానికీ గొడవలు పెట్టుకునేది. చీటికీమాటికీ ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించేది. అమరేంద్ర తల్లిదండ్రుల గురించి చెడుగా ప్రచారం చేసింది. వారి వీడియోలు తీసి వాటిని మార్ఫింగ్ చేయించి సామాజిక మాధ్యమాల్లో వారిపై దుష్ప్రచారం చేసింది. మొత్తంమీద అత్తమామలను ఇంట్లోనుంచి వెళ్ళగొట్టింది. చివరికి అమరేంద్ర ఫొటోను కూడా అతని మహిళాసహోద్యోగులతో కలిపి అభ్యంతరకరంగా మార్చి సోషల్ మీడియాలో వైరల్ చేసింది.  

ఈ యేడాది మే 13న అమరేంద్రకు ఇంట్లో కొన్ని పత్రాలు దొరికాయి. వాటిని పరిశీలించినప్పుడు ఆమెకు 2007లో ఢిల్లీకి చెందిన యువకుడితో పెళ్ళయిందనీ, నాలుగేళ్ళు ఆ బంధంలో ఉందనీ తెలిసింది. గతంలో ఆమె ముస్లిం అనీ, ఆమె పేరు మెహనాజ్ అనీ వెల్లడైంది. ఆమె మొదటి పెళ్ళి, మతమార్పిడికి సంబంధించిన డాక్యుమెంట్లు అమరేంద్రకు దొరికాయి.

విషయం బైటపడిన తర్వాత ప్రతిభ, అమరేంద్రను వేధించసాగింది. అతన్ని, అతని తల్లినీ భౌతికంగా హింసించింది. ఒకదశలో అమరేంద్ర ముక్కు విరగ్గొట్టింది. తనను కట్నం కోసం వేధిస్తున్నాడని ఆరోపించింది. సుమారు నెలరోజులు ప్రతిభ వేధింపులు భరించిన అమరేంద్ర, ఎట్టకేలకు పోలీసులను ఆశ్రయించాడు. ప్రతిభ, ఆమె తల్లిదండ్రులు, ఆమె సోదరిపై సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసాడు.  

ప్రతిభకు గుట్కా తినే అలవాటు పెళ్ళికి ముందునుంచే ఉందనీ, ఆ విషయం తనకు పెళ్ళయిన ఏడాదికి తెలిసిందనీ అమరేంద్ర తన ఫిర్యాదులో ప్రస్తావించాడు. ఆమె చెడు అలవాట్ల గురించి ఎప్పుడు ప్రస్తావించినా గొడవ చేసేదనీ, ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించేదనీ చెప్పాడు. తన శీలం గురించి పుకార్లు పుట్టించి తప్పుడు ప్రచారాలు చేసిందని ఆవేదన చెందాడు. నిజానికి ఆమె తరచుగా ఇంటినుంచి వెళ్ళిపోతుండేదనీ, చాలాకాలం ఎక్కడెక్కడో ఉండి బుధ్ధి పుట్టినప్పుడు వెనక్కి వచ్చేదనీ చెప్పాడు. వారణాసిలో ఒక యువకుడితో ఎన్నోయేళ్ళ నుంచి సంబంధముందనీ వివరించాడు.

మే 23న ప్రతిభ అమరేంద్రను తమ ఇంటినుంచి గెంటేసింది. అప్పటినుంచి అమరేంద్ర విడిగా నివసిస్తున్నాడు. ఆమెపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు ఇచ్చాడు.

సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ రామాశ్రయ్ యాదవ్, తమ వద్దకు ఈ ఫిర్యాదు వచ్చినట్టు నిర్ధారించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

Tags: Allahabad UniversityAssistant ProfessorMarriage by CheatingReligious ConversionSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్
general

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్
general

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్

అమరావతి మహిళలపై సజ్జల అనుచిత వ్యాఖ్యలు : డీజీపీకి డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఫిర్యాదు
general

అమరావతి మహిళలపై సజ్జల అనుచిత వ్యాఖ్యలు : డీజీపీకి డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఫిర్యాదు

జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడే స్పాన్సర్
general

జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడే స్పాన్సర్

హనీమూన్‌కు వెళ్లిన జంట మిస్సింగ్
general

హనీమూన్‌కు వెళ్లిన జంట మిస్సింగ్

Latest News

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.