Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home అంతర్జాతీయం

రష్యాలో ప్రార్థనాస్థలాలపై దాడి, 15మంది మృతి

Phaneendra by Phaneendra
Jun 24, 2024, 09:51 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

రష్యాలోని దగెస్తాన్ ప్రాంతంలో గుర్తుతెలియని కొందరు దుండగులు ప్రార్థనాస్థలాలను లక్ష్యంగా చేసుకుని కాల్పులకు పాల్పడ్డారు. ఆ కాల్పులలో కనీసం 15మంది మరణించారు, పలువురికి గాయాలయ్యాయి.

రష్యా ఉత్తర కాకసస్‌లోని దగెస్తాన్ ప్రాంతంలో కొందరు ఆగంతకులు చర్చ్‌లు, సినగాగ్‌లతో (యూదుల ప్రార్థనా స్థలం) పాటు ఒక పోలీస్ పోస్ట్ మీద కాల్పులు జరిపారు.

దగెస్తాన్ ప్రాంతంలోని పెద్ద పట్టణం మకాచ్‌కలా, తీరప్రాంత పట్టణం దెర్బెంట్‌లలో ఈ కాల్పుల సంఘటనలు ఆదివారం సాయంత్రం ఒకే సమయంలో చోటు చేసుకున్నాయి. దెర్బెంట్‌లో సినగాగ్, చర్చ్ రెండింటికీ దుండగులు నిప్పుపెట్టారు.

దగెస్తాన్ గవర్నర్ సెర్గేయ్ మెలికోవ్ వాటిని ‘ఉగ్రవాద దాడులు’గా అభివర్ణించారు. మృతుల్లో ఒక చర్చి ఫాదర్, పలువరు సాధారణ పౌరులు, కొందరు పోలీసులు ఉన్నారని మెలికోవ్ వెల్లడించారు.

‘‘ఈ ఉగ్రవాద దాడుల వెనుక ఎవరి హస్తముందో, వారి లక్ష్యం ఏమిటో మాకు తెలుసు’’ అని మెలికోవ్ టెలిగ్రామ్ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. వారెవరో ఆయన స్పష్టం చేయలేదు, కానీ ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధం గురించే ఆయన ప్రస్తావించారని తెలుస్తోంది.

మకాచ్‌కలా, దెర్బెంట్ పట్టణాల్లో పరిస్థితిని పోలీసులు అదుపులోకి తీసుకొచ్చారని మెలికోవ్ తెలియజేసారు. దుండగులపై పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. పోలీసు కాల్పుల్లో మకాచ్‌కలా పట్టణంలో నలుగురు, దెర్బెంట్‌లో ఇద్దరు దుండగులు హతమయ్యారని మెలికోవ్ వెల్లడించారు.

15మంది మరణానికి సంతాపసూచకంగా సోమ, మంగళ, బుధవారాలు అంటే ఇవాళ్టి నుంచి ఎల్లుండి వరకూ దగెస్తాన్ ప్రాంతంలో శోకదినాలు ప్రకటించారు. ప్రభుత్వ కార్యాలయాలపై జెండాలు సగానికి దించారు. ఆ ప్రాంతంలో వినోద కార్యక్రమాలు అన్నింటినీ రద్దు చేసారు.

రష్యా ఇన్వెస్టిగేటివ్ కమిటీ ఈ ఘటనపై దర్యాప్తు మొదలుపెట్టింది. ఈ సంఘటనకు తామే బాధ్యులమంటూ ఇప్పటివరకూ ఏ సంస్థా ప్రకటించుకోలేదు.

మూడు నెలల క్రితం రష్యా రాజధాని మాస్కోలో ఐసిస్ ఉగ్రవాదుల దాడిలో 145 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. గత కొన్నేళ్ళలో రష్యా ఎదుర్కొన్న అతిపెద్ద దాడి అది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు జరిగిన దాడి కేవలం దగెస్తాన్ ప్రాంతంలోనే కాక రష్యా అంతటా కలకలం సృష్టించింది.

Tags: ChurchDagestanDerbentfiringMakhachkalaRussiaSergey MelikovSLIDERSynagogueTOP NEWS
ShareTweetSendShare

Related News

general

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ
general

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు
general

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ
general

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్
general

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

Latest News

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.